ఏ క్షణంలోనైనా ఆగిపోయే స్థితిలో 300 వాహనాలు
ఘటనా స్థలికి చేరుకోవడంలో తీవ్ర జాప్యం
ఎమర్జెన్సీ మెడికల్ పరికరాలు లేక బాధితుల ఆవేదన
హైదరాబాద్: ఫోన్ రాగానే కుయ్ కుయ్ మంటూ ప్రమాద స్థలానికి ఆగమేఘాలపై చేరుకోవాల్సిన 108 వాహనాలు నిర్వహణా లోపం, కాలం తీరిపోవటంతో కుయ్యో మొర్రో అంటూ మొరారుుస్తున్నారుు! బాధితులను తరలించాల్సిన ఆపద్బాంధవుల్లాంటి వాహనాలు డీజిల్ లేక ఎక్కడ ఆగిపోతాయో తెలియని దుస్థితి దాపురించింది.
అరిగిన టైర్లు.. ఆగుతున్న అంబులెన్స్లు
రాష్ట్రంలో 108 వాహనాల పరిస్థితి మరింత దిగజారింది. ఇప్పటికే తెలంగాణలో డీజిల్ లేక ఆగిపోతుండగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం వృద్ధాప్యం ముంచుకొచ్చి ఆగిపోతున్నాయి. బాధితులను ఆస్పత్రికి తరలించటంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సాధారణంగా ఫోన్ కాల్ వెళ్లిన 25 నిముషాల్లోగా వాహనం ఘటనా స్థలానికి చేరుకోవాలి. కానీ 40 నిముషాలకు కూడా 108 రాకపోవటంతో బాధితుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో 108 వాహనాలు 436 ఉన్నాయి. వాహనం 2 లక్షల కిలోమీటర్లు తిరిగిన తర్వాత మార్చడం లేదా పూర్తిస్థాయి మరమ్మతులు నిర్వహించాలి. రాష్ట్రంలో 300 వాహనాలు నాలుగు లక్షల కిలోమీటర్లకు పైగానే తిరిగాయి. ఇవన్నీ ఏ క్షణంలోనైనా ఆగిపోయే దుస్థితికి చేరుకున్నారుు. కొద్ది నెలలుగా పాత వాహనాలకు మరమ్మతులు చేయట్లేదు. టైర్లు అరిగిపోయిన వాహనాలైతే కొండ ప్రాంతాల్లో ఆగిపోతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నారుు.
పరికరాలు, మందుల్లేవ్
108 అంబులెన్సుల్లో 350కి పైగా వాహనాల్లో అత్యవసర వైద్య పరికరాలు, మందులు లేవు. ప్రమాదం బారిన పడ్డ బాధితుడికి తక్షణమే పల్స్ రేటు చూసేందుకు అత్యవసరమైన పల్సాక్సీ మీటర్లు లేవు. సుమారు రెండొందలకు పైగా వాహనాల్లో ఇవి లేకపోగా మరో 150 వాహనాల్లో పరికరాలు పనిచేయడం లేదు. గాయపడ్డ రోగిని సున్నితంగా అంబులెన్సులోకి తరలించటం, ఆస్పత్రిలోకి తీసుకెళ్లడంలో కీలకమైన కొలాప్సిబుల్ స్ట్రెచర్ (ట్రాలీతో కూడినవి) లాంటి జాగ్రత్తలు తీసుకోకపోవటంతో బాధితులు వేదనకు గురవుతున్నారు. కృత్రిమ శ్వాసనందించే అంబ్యూబ్యాగ్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో ఇచ్చే ట్రమడాల్ హైడ్రోక్లోరైడ్ ఇంజక్షన్, మిడజోలెమ్ (5ఎంఎల్) ఇంజక్షన్, బుస్కొపాన్ ఇంజక్షన్, థియోపైలిన్ (2ఎంఎల్) ఇంజక్షన్లూ అందుబాటులో లేవు.
కొత్త వాహనాలకు ప్రతిపాదనలు
రాష్ట్రంలో 150 కొత్త 108 వాహనాల కొనుగోలుకు ప్రతిపాదనలు పంపినట్టు కుటుంబ సంక్షేమశాఖ అధికారులు తెలిపారు. ఒక్కో వాహనం రూ.11 లక్షల వ్యయంతో సుమారు రూ.16.50 కోట్లు అవసరమని అంచనా. అత్యవసర మెడికల్ టెక్నాలజీకి సంబంధించిన పరికరాలను సైతం రూ.6 కోట్ల వ్యయంతో కొనేందుకు అంచనాలు రూపొందించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
దుస్థితిలో ‘108’ వాహనాలు
Published Tue, Sep 30 2014 3:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement