-
AP: ఓటు వేసిన 102 ఏళ్ల వృద్ధురాలు
పాలకోడేరు: ఓటు ఎంత విలువైనదో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరు మండలం, కుముదవల్లి గ్రామంలో 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు వి.లక్ష్మీ నరసమ్మ శనివారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి ఓటు వేయించారు. వయో వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించి హోం ఓటింగ్ రెండోరోజైన శనివారం కూడా కొనసాగింది. గొల్లలకోడేరు, మోగల్లు, కోరుకొల్లు, గరగపర్రు గ్రామాల్లోని వారంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
పవన్ సభ అట్టర్ ప్లాప్
గుడివాడరూరల్: వారాహియాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్కల్యాణ్ శనివారం గుడివాడ నెహ్రూచౌక్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయింది. సభకు భారీ ఏర్పాట్లు చేశామని కూటమి నేతలు చెప్పిన మాటలన్నీ ఒట్టివేనని తేలిపోయాయి. ఉదయం 11 గంటలకు పవన్ హాజరవుతారని చెప్పగా 12.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. పవన్ వచ్చే సరికి పట్టుమని మూడు వేల మంది కూడా లేరు. దీంతో కూటమి అభ్యర్థులు, నాయకులపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పవన్ ప్రసంగం మొదలయ్యే సమయానికి కేవలం 2 వేల మంది జనాలు లేకపోవడంలో పవన్ ప్రసంగం చప్పగా సాగింది. సభా ప్రాంగణం వద్ద సరిగా ఏర్పాట్లు కూడా చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ సభ ఫెయిల్ కావడంతో కూటమి నేతల్లో ఓటమి భయం నెలకొంది. కుమ్ములాటలే కారణమా...? పవన్ బహిరంగ సభ ఫెయిల్ కావడానికి నియోజకవర్గం టీడీపీలో కుమ్ములాటలే కారణమా అని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్న వెనిగండ్ల రాము ఒంటెద్దు పోకడలతోనే టీడీపీలో కుమ్ములాటలు ఎక్కువయ్యాయని ఆ పార్టీ నాయకులే బాహాటంగా పేర్కొంటున్నారు. తాను జీతం ఇచ్చి నియమించుకున్న వారిని తప్ప జనసేన, బీజేపీ నేతలతో పాటు టీడీపీ సీనియర్ నాయకులను రాము పట్టించుకోవడం లేదని అంటున్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదనేది వాపోతున్నారు. కేవలం తన సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారని, బీజేపీ, జనసేన దళిత నేతలకు కనీస గుర్తింపు ఇవ్వడం లేదని చెబుతున్నారు. తాము పార్టీ కోసం కష్టపడుతున్నా పొత్తు ధర్మాన్ని పాటించకుండా తమను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు సైతం పిలవకుండా రాము వ్యవహరిస్తున్న తీరుపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రచారానికి వచ్చిన సమయంలోనూ కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై సొంత పార్టీతో పాటు జనసేన, బీజేపీ నాయకులు పెదవి విరుస్తున్నారు.తూతూ మంత్రంగా సాగిన పవన్ ప్రసంగం బహిరంగ సభలో జనం లేకపోవడంతో పవన్ ప్రసంగం తూతూ మంత్రంగా సాగింది. ఎప్పుడు గుడివాడ వచ్చిన ఒకే విధంగా పవన్ మాట్లాడటం, స్థానిక నాయకులు ఇచ్చే పేపర్లు చదివి వెళ్లిపోవడం మినహా గుడివాడకు తాము ఏమి చేస్తామనే అంశం చెప్పకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన ప్రతిసారీ పేకాట, మట్టికి సంబంధించి మాత్రమే పవన్తో గుడివాడ నాయకులు మాట్లాడించడం పట్ల ప్రజలు పట్టించుకోవడం మానేశారు. చంద్రబాబు, టీడీపీ అగ్రనాయకులు వస్తే మాత్రం మంచినీళ్ల ప్రాయంగా రాము డబ్బు ఖర్చు పెట్టే వాడని, పవన్ వస్తే కనీస ఏర్పాట్లు చేయడం అటు ఉంచితే ప్రజలను సైతం తీసుకురావడంలో విఫలమయ్యాడని విమర్శిస్తున్నారు. మరోసారి ఓటమి ఖాయమనే భావనలోకి కూటమి నేతలు వచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఎదుర్కొనే సత్తా టీడీపీకి లేదని, మరోసారి ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ప్రజలు పేర్కొంటున్నారు. -
అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
జి.కొండూరు: పదవీ కాంక్షతో తరచూ పార్టీలు మారే ఆనవాయితీ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వసంత వెంకటకృష్ణప్రసాద్ అబద్ధ ప్రచారాలను తలకెత్తుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారానంటూ గొప్పలు చెప్పుకొంటున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభంజనంలో 2019లో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన, తనకు అత్యంత ప్రియమైన టీడీపీతో గత ఐదేళ్లూ గుట్టుగా సంబంధాలు కొనసాగించారు. మరోవైపు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీని విచి్ఛన్నం చేయడమే లక్ష్యంగా పార్టీలో గ్రూపులను ప్రోత్సహించి వెన్నుపోటు రాజకీయాలతో చెలరేగిపోయారు. వసంత తీరును పసిగట్టిన వైఎస్సార్ సీపీ అధిస్టానం ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్న క్రమంలో పరువు దక్కించుకునేందుకు ఆనవాయితీ ప్రకారం ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. తన పాచిక పారలేదన్న దుగ్ధతో రాజకీయంగా భవిష్యత్ ఇచ్చిన పారీ్టపై అసత్యాలు గుప్పిస్తున్నారు. ఇన్చార్జ్లదే పెత్తనం వసంత వెంకటకృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొద్ది నెలల్లోనే తన సొంత వ్యక్తులను మండలానికి ఒకరు చొప్పున ఇన్చార్జులుగా నియమించారు. ఎమ్మెల్యేతో ఏ పని చేయించుకోవాలన్నా ఇన్చార్జ్లను సంప్రదించాల్సి రావడంతో తమకు విలువ లేదంటూ కొందరు సీనియర్ నాయకులు పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్ సీపీకి దూరంగా జరిగారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడిన కేడర్ను గాలికి వదిలేసి అధికారంలోకి వచ్చిన తర్వాత స్వార్థ ప్రయోజనాల కోసం జంపింగ్లు చేసిన వ్యక్తులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. దీంతో ప్రతి గ్రామంలో ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడిన నాయకులు ఒక గ్రూపుగా, పదవులు పొందిన నాయకులు మరో గ్రూపుగా విడిపోయారు. ముందస్తు కుట్రలో భాగంగా ఈ గ్రూపులను సమన్వయం చేయకుండా అలానే వదిలేశారు. వసంతపై అసంతృప్తితో పారీ్టలోని రెండో కేడర్గా ఏర్పడిన నాయకులకు మంత్రి జోగి రమేష్ అండగా నిలబడ్డారు. దీనిని సాకుగా చూపుతూ జోగి రమేష్ గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ వసంత కృష్ణప్రసాద్ అసత్య ప్రచారం చేశారు. తన కుట్రలో భాగంగా చివరికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీ మారేందుకు సిద్ధమైన ఆయన తన తండ్రి వసంత నాగేశ్వరరావుతో సైతం ప్రభుత్వంపై విమర్శలు చేయించారు.సీటిచ్చినా పార్టీ మారారంట..! ఐదేళ్లు మైలవరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారం¿ోత్సవాల్లో ఫొటోలకు ఫోజులిచ్చిన వసంత వెంకట కృష్ణప్రసాద్ నేడు మాట మార్చారు. నియోజక వర్గంలో అభివృద్ధి జరగనందుకే ఎమ్మెల్యే సీటు ఇచ్చినా కాదని పార్టీ మారినట్లు గొప్పలు చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు సామాన్యుడు కావ డంతో ఆయనపై మాట్లాడేందుకు ఏమీ లేక నేరుగా ముఖ్యమంత్రిపై రోజూ అరిగిపోయిన రికార్డులా పచ్చి అబద్ధాలను గుప్పిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు టీడీపీ కేడర్కు సైతం విసుగుతెప్పిస్తున్నాయి. ఐదేళ్లపాటు తాను చేసిన వెన్నుపోటు రాజకీయాలను పసిగట్టే వైఎస్సార్ సీపీ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙస్తోందని గుర్తించిన వసంత, పదవీ కాంక్షతో పార్టీ మారారు. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైఎస్సార్ సీపీలో ఎమ్మెల్యే సీటిచ్చినా కాదని పార్టీ మారినట్లు గొప్పలు చెబుతున్నా రని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
AP Election Updates May 5th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 5th May... 8:56 AM, May 5th, 2024నేడు ఏపీకి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాకశ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం బత్తలపల్లి రోడ్డులోని సీఎన్బీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగించనున్న అమిత్షావైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న రాజ్నాథ్ సింగ్ 8:51 AM, May 5th, 2024అవన్నీ అపోహలేల్యాండ్ టైట్లింగ్ చట్టంతో భూములకు మరింత రక్షణఈ చట్టం అమల్లోకి వస్తే భూములు, ఆస్తులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుందిఅన్ని పత్రాలూ యజమానుల వద్దే ఉంటాయి.. ప్రభుత్వం వద్ద కేవలం రికార్డులేఈ చట్టం కోర్టు ద్వారాలు మూసేయదు.. కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తుందిహక్కుల నిరూపణకు ఇప్పుడున్న చట్టాలు అంతిమ సాక్ష్యాలు కావుఅందుకే ఈ చట్టం అవసరమవుతోందిభూచట్టాల నిపుణుడు, నల్సార్ ప్రొఫెసర్ ఎం. సునీల్కుమార్7:37 AM, May 5th, 2024జనం.. జనం.. ప్రభంజనంసీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలకు పోటెత్తిన ప్రజానీకంహిందూపురంలో 43 డిగ్రీల ఎండనూ లెక్కచేయని జనంనియోజకవర్గ చరిత్రలో ఏ నాయకుడికి లేని రీతిలో బ్రహ్మరథంఈసారి హిందూపురం వైఎస్సార్సీపీదే అంటున్న రాజకీయ పరిశీలకులుపలమనేరులో వర్షాన్ని కూడా లెక్క చేయని ప్రజలునెల్లూరులో జననీరాజనం 7:25 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్ చట్టం వ్యవహారం.. టీడీపీపై ఈసీ కొరడాదుష్ప్రచారంపై సీఐడీ దర్యాప్తుప్రజలను భయాందోళనలకు గురిచేయడంపై ఈసీ సీరియస్ ఎన్నికల నిబంధనలకు పాతరేస్తున్నారని మండిపాటు వైఎస్సార్సీపీ ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న కమిషన్తక్షణం దీనిపై దర్యాప్తుచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం7:16 AM, May 5th, 2024కళ్లు గద్దెపై.. బుద్ధి భూమిలోల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై బరితెగించి అబద్ధాలులేని వ్యక్తులకు అన్యాయం జరిగిందంటూ రామోజీ ఆక్రోశం కల్పిత పాత్రలను సృష్టించి, ఏదో జరిగిపోయిందని ఆక్రందనరిజిస్టరే లేనపుడు అందులో కొందరి పేర్లు లేకపోవటం సాధ్యమా?చట్టం దేవుడెరుగు... చట్టానికి సంబంధించిన రూల్సే రాలేదని తెలీదా?రూల్స్ వచ్చాక.. వాటిపై సమగ్ర చర్చ జరిగిన తరవాతే తుది రూపుపైపెచ్చు రీసర్వే పూర్తయ్యాకే ఈ చట్టాన్ని అమలు చేయటం సాధ్యంఇప్పటికి 4 వేల గ్రామాల్లోనే రీ సర్వే పూర్తి.. ఇంకా 13 వేల గ్రామాల్లో పెండింగ్అది పూర్తయి.. రూల్స్ ఖరారయ్యాక కదా చట్టం అమలు గురించి మాట్లాడేది..అయినా అన్ని రాష్ట్రాలనూ అమలు చేయమంటున్నది కేంద్రమే కదా!అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తేనే... ఇక్కడా చేస్తామని చెబుతున్న రాష్ట్రంమోదీ ముందు తల ఊపి.. బయట మాత్రం విష ప్రచారం చేస్తున్న బాబుబాబునెవరూ నమ్మటం లేదని గ్రహించి... మారీచుడి పాత్రలోకి రామోజీజనాన్ని భయపెట్టడానికి అబద్ధాలే అ్రస్తాలుగా మాయా యుద్ధంపోలింగ్ వరకూ ఈ ఒక్క అంశంమీదే మాట్లాడాలని ‘ఎల్లో’ తాఖీదుమిగతావన్నీ పక్కనబెట్టి విస్తృతంగా విష ప్రచారం చేస్తున్న పచ్చ మంద7:14 AM, May 5th, 2024బాబుకు భంగపాటు.. బెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంబెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపించేందుకు కుతంత్రంలబ్ధిదారుల నమోదు పేరిట కుట్రఓటర్ల జాబితా వివరాల దుర్వినియోగంతీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక7:12 AM, May 5th, 2024లాక్కునేవి కాదు..ఇచ్చే చేతులివి..నిషేధిత జాబితా నుంచి 35 లక్షల ఎకరాల తొలగింపుసీఎం జగన్ సంస్కరణలతో ‘రెవెన్యూ’లో సులభమైన పాలన వందల ఏళ్ల నాటి చిక్కుముళ్లకు పరిష్కారంచుక్కల భూములు, సర్విస్ ఈనాం, షరతుల గల పట్టా భూములకు విముక్తి27.41 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులులంక భూములకు అసైన్మెంట్ పట్టాలుకుప్పలు తెప్పలుగా ఉన్న రెవెన్యూ సమస్యలన్నింటికీ పరిష్కారంనిరుపేదలకు 46 వేల ఎకరాల భూముల పంపిణీ శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం 951 ఎకరాలుకొత్త రిజిస్ట్రేషన్ల విధానం.. ఆటో మ్యుటేషన్చరిత్ర సృష్టించిన 30.61 లక్షల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖ స్వరూపాన్ని మార్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు6:59 AM, May 5th, 2024మళ్లీ దోపిడీకి తెరపైకి..మాజీ ఎమ్మెల్యే అరాచకాలెన్నో!గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబుకు తమ్ముడు వక్ఫ్ ఆస్తులు చెరబట్టి దోచేసిన ఘనుడుటిప్పు షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపులో చేతివాటంప్రతి పనికీ రేటుగట్టి వసూలు చేసిన చరిత్ర బెదిరింపులు, దౌర్జన్యాలు షరామామూలేఏకంగా పది క్రిమినల్ కేసులు 6:56 AM, May 5th, 2024మీ భూమికి భద్రత.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై బాబు దుష్ప్రచారం: సీఎం జగన్చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటుమీ భూములకు ప్రభుత్వం గ్యారంటీ..రిజిస్ట్రేషన్ తర్వాత రైతులకే డాక్యుమెంట్లుఅన్నదాతలు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదుభూ తగాదాలకు శాశ్వత పరిష్కారంగా వందేళ్ల తర్వాత రీసర్వేపేదలకు భూములిచ్చేది జగన్.. లాక్కునేది చంద్రబాబే -
ఎన్నికల ప్రచారంలో ఏయూ ప్రొఫెసర్
విశాఖ సిటీ: ఆమె ఆంధ్రా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్. కానీ నిబంధనలకు విరుద్ధంగా గాజువాకలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో రోడ్డెక్కారు. ఇంటింటికీ తిరుగుతూ టీడీపీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఒక ప్రొఫెసర్ అయి ఉండి బహిరంగంగానే ఎన్నికల ప్రచారంలో పొల్గొనడం విశేషం. ఆమె ఎవరో కాదు.. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు సతీమణి పి.లావణ్యదేవి. గాజువాకలో గెలుపు కోసం పల్లా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రెండు నెలల క్రితం వరకు ధీమాతో ఉన్న పల్లా శ్రీనివాసరావుకు.. మంత్రి గుడివాడ అమర్నాథ్ గాజువాక నుంచి పోటీకి దిగడంతో చెమటలు పడుతున్నాయి. గుడివాడ అమర్ ప్రతి ఒక్కరినీ కలుపుకుంటూ విస్తృతంగా పర్యటిస్తూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. దీంతో ప్రచారంలో వెనుకబడిన పల్లా తన కుటుంబ సభ్యులను అందరినీ ప్రచారంలోకి దింపారు. ఇందులో అతని సతీమణి ఏయూలో ప్రొఫెసర్ అయిన పి.లావణ్యదేవి కూడా ఉన్నారు.ఎన్నికల నియమావళి ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు. కనీసం ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు సైతం రాజకీయ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సి ఉంది. అయినప్పటికీ పల్లా సతీమణి లావణ్య మాత్రం గాజువాకలో బహిరంగంగానే ప్రచారంలో పాల్గొంటున్నారు. తన భర్తను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయనున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement