అర్జీలకు అడ్డగోలుగా కత్తెర
అర్హత ఉన్నా 23 వేల మందిపింఛను తిరస్కరణ
జన్మభూమి కమిటీలదే పైచేయి
విజయవాడ : జిల్లాలో సంక్షేమ పథకాల్లో అడ్డగోలు కత్తిరింపులు మొదల య్యాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికార పార్టీ అనేక సాకులు చూపుతూ ఒక్కొక్కటిగా అటకెక్కిస్తోంది. ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛను ఇస్తానని విస్తృత ప్రచారం చేసిన చంద్రబాబు హామీలకు, జిల్లాలో పరిస్థితికి పొంతన కనిపించటం లేదు. అన్ని అర్హతలూ ఉన్నా రేషన్ కార్డు లేదని, ఆధార్ కార్డు లేదని, పొలం ఎక్కువ ఉందని, ఇంటికి ఒక్కటే పింఛను అని, వైకల్యం తక్కువగా ఉందని ఇలా అనేక అడ్డగోలు సాకులు చూపి జిల్లాలో వేలాది మందికి పింఛన్లు తిరస్కరించారు. దీంతోపాటు అధికార పార్టీ కనుసన్నల్లో ఉండే జన్మభూమి గ్రామ కమిటీలకు అర్హులు నచ్చకపోయినా పింఛను అందని దారుణ పరిస్థితులు
నెలకొన్నాయి.
5.79 లక్షల దరఖాస్తులు...
టీడీపీ అధికారంలోకొచ్చాక 2014 అక్టోబర్లో, 2015లో జూన్లో, ఈ ఏడాది జనవరిలో జన్మభూమి సభలు జరిగాయి. ఈ మూడు విడతల్లో వివిధ పథకాల కోసం ప్రజల నుంచి 5.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 5.75 లక్షల అర్జీలు పరిష్కరించినట్లు అధికారులు రికార్డుల్లో చూపారు. మిగిలిన 3,927 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు చూపించారు. అయితే ఈ ఏడాది జన్మభూమిలో అందిన దరఖాస్తుల్ని ఇంకా పూర్తి స్థాయిలో పరిశీలించి మండల కార్యాలయాల్లో అప్లోడ్ చేసే పనుల్లో ఉన్నారు. జిల్లాలో మొత్తం 3,35,715 పింఛన్లు ఉన్నాయి. గడిచిన రెండు జన్మభూమి సభల్లో కలిపి వికలాంగుల పింఛన్ల కోసం 74,871 దరఖాస్తులు అందగా, వాటిలో 11,291 తిరస్కరించారు. వైకల్యం 40 శాతం కంటే ఒక్క శాతం తక్కువున్నా పింఛనుకు అనర్హులేనని అధికారులు ప్రకటించినా, తిరస్కరణకు గురైన వారిలో అనేకమంది 40 శాతం కంటే ఎక్కువగా వైకల్యం ఉన్నవారే కావటం గమనార్హం. మరోపక్క వృద్ధాప్య పింఛన్ల అర్జీల్లో 12 వేల పైచిలుకు తిరస్కరించారు.
ఇంటికి ఒకటే పింఛను...
గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో 60 ఏళ్లు దాటినవారు ఎంతమంది ఉన్నా పింఛను మంజూరు చేసేవారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పింఛను మొత్తం పెంచి దానిని కత్తిరింపులో సర్దుబాటు చేశారు. ఇంటికి ఒకటే పింఛను అని తేల్చిచెప్పారు. దీంతో వేలాదిమంది వృద్ధులు పింఛన్లు పొందలేక నెలవారీ ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు.
పింఛను.. వంచన
Published Tue, Feb 9 2016 1:09 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement