టార్గెట్‌లు సాధిస్తేనే గౌరవ వేతనం ఇస్తామంటున్నారు | Sakshi
Sakshi News home page

టార్గెట్‌లు సాధిస్తేనే గౌరవ వేతనం ఇస్తామంటున్నారు

Published Mon, Jun 18 2018 7:20 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : పశుగణాభివృద్ధి సంస్థలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న తమకు పశువుల గర్భధారణ విషయంలో టార్గెట్‌లు ఇస్తున్నారని, టార్గెట్‌ పూర్తి చేసిన ప్రాతిపదికన గౌరవ వేతనాలు ఇస్తామంటున్నారంటూ గోపాలమిత్రలు జగన్‌మోహన్‌రెడ్డికి తమ గోడును విన్నవించుకున్నారు. 2000వ సంవత్సరం నుంచి తాము పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు.జిల్లాలో 260 మంది పనిచేస్తున్నామని, పశుగణాభివృద్ధి సంస్థకు చెందిన నిధులతోనే తమ ప్రయోజనాలు సమకూర్చుతున్నారని, ప్రభుత్వం తగిన నిధులు బడ్జెట్‌లో కేటాయించడంలేదన్నారు. ఇన్సూరెన్స్‌ సదుపాయం లేక ఆరోగ్యరక్షణ లేకుండా పోయిందని, తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ జగన్‌మోహన్‌రెడ్డికి తమ సమస్యలను చెప్పుకున్నారు.

Advertisement
Advertisement