అమరావతి/నెల్లూరు/కర్నూలు/కాకినాడ: రాష్ట్రంలో ఎక్కడా కరోనా వైరస్ (కోవిడ్–19) కేసులు లేవని వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 76 మంది కరోనా అనుమానితులకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు అందాయని.. వాటిలో 75 మందికి కరోనా లేదని తేలింది. ఇప్పటివరకు నెల్లూరులో మాత్రమే పాజిటివ్ కేసు నమోదైందని.. ఆ యువకుడు కూడా పూర్తిగా కోలుకున్నాడని స్పష్టం చేసింది. మరో 13 మందికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు రావాల్సి ఉందని తెలిపింది. నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మొత్తం 11 మందిని ప్రత్యేక వార్డుల్లో చేర్చి పరీక్షించగా.. 10 మందికి నెగెటివ్ వచ్చిందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
అది కరోనా మరణం కాదు
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్లో కరోనా అనుమానితురాలు సోమవారం మృతి చెందింది. వైద్య పరీక్షల్లో ఆమెకు కరోనా లేదని తేలిందని.. మెదడు వాపు వ్యాధి బారిన పడటంతో ఆమె మృతి చెందిందని వైద్యాధికారులు ప్రకటించారు. అంతర్వేదిపాలేనికి చెందిన ఆ మహిళ ఈ నెల 11న దుబాయ్ నుంచి స్వగ్రామానికి రాగా ముందుజాగ్రత్తగా ఆదివారం కాకినాడ జీజీహెచ్లోని ఐసోలేషన్ వార్డులో చేర్చి చికిత్స అందజేశారు. వైద్యులు ఆమె రక్తం, కళ్లె శాంపిల్స్ను తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి పంపారు. సోమవారం వేకువజామున ఆమె మృతి చెందింది. ఆమెకు కరోనా లేదని ల్యాబ్ రిపోర్టులు వచ్చాయని, ఆమె మెదడు వాపు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు చెప్పారు.
పూర్తిగా కోలుకున్న నెల్లూరు యువకుడు
Published Tue, Mar 17 2020 5:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు ఎస్వీ డిగ్రీ కళాశాలకు ముగ్గురు కమిటీ సభ్యులరాక
No Headline
ఎన్నికల భారతం పుస్తకావిష్కరణ
వృత్తిదారుల మోములో ఆనందం...
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
హైదరాబాద్లో ఈదురుగాలులతో కూడిన భారీవర్షం (ఫొటోలు)
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
తప్పక చదవండి
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement