-
కోలుకుంటున్న పేలుడు బాధితులు
సాక్షి,బళ్లారి: నగరంలోని తేరువీధిలో ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్లో గురువారం సాయంత్రం ఉన్న ఫళంగా పేలుడు జరిగి ఐదు మందికి తీవ్ర గాయాలైన ఘటనలో బాధితులను వెంటనే ఆస్పత్రిలో చేర్పించడంతో కోలుకుంటున్నారు. ఏసీలోకి గ్యాస్ నింపుతుండగా పేలుడు సంభవించడంతో గ్యాస్ నింపే టెక్నిషియన్లు అహమ్మద్ భాష, సయ్యద్ తబ్రేజ్ భాష, సయ్యద్ జుబేదార్లతో పాటు జ్యువెలర్స్లో పని చేస్తున్న అరుణ్, నింగప్పలు కూడా తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. వారిని విమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. రెండు రోజులుగా చికిత్స అందిస్తుండడంతో గాయపడిన వారు కోలుకుంటున్నారని, ప్రాణాపాయం లేదని, అయితే శరీరంపై అక్కడక్కడ చర్మం కాలిపోవడంతో పూర్తిగా కోలుకోవడానికి కొంతకాలం పడుతుందని వైద్యులు వెల్లడించారు. వడదెబ్బకు బస్సు కండక్టర్ మృతిరాయచూరు రూరల్: జిల్లాలో రోజురోజుకు ఎండల తీవ్రత అధికమైన నేపథ్యంలో వడ దెబ్బకు గురై ఇద్దరు మరణించారు. జిల్లాలోని మస్కిలో శనివారం ఆర్టీసీ బస్సు కండక్టర్ మృతి చెందిన ఘటన జరిగింది. వివరాలు..మస్కి తాలూకా హసమకల్కు చెందిన కండక్టర్ మల్లయ్య(45) బెంగళూరులోని బీఎంటీసీలో విధులు నిర్వహిస్తుండేవాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చిన కండక్టర్ సరుకుల కొనుగోలు కోసం బజారుకు వచ్చి ఠారెత్తిస్తున్న ఎండలతో వడదెబ్బ బారిన పడి అస్వస్థతకు గురై ప్రాణాలు వదిలాడు. మస్కి పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా మరో ఘటనలో రాయచూరు తాలూకా జాలిబెంచిలో పొలం నుంచి ఇంటికొస్తుండగా మండుటెండలతో దారిలోనే అస్వస్థతకు గురైన ఆంజనేయ(45) అనే రైతు కన్నుమూశాడు. వలస ఓటర్ల కోసం ప్రత్యేక రైలు సదుపాయంరాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలో వర్షాలు లేక రైతులు, వ్యవసాయ కూలీలు ఇతర చోట్లకు వలస వెళ్లిన ఓటర్లతో ఓటు వేయించడానికి రాజకీయ నాయకులు సిద్ధమయ్యారు. ముఖ్యంగా కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాల్లో వ్యవసాయ కూలీలకు పనులు లభించక బతుకుదెరువు కోసం బెంగళూరు, హైదరాబాద్, షోలాపూర్, ముంబై, గోవా, చైన్నె తదితర సుదూర ప్రాంతాలకు జీవనోపాధి కోసం వలస వెళ్లారు. వారి కోసం ఈ నెల 7న జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా ప్రత్యేక రైలును నడుపుతున్నారు. ఇందుకోసం కేంద్ర రైల్వే శాఖకు ముగ్గురు ఎంపీలు లేఖలు రాసి రైలును ఏర్పాటు చేయించినట్లు సమాచారం. మే 6వ తేదీ రాత్రి 11 గంటలకు బెంగళూరులోని యశ్వంతపుర రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే ఈ రైలులో రాయచూరు, యాదగిరి, కలబుర్గి, బీదర్ జిల్లాల వలస కార్మికులను తీసుకొని రావడానికి సన్నాహాలు చేపట్టారు. ఓటేసిన తర్వాత మే 7న రాత్రి 12 గంటలకు బీదర్లో బయలుదేరే రైలులో వందలాది మంది బెంగళూరుకు తిరుగు ప్రయాణం అవుతారు. పంచ గ్యారెంటీలే విజయ సోపానాలు రాయచూరు రూరల్: కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ పేదలను పట్టించుకోవడంలో విఫలమైందని, లోక్సభ ఎన్నికల్లో పంచ గ్యారెంటీలే కాంగ్రెస్ విజయానికి సోపానాలని కేపీసీసీ ఎస్సీ రాష్ట్ర సంచాలకుడు సుధామ అభిప్రాయపడ్డారు. శనివారం పాత్రికేయుల భవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ వంద స్మార్ట్ సిటీలు ఎక్కడ, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ, పేదల ఖాతాల్లోకి రూ.15 లక్షలు వేసింది ఎక్కడ అని ప్రశ్నించారు. కులమతాల మధ్య సంఘర్షణలను రేపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పంచ గ్యారెంటీలతో ప్రజల వద్దకెళ్లి ఓట్లు అడిగే నైతిక హక్కు, బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అభ్యర్థిస్తుందో చూడాలన్నారు. వర్గీకరణలో కేంద్రం విఫలంరాయచూరు రూరల్: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ విషయంలో విఫలమైందని కర్ణాటక మాదిగ హితరక్షణ వేదిక రాష్ట్ర సంచాలకుడు కరియప్ప ఆరోపించారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేస్తారన్నారు. కేంద్ర మంత్రి నారాయణ స్వామి మాదిగల సమస్యలపై ఏనాడూ లోక్సభలో నోరు మెదపకుండా మౌనం వహించడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేశారన్నారు. దేశంలో భారత రాజ్యాంగాన్ని బీజేపీ రద్దు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తుకారాం ప్రచారం హొసపేటె: బళ్లారి లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ.తుకారాం శనివారం తాలూకాలోని గాదిగనూరు, బైలువద్దిగేరి, పాపినాయకనహళ్లి గ్రామాలలో ప్రచారం సాగించారు. పార్టీ నాయకులు సిరాజ్ షేక్, హెచ్ఆర్.గవియప్ప, పెద్దసంఖ్యలో ఇతర నేతలతో పాటు ఓటర్లను కలిశారు. -
శ్రీరాములును గెలిపించండి
సాక్షి,బళ్లారి: సౌమ్యుడు, అందరిని కలుపుకుని పోతూ జిల్లానే కాకుండా రాష్ట్రాభివృద్ధికి కూడా తన వంతు కృషి చేసిన బళ్లారి లోక్సభ బీజేపీ అభ్యర్థి శ్రీరాములును గెలిపించాలని మైసూరు మహారాజు, మైసూరు లోక్సభ బీజేపీ అభ్యర్థి యదువీర్ పేర్కొన్నారు. ఆయన శనివారం బళ్లారి లోక్సభ బీజేపీ అభ్యర్థి శ్రీరాములు తరపున ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొని మాట్లాడారు. ముందుగా నగర శివార్లలోని గోనాళ్లో దళిత వాడకు వెళ్లి అక్కడ వారితో మమేకం అవుతూ వారిచ్చిన కొబ్బరి బొండం, మంచినీరు తాగిన అనంతరం వారితో కాసేపు ముచ్చటించారు. అనంతరం జైన్ సమాజం వారు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేసి శ్రీరాములును గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్లు తప్పనిసరిగా బీజేపీని బలపరచాలన్నారు. శ్రీరాములుతో తనకు చాలా ఏళ్లుగా పరిచయం ఉందని, ఆయన పేదల సంక్షేమం కోసం ఆలోచించే నాయకుడని, ఆయన వెంట జనం నడవాలన్నారు. మోదీ మళ్లీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దళితుల సంక్షేమం కోసం కృషి చేస్తారని, అన్ని కులాలు, మతాల్లోని పేదలను అభివృద్ధి చేయడమే మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఇక్కడ శ్రీరాములుతో పాటు మైసూరులో తాను కూడా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాయమాటలను నమ్మొద్దన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా, బీజేపీ నాయకుడు హనుమంతప్ప, దళిత నాయకులు, జైన్ సమాజ ప్రముఖులు పాల్గొన్నారు. మోదీని మళ్లీ ప్రధానిని చేయండి మైసూరు మహారాజు యదువీర్ -
మహిళల ఓటు అడిగే నైతిక హక్కు లేదు
బళ్లారిఅర్బన్: మహిళలను రక్షించాల్సిన బీజేపీ మహిళలపై హత్యాచారాలు, అవమానాలను అరికట్టడంలో విఫలం అయినందున వారు మహిళల ఓటును అడిగే నైతిక హక్కు కోల్పోయారని కేపీసీసీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు పుష్పా అమరనాథ్ తెలిపారు. శనివారం గాంధీనగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హత్యాచారులు, ఆగర్భ శ్రీమంతుల తరపున ఉందన్నారు. అందువల్లే దేశాన్ని ఈ దుస్థితికి తెచ్చిన బీజేపీకి మహిళలు ఓటు వేయరాదని ఆమె కోరారు. నిత్యావసర ధరల పెంపు వల్ల దేశ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ప్రతి భారతీయుడి అకౌంట్కు రూ.15 లక్షలు వేస్తామని అబద్ధాల హామీలు ఇచ్చారన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ కూడా నీటి మూట అయిందన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మంజుల, కార్యదర్శి శోభా కాళింగ, సిటీ కార్పొరేషన్ మాజీ మేయర్ రాజేశ్వరి సుబ్బరాయుడు, పద్మ, మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. దేశంలో మోదీ హవా లేదు హొసపేటె: మాయమాటలతో పదేళ్లుగా పాలన సాగిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వానికి ఈ ఎన్నికలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని రాష్ట్ర కేపీసీసీ మహిళా అధ్యక్షురాలు పుష్ప అమరనాథ్ అన్నారు. శనివారం ఆమె పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మాయమాటలు చెప్పి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన బీజేపీని, మోదీ హామీలను ప్రజలు ఇక నమ్మరని అన్నారు. గత సారి ఇచ్చిన హామీలు నెరవేర్చనప్పుడు మరో అబద్ధాలను ప్రజలు నమ్మబోరన్నారు. మందిరం, మసీదు, మంగళసూత్రాలపైనే నరేంద్ర మోదీ ఎన్నికలను ఎదుర్కొంటున్నారన్నారు. గత 10 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్నారు. నేహా విషయంలో బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. బీజేపీ మహిళా నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ప్రజ్వల్ రేవణ్ణ ఉదంతం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుందన్నారు. అయినా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై మౌనం పాటించడం సమంజసం కాదన్నారు. ఎమ్మెల్యే గవియప్ప, పార్టీ నేతలు విజయలక్ష్మి, జయలక్ష్మి, యోగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఎల్లుండి పోలింగ్కు సర్వం సిద్ధం
బళ్లారిటౌన్: బళ్లారి లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లాధికారి ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. శనివారం ఆయన తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 7న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి బహిరంగ ప్రచారానికి ముగింపు పలకాలన్నారు. లోక్సభ నియోజకవర్గ పరిధిలో 18,84,040 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఇందుకోసం 1972 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అదే విధంగా 5,952 మంది అఽధికారులు, సిబ్బందిని నియమించామన్నారు. 7న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరుగుతుందన్నారు. అంతకు ముందు 48 గంటలకు ముందే ప్రచారాన్ని నిర్బంధిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సీఆర్పీసీ–144 సెక్షన్ అమలు కానుందన్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున ఓటర్లు ఉదయం పూట తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓటింగ్ కోసం ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. అదే విధంగా మే 7న కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 5.30 గంటలకు ఏజెంట్ల సమక్షంలో శిక్షణ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. ఏడీసీ మహమ్మద్ ఝుబేర తదితరులు పాల్గొన్నారు. -
హావేరి.. గెలుపు ఎవరిదో మరి?
రాయచూరు రూరల్: హావేరి, గదగ్ జిల్లాల్లో ఈసారి లోక్సభ ఎన్నికల్లో కమలంపై ఓటర్లు కరుణిస్తారా? అనే ప్రశ్న అందరి మదిలో నెలకొంది. ఈ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే గడ్డదేవరమఠ కుమారుడు ఆనంద్ స్వామి గడ్డదేవరమఠ పోటీ పడుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బసవరాజ్ బొమ్మై గతంలో ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. శిగ్గాంవి–సవణూరు అసెంబ్లీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన బొమ్మైకి ఈసారి ఎంపీ టికెట్ లభించింది. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేిసిన అభ్యర్థులు బీజేపీ అభ్యర్థి శివకుమార్ ఉదాసీ చేతిలో ఓటమి చెందారు. 2024 ఎన్నికల్లో తామే విజయం సాధించాలని అభ్యర్థులు ముమ్మర ప్రచారం చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు పోరాడుతున్నారు. మూడో సారి బీజేపీ అభ్యర్థి హ్యాట్రిక్ విజయ సాధనకు ఉబలాటపడుతున్నారు. కాంగ్రె్స్ పార్టీ పంచ గ్యారెంటీలతో ప్రజల ముందుకు వెళుతోంది. బీజేపీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే పెద్ద ప్రచారకర్తగా ఉన్నారు. లోక్సభ పరిధిలో ఏడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల మద్దతు ఉంది. మాజీ ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులు చేపట్టారు. తాను చేసిన మంచి పనులే తనకు విజయం చేకూరుస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా మాజీ సీఎం హ్యాట్రిక్ విజయం దక్కేనా?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement