- రేషన్ డీలర్ల కమీషన్ రూ.20 నుంచి రూ.70కి పెంపు
- మంత్రివర్గ నిర్ణయాలు వెల్లడించిన సీఎం
సాక్షి, విజయవాడ బ్యూరో : విజయవాడలో చేపట్టిన మూడు కృష్ణా పుష్కర పనులకు బిల్లులు చెల్లించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ బిల్లులపై ఆర్థిక శాఖ అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో నేరుగా మంత్రివర్గమే వాటిని క్లియర్ చేసింది. వీటికి ఆమోదం తెలిపేందుకే ప్రత్యేకంగా మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. వీటితోపాటు మరికొన్ని అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఆ వివరాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్తో కలిసి సీఎం స్వయంగా మీడియాకు వివరించారు. ఆయన చెప్పిన వివరాలిలా ఉన్నాయి.
► ప్రకాశం బ్యారేజీ ఎగువన దుర్గాఘాట్ పనుల్ని షార్ట్ టెండర్ పిలిచి రూ.42 కోట్లకు సోమా కన్స్ట్రక్షన్స్కు అప్పగించాం. ప్రకాశం బ్యారేజీ దిగువన విశ్వేశ్వరఘాట్ పనుల్ని సూర్య కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించాం. ప్రకాశం బ్యారేజీ ఎల్ఈడీ లైటింగ్ పనులను నిపుణుల కమిటీ విన్ సెమీ కండక్టర్స్ కంపెనీకి రూ.6.45 కోట్లకు ఆ పని అప్పగించింది. ఈ పనులకు ఆర్థిక శాఖ బిల్లులు చెల్లించే ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో వాటిని చెల్లించేందుకు మంత్రివర్గంలో ఆమోదం తెలిపాం.
► రేషన్ డీలర్ల కమీషన్ను రూ.20 నుంచి రూ.70కి పెంచాం. దీనివల్ల ప్రభుత్వంపై రూ.77 కోట్ల అదనపు భారం పడుతుంది. ఇంతే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఈక్విటీగా ఇస్తుంది. వినియోగదారులు ఆధార్ కార్డ్ ఆధారంగా రాష్ట్రంలోని ఏ రేషన్ షాపునుంచైనా సరుకులు తీసుకునే విధానాన్ని అమలుచేస్తాం. ఎవరైనా ఒక నెల రేషన్ తీసుకోకపోతే తర్వాత నెలలో దాన్ని తీసుకునే అవకాశం కల్పిస్తాం. మూడు నెలల రేషన్ను ఒకేసారి తీసుకునే ఏర్పాటుచేస్తాం.
► త్వరలో ప్రభుత్వాస్పత్రుల్లో క్లినికల్ నిపుణులను నియమిస్తాం. మన రాష్ట్రంలో పనిచేస్తున్న వారితోపాటు ఇతర రాష్ట్రాల్లో పనిచేసేవారు, ఎన్ఆర్ఐలు, విదేశీయులు, ఐక్యరాజ్యసమితి నుంచి వచ్చే నిపుణులు పార్ట్టైమ్గా ఉచిత సేవలందించవచ్చు.
ఏ రేషన్ షాపునుంచైనా సరుకులు
Published Wed, Jul 27 2016 1:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement