77ఎకరాల చెరువు ఉన్నా..తాగునీటికి ఇబ్బందే | Sakshi
Sakshi News home page

77ఎకరాల చెరువు ఉన్నా..తాగునీటికి ఇబ్బందే

Published Thu, Apr 5 2018 6:39 AM

People Sharing Their Sorrows To Ys Jagan - Sakshi

గుంటూరు : గామంలో 77 ఎకరాల మంచినీటి చెరువు ఉన్నా.. గ్రామానికి తాగునీరు అందడం లేదని బుడంపాడుకు చెందిన గాజులవర్తి విజయరాణి జననేత ఎదుట వాపోయారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా బుడంపాడులో జగన్‌ను కలసి సమస్యలు ఏకరువు పెట్టారు. ‘అన్నా.. గ్రామంలో పెద్ద చెరువు ఉన్నప్పటికీ ఫిల్టర్‌ కానీ నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామ ప్రజలు తాగునీటి అవసరాల కోసం గుంటూరు నుంచి నీటి సరఫరా జరుగుతోంది. అయితే వారానికి మూడు సార్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. తాగునీటికి తీవ్ర ఇబ్బందిగా ఉంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి మంచినీటి  ఎద్దడి తీర్చాలని వైఎస్‌ జగన్‌ను కోరారు.

Advertisement
Advertisement