బ్యాంక్ ఎదుట రైతుల ఆందోళన | Sakshi
Sakshi News home page

బ్యాంక్ ఎదుట రైతుల ఆందోళన

Published Wed, Feb 4 2015 4:09 PM

farmers protest infront of alahabad bank for crop loan

గుంటూరు: పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ  రైతులు ఆందోళన చేశారు.  గుంటూరు జిల్లా తాడేపల్లి మండల కేంద్రంలోని అలహాబాద్ బ్యాంక్ ఎదుట బుధవారం రైతులు ధర్నా చేశారు. సుమారు 700 మంది రైతులు రెండు గంటలపాటు ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరకుని రైతులను శాంతింపజేయడంతో రైతులు ఆందోళన విరమించారు.

Advertisement
Advertisement