ప్రధాన వార్తలు
AP: ఓటు వేసిన 102 ఏళ్ల వృద్ధురాలు
పాలకోడేరు: ఓటు ఎంత విలువైనదో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరు మండలం, కుముదవల్లి గ్రామంలో 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు వి.లక్ష్మీ నరసమ్మ శనివారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి ఓటు వేయించారు. వయో వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించి హోం ఓటింగ్ రెండోరోజైన శనివారం కూడా కొనసాగింది. గొల్లలకోడేరు, మోగల్లు, కోరుకొల్లు, గరగపర్రు గ్రామాల్లోని వారంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
AP Election Updates May 5th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
Andhra Pradesh Election Updates 5th May...04:50 PM, May 5th, 2024ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు ప్రయత్నిస్తున్నారు: సజ్జలచంద్రబాబు, రామోజీరావు వంటివాళ్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు కాకుండా రాక్షస ప్రయత్నం చేస్తున్నారుల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ మాఫియాకు ఊపిరాడకుండా చేస్తుందిప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం కావాలని 95 శాతం మంది కోరుకున్నారుసర్వే చేయించిన తర్వాతే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశఫెట్టాంపోలవరాన్ని సీఎం జగన్ పూర్తిచేసి చూపిస్తారు.. ఆ శక్తి ఉందికేంద్రం నిధులు సరిగ్గా ఇస్తే రెండేళ్ల కంటే ముందే పోలవరం పూర్తవుతుందిసీఎం జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 850 కోట్లు సేవ్ చేశారుపోలవరాన్ని చంద్రబాబు తన ఆదాయంగా మార్చుకున్నారని మోదీకి, అమిత్ షాకు తెలుసుకావాలంటే కేంద్ర ప్రభుత్వం లెక్కలు చూసుకోవాలిఏ బ్యాంకు లెక్కలు తీసినా తెలుస్తుందికూటమిలో పార్ట్నర్ కాబట్టి అమిత్ షా ఏదో మాట్లాడారుచంద్రబాబు అవినీతిని చూసి సహించలేకే జనం తిరస్కరించారుపోలవరం ప్రాజెక్ట్ చంద్రబాబకు ఏటీఎం అని ఆనాడు మోదీ విమర్శించారు 04:30 PM, May 5th, 2024కాకినాడ:అధికారం కోసం ప్రజలను మోసం చేయాలన్న ఆశతో చంద్రబాబు ఉన్నాడు: ఎమ్మెల్యే ద్వారంపూడి పొత్తులో ఉన్న బీజేపీ పార్టీయే చంద్రబాబును నమ్మడం లేదుకాకినాడ పోర్టులో ఏది ఎగుమతి అవుతుందో చంద్రబాబుకు తెలియదా?కాకినాడ పేరుకు దేశంలో మంచి పేరు ఉంది2014 ఎన్నికల కు ముందు అప్పులు పాలైనపోయిన వ్యక్తి..మాజీ ఎమ్మెల్యే కొండబాబు.2019 నాటికి అవినీతితో ఆస్తులు సంపాదించుకున్న వ్యక్తి కొండబాబుక్రికెట్ బుకీలో దిట్ట మీ కూటమీ ఎంపీ అభ్యర్ధి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ఒక సెంటు నేను కాకినాడలో కబ్జా చేశానని నిరూపిస్తే.. నా ఆస్ధి ప్రజలకు రాసిచ్చేస్తానుకొండబాబు అనే వ్యక్తి ఎమ్మెల్యే గా వస్తే మళ్ళీ కాకినాడలో గంజాయి , కబ్జాలు ,అవినీతి పెరిగిపోతుందిరూ.1,000 కోట్లు ఓఎన్జీసి నా ఎకౌంట్ లో నష్టపరిహారం సొమ్ములు వేసిందని మత్స్యకారులకు కొండబాబు మాయ మాటలు చెబుతున్నారు.ఓఎన్జీసి నుండి సమాచార హక్కు క్రింద సమాచారం తీసుకున్నాను. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానుఅలాగే దీనిపై కొండబాబుపై పరువు నష్ట దావా వేస్తున్నాను04:15 PM, May 5th, 2024తాడేపల్లిల్యాండ్ టైటిల్ యాక్ట్ని కేంద్ర ప్రభుత్వమే తీసుకువచ్చింది: ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుఏపీలో 6 వేల పంచాయతీలలో భూ సర్వే జరిగింది.చంద్రబాబు,పవన్ కి ప్రజల గురించి మాట్లాడే హక్కు లేదు.వందల ఎకరాలు రామోజీ రావు ఫిల్మ్ సిటీ కోసం అక్రమంగా దోచుకున్నాడు.31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు జగన్.ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవుఏపీలో బీజేపీ కేంద్ర నాయకులు పర్యటన చేస్తున్నారుఈ యాక్టును అమలు చేయనివ్వద్దొని కేంద్ర పెద్దలను అడిగే దమ్ము చంద్రబాబు, పవన్ కి ఉందా?పురేందేశ్వరి ఈ యాక్టు కరెక్టే అని అన్నారు.పోలవరం గురించి మాట్లాడటానికి బీజేపీ నాయకులకి సిగ్గు ఉండాలిపోలవరం డబ్బును ఎటిఎంలా చంద్రబాబు వాడుకున్నాడని మోదీనే గతంలో అన్నారు 03:30 PM, May 5th, 2024చిత్తూరు జిల్లా:చిత్తూరులో పోలీసులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారువిజయానంద రెడ్డి, చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొనుగోలుకు నగదు పంచుతున్న ఇద్దరినీ పట్టుకుని వన్ టౌన్ లో లక్షన్నర నగదుతో అప్పగిస్తే వదిలేశారుఅందుకే స్టేషన్ ముందు అర్ధనగ్న నిరసన చేస్తున్నా500 మంది బెంగుళూరు,,అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ తిష్ట వేసి మద్యం, నగదు పంపిణీ చేస్తున్నారుపోలీసులు పట్టించుకోవడం లేదు 02:20 PM, May 5th, 2024తాడేపల్లి :,భూ సంస్కరణలను జగన్ తెస్తుంటే చంద్రబాబు, పవన్ భయపడితున్నారు: రావెల కిషోర్ బాబువారు ఆక్రమించుకున్న భూముల చిట్టా ఎక్కడ బయట పడుతుందోనని భయపడుతున్నారుమోదీ తెచ్చిన ఈ చట్టాన్ని కూటమిలోని చంద్రబాబు వద్దంటున్నారుదీనిపై మోదీ మాట్లాడాలి, నోరు విప్పాలిలేదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి మోదీ తెస్తున్న చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని ప్రకటించాలిజనం ఛీ కొడుతున్నా చంద్రబాబు, పవన్ ఇంకా అసత్యాలు ప్రచారం చేస్తున్నారుప్రజలు తిరుగుబాటు చేస్తున్నా పట్టించుకోవడం లేదుప్రజల్ని తప్పుదారి పట్టించి రాజకీయంగా లబ్ది పొందాలని చంద్రబాబు కుట్ర పన్నారుపేదలకు భూములు పంచే వ్యక్తి సీఎం జగన్ఆసైన్డు ల్యాండ్ మీద హక్కులు కల్పించిన ఘనత జగన్దిచుక్కల భూమి సమస్యలను పరిష్కరించినది జగన్అలాంటి వ్యక్తి గురించి చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారుటీడీపీ ఐవిఆర్ఎస్ కాల్స్ పై సీఐడీ విచారణ చేస్తోందితప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు01:42 PM, May 5th, 2024ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్.. టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణచంద్రబాబు ఏ1గా, లోకేష్ ఏ2గా ఎఫ్ఐఆర్ నమోదుల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ఐవీఆర్ఎస్ కాల్స్తో టీడీపీ దుష్ప్రచారంటీడీపీ అసత్య ప్రచారంపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదుఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీచంద్రబాబు, లోకేష్తో పాటు 10 మందిపై కేసు నమోదుఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదు12:15 PM, May 5th, 2024చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు40 ఏళ్ల సీనియారిటీ అని చెప్పే చంద్రబాబుకి ఉన్న కన్ఫ్యూజన్ ఎవరికి లేదుల్యాండ్ టైటిలింగ్ మాట్లాడుతున్న బాబు.. ఆ చట్టం తీసుకొచ్చింది బీజేపీనే అనే సంగతి మరిచాడా ?సభల్లో వైఎస్సార్సీపీపై మాట్లాడుతున్న బాబు.. బీజేపీ గురించి ఎందుకు మాట్లాడం లేదుబీజేపీతో జోడి కట్టి ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తానంటే మోసం కదా?నాడు మోదీని తిట్టిన బాబు నేడు పొగుడుతున్నారు.. 4ఏళ్లలో మోదీ ఏం చేశాడో చెప్పాలిమోదీ రాష్టానికి చేసిన మేలు ఏంటో బాబు చెప్పాలికూటమి మ్యానిఫెస్టో విడుదలలో పురందేశ్వరి ఎందుకు లేదుకూటమి మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ నేతలు చెప్పడం దేనికి సంకేతంఅవకాశవాదం, స్వార్థంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు10:59 AM, May 5th, 2024సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్ వైఎస్ వివేకా హత్య కేసులో ఛార్జ్షీట్ తీసుకుని రండి..బహిరంగ చర్చకు సిద్ధమా.. ఎక్కడికైనా వస్తాఈ నెల 11 లోపు తన సవాల్పై స్పందించాలిషర్మిల స్పష్టంగా తెలుసుకుని వాస్తవాలు మాట్లాడాలినాడు షర్మిలను పాదయాత్ర చేయమని ఎవరూ అడగలేదువైఎస్ సోదరి విమలమ్మ మీ వెంట ఎందుకు లేరు?వైఎస్ సోదరులు సైతం మీకు మద్దతు ఇవ్వడం లేదువివేకా మృతి తర్వాత ఎన్నిసార్లు ఆయన సమాధి వద్దకు వెళ్లారుషర్మిల దుర్మార్గపు పనులు చేస్తున్నారు కాబట్టే.. కుటుంబం నుంచి కూడా ఆమెకు మద్దతు లేదురూ.వెయ్యి కోట్ల పని చేయనందుకే షర్మిల వ్యతిరేకంగా మారిందివైఎస్ పేరును చెడ్డగొట్టడానికి షర్మిల కుట్రలు చేస్తోందిసీఎం జగన్, పొన్నవోలుపై షర్మిల వ్యాఖ్యలు సరికాదుషర్మిల ప్రచారానికి స్పందన లేక ఫ్రస్ట్రేషన్కు గురవుతుంది. బాబు, పవన్ స్క్రిప్ట్ షర్మిల చదువుతుందివైఎస్ విజయమ్మ మాట పెడచెవిన పెట్టినప్పుడే షర్మిల అంశం ముగిసిందిషర్మిల మోసాలు, అక్రమాలు బయట పెట్టడానికి నేను ఒక్కడిని చాలుతెలంగాణలో షర్మిల వందల కుటుంబాలను మోసం చేశారు. జగన్, షర్మిల పెళ్లికి చంద్రబాబును వైఎస్ పిలిచారన్నది అబద్ధంబాబు ఆడుతున్న ఆటలో షర్మిల పాచిక అయిందివైఎస్ జగన్కు అద్ధం చూపడం దుర్మార్గంఒకసారి ఇంటికి వెళ్లి ఆ అద్ధంలో మీ ముఖం చూసుకోండి తెలంగాణలో ఏం మాట్లాడారు. ఏపీలో మాట్లాడారో ఒకసారి చూసుకోండిషర్మిలకు పిచ్చి ముదిరి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది10:59 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై బాబు, పవన్ విష ప్రచారం: ఎమ్మెల్యే మల్లాది విష్ణుప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారుఐవీఆర్ఎల్ సర్వేలో తప్పుడు ప్రచారం చేస్తున్నారుమా ఫిర్యాదు పై ఈసీ స్పందించింది చర్యలకు సీఐడీకి సిఫారసు చేసిందిప్రజల భూమికి భద్రత కల్పించడమే ప్రభుత్వ ధ్యేయంసీఎం జగన్ను ఎదుర్కోలేక బాబు, పవన్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తప్పుడు ప్రచారాలు ఆపకపోతే క్రిమినల్ చర్యలు తప్పవుల్యాండ్ టైటిల్ యాక్ట్ మేం తెచ్చింది కాదునీతి ఆయోగ్ ద్వారా కేంద్రమే అన్ని రాష్ట్రాలకు సూచించింది టీడీపీ, జనసేన నేతలు మాట్లాడుతుంటే ఏపీ బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు?కేంద్రం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ బీజేపీ శాఖ ఎందుకు నోరుమూసుకుంది? ఏపీల ప్రచారానికి వస్తున్న మోదీ, అమిత్ షా సభల్లో చెప్పాలి10:51 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలుల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై కొన్ని పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయిభూ రికార్డుల డిజిటలైజేషన్తో సమస్యల పరిష్కరించడానికి ఈ చట్టాన్ని తీసుకువస్తున్నారు.ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులు లాగేసుకుంటారంటూ కావాలనే కొన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయిల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తెలియకపోతే మమ్మల్ని అడిగితే చెప్పేవాళ్లంఎన్నికల్లో మాతో భాగస్వామ్యం ఉన్న పార్టీలు ఇలా తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదుల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇతర రాష్ట్రాల్లో అమలవుతుందిఎలా అయినా గెలవాలన్న ఆలోచనతో ప్రజలను భయభ్రాంతులను చేయడం మంచిది కాదుఈ దుష్ప్రచారంపై ఎన్నికల కమిషన్ కూడా సీఐడీ దర్యాప్తు వేసిందిజనసేన, తెలుగుదేశం మేనిఫెస్టో మాకు సంబంధం లేదుచంద్రబాబు చెప్తున్నా సూపర్ సిక్స్ కోసం చాలా డబ్బులు కావాలిచంద్రబాబు చెబుతున్న సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయిఆయన వాటిని అమలు చేయకపోతే ఆ నెపం మా పైకి వస్తుందిఅందుకే.. జనసేన, తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదు8:56 AM, May 5th, 2024నేడు ఏపీకి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాకశ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం బత్తలపల్లి రోడ్డులోని సీఎన్బీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగించనున్న అమిత్షావైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు, కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్న రాజ్నాథ్ సింగ్ 8:51 AM, May 5th, 2024అవన్నీ అపోహలేల్యాండ్ టైట్లింగ్ చట్టంతో భూములకు మరింత రక్షణఈ చట్టం అమల్లోకి వస్తే భూములు, ఆస్తులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుందిఅన్ని పత్రాలూ యజమానుల వద్దే ఉంటాయి.. ప్రభుత్వం వద్ద కేవలం రికార్డులేఈ చట్టం కోర్టు ద్వారాలు మూసేయదు.. కోర్టులకు వెళ్లే అవసరమే లేకుండా చేస్తుందిహక్కుల నిరూపణకు ఇప్పుడున్న చట్టాలు అంతిమ సాక్ష్యాలు కావుఅందుకే ఈ చట్టం అవసరమవుతోందిభూచట్టాల నిపుణుడు, నల్సార్ ప్రొఫెసర్ ఎం. సునీల్కుమార్7:37 AM, May 5th, 2024జనం.. జనం.. ప్రభంజనంసీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలకు పోటెత్తిన ప్రజానీకంహిందూపురంలో 43 డిగ్రీల ఎండనూ లెక్కచేయని జనంనియోజకవర్గ చరిత్రలో ఏ నాయకుడికి లేని రీతిలో బ్రహ్మరథంఈసారి హిందూపురం వైఎస్సార్సీపీదే అంటున్న రాజకీయ పరిశీలకులుపలమనేరులో వర్షాన్ని కూడా లెక్క చేయని ప్రజలునెల్లూరులో జననీరాజనం 7:25 AM, May 5th, 2024ల్యాండ్ టైట్లింగ్ చట్టం వ్యవహారం.. టీడీపీపై ఈసీ కొరడాదుష్ప్రచారంపై సీఐడీ దర్యాప్తుప్రజలను భయాందోళనలకు గురిచేయడంపై ఈసీ సీరియస్ ఎన్నికల నిబంధనలకు పాతరేస్తున్నారని మండిపాటు వైఎస్సార్సీపీ ఫిర్యాదుతో చర్యలు తీసుకున్న కమిషన్తక్షణం దీనిపై దర్యాప్తుచేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం7:16 AM, May 5th, 2024కళ్లు గద్దెపై.. బుద్ధి భూమిలోల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై బరితెగించి అబద్ధాలులేని వ్యక్తులకు అన్యాయం జరిగిందంటూ రామోజీ ఆక్రోశం కల్పిత పాత్రలను సృష్టించి, ఏదో జరిగిపోయిందని ఆక్రందనరిజిస్టరే లేనపుడు అందులో కొందరి పేర్లు లేకపోవటం సాధ్యమా?చట్టం దేవుడెరుగు... చట్టానికి సంబంధించిన రూల్సే రాలేదని తెలీదా?రూల్స్ వచ్చాక.. వాటిపై సమగ్ర చర్చ జరిగిన తరవాతే తుది రూపుపైపెచ్చు రీసర్వే పూర్తయ్యాకే ఈ చట్టాన్ని అమలు చేయటం సాధ్యంఇప్పటికి 4 వేల గ్రామాల్లోనే రీ సర్వే పూర్తి.. ఇంకా 13 వేల గ్రామాల్లో పెండింగ్అది పూర్తయి.. రూల్స్ ఖరారయ్యాక కదా చట్టం అమలు గురించి మాట్లాడేది..అయినా అన్ని రాష్ట్రాలనూ అమలు చేయమంటున్నది కేంద్రమే కదా!అన్ని రాష్ట్రాలూ అమలు చేస్తేనే... ఇక్కడా చేస్తామని చెబుతున్న రాష్ట్రంమోదీ ముందు తల ఊపి.. బయట మాత్రం విష ప్రచారం చేస్తున్న బాబుబాబునెవరూ నమ్మటం లేదని గ్రహించి... మారీచుడి పాత్రలోకి రామోజీజనాన్ని భయపెట్టడానికి అబద్ధాలే అ్రస్తాలుగా మాయా యుద్ధంపోలింగ్ వరకూ ఈ ఒక్క అంశంమీదే మాట్లాడాలని ‘ఎల్లో’ తాఖీదుమిగతావన్నీ పక్కనబెట్టి విస్తృతంగా విష ప్రచారం చేస్తున్న పచ్చ మంద7:14 AM, May 5th, 2024బాబుకు భంగపాటు.. బెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంబెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగంఓటర్లకు అరచేతిలో వైకుంఠం చూపించేందుకు కుతంత్రంలబ్ధిదారుల నమోదు పేరిట కుట్రఓటర్ల జాబితా వివరాల దుర్వినియోగంతీవ్రంగా స్పందించిన ఎన్నికల కమిషన్ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక7:12 AM, May 5th, 2024లాక్కునేవి కాదు..ఇచ్చే చేతులివి..నిషేధిత జాబితా నుంచి 35 లక్షల ఎకరాల తొలగింపుసీఎం జగన్ సంస్కరణలతో ‘రెవెన్యూ’లో సులభమైన పాలన వందల ఏళ్ల నాటి చిక్కుముళ్లకు పరిష్కారంచుక్కల భూములు, సర్విస్ ఈనాం, షరతుల గల పట్టా భూములకు విముక్తి27.41 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులులంక భూములకు అసైన్మెంట్ పట్టాలుకుప్పలు తెప్పలుగా ఉన్న రెవెన్యూ సమస్యలన్నింటికీ పరిష్కారంనిరుపేదలకు 46 వేల ఎకరాల భూముల పంపిణీ శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం 951 ఎకరాలుకొత్త రిజిస్ట్రేషన్ల విధానం.. ఆటో మ్యుటేషన్చరిత్ర సృష్టించిన 30.61 లక్షల ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖ స్వరూపాన్ని మార్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు6:59 AM, May 5th, 2024మళ్లీ దోపిడీకి తెరపైకి..మాజీ ఎమ్మెల్యే అరాచకాలెన్నో!గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబుకు తమ్ముడు వక్ఫ్ ఆస్తులు చెరబట్టి దోచేసిన ఘనుడుటిప్పు షాపింగ్ కాంప్లెక్స్ కేటాయింపులో చేతివాటంప్రతి పనికీ రేటుగట్టి వసూలు చేసిన చరిత్ర బెదిరింపులు, దౌర్జన్యాలు షరామామూలేఏకంగా పది క్రిమినల్ కేసులు 6:56 AM, May 5th, 2024మీ భూమికి భద్రత.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై బాబు దుష్ప్రచారం: సీఎం జగన్చట్టంపై అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటుమీ భూములకు ప్రభుత్వం గ్యారంటీ..రిజిస్ట్రేషన్ తర్వాత రైతులకే డాక్యుమెంట్లుఅన్నదాతలు ఎవరి చుట్టూ తిరగాల్సిన పని ఉండదుభూ తగాదాలకు శాశ్వత పరిష్కారంగా వందేళ్ల తర్వాత రీసర్వేపేదలకు భూములిచ్చేది జగన్.. లాక్కునేది చంద్రబాబే
లాక్కునేవి కాదు..ఇచ్చే చేతులివి..
ఒక్క ఎకరం భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి ఏళ్ల తరబడి తిరిగినా పని జరగని రాష్ట్రంలో ఏకంగా 35 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిది. ఏళ్ల తరబడి ఆంక్షల చట్రంలో ఇరుక్కు పోయిన చుక్కల భూములు, ఈనాం భూములు, షరతుల గల పట్టా భూములు వంటి లక్షల ఎకరాలపై ఆంక్షలు తొలగించారు. చుక్కల భూములు, షరతుగల పట్టా భూముల్ని చంద్రబాబు ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టి లక్షలాది మంది రైతులను రోడ్డున పడేసింది. వాటికి విముక్తి కల్పించి వాటిపై సర్వ హక్కులు కల్పించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.కేటాయించి 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ విప్లవాత్మక రీతిలో అమలు చేశారు. భూములున్నా వాటికి విలువ లేకుండా పోవడంతో హక్కులు కల్పించాలని దీర్ఘ కాలికంగా ఉన్న దళిత, పేద రైతుల కోరికను వైఎస్ జగన్ నెరవేర్చారు. 27.41 లక్షల ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించారు. ఇందుకోసం వాటిని 22ఏ జాబితా నుంచి తొలగించారు. అన్ని లక్షల భూములపై ఆంక్షలు తొలగి వాటి లావాదేవీలు ప్రారంభమవడంతో ఆరి్థక వ్యవస్థకు ఊతం లభించింది. దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై హక్కులు కల్పించింది. ఇందుకోసం ఆ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడంతోపాటు కన్వేయన్స్ డీడ్స్ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) చేసి ఇచ్చి చరిత్ర సృష్టించింది. స్థిరాస్థి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మళ్లీ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరక్కుండానే ఆటోమేటిక్గా యాజమాన్య హక్కు మారి్పడి జరిగే ఆటో మ్యుటేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు.వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో సాహసోపేతంగా వేసిన అడుగులు రెవెన్యూ శాఖ చరిత్రలోనే సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారి రాష్ట్రంలో అమలైన రెవెన్యూ సంస్కరణలు దేశానికే దిక్సూచిగా మారాయి. పేదల జీవితాల్లో మార్పు తెచ్చే దిశగా చేపట్టిన ఈ సంస్కరణల్ని ఒక విప్లవంలా మేధావులు చెబుతున్నారు. సంస్కరణ: పేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములపై 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత యాజమాన్య హక్కుల కల్పన. ఇళ్ల స్థలాలకు పదేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు. హక్కులు కల్పిస్తున్న భూములు: 27,41,698 ఎకరాలు హక్కులు పొందుతున్న రైతుల సంఖ్య : 15,21,160 (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు)ప్రయోజనం: ఆ భూములను నిషేధిత ఆస్తుల జాబితా 22 (ఏ) నుంచి తొలగింపు. లక్షలాది కుటుంబాల జీవన ప్రమాణాలు పెరిగాయి. తద్వారా రాష్ట్ర ఆరి్థక వృద్ధికి బాటలు. అసైన్డ్ రైతులు తమ అవసరాల కోసం ఆ భూములను వినియోగించుకునే వీలు ఏర్పడింది. సర్విస్ ఈనాం భూములపై ఆంక్షల తొలగింపుగతం : గతంలో ఈనాం చట్టం ప్రకారం దేవదాయ భూములతోపాటు కుల వృత్తులకు ఇచ్చిన సర్వీస్ ఈనాం భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. దీనివల్ల లక్షలాది మంది భూములు స్తంభించిపోయాయి. సంస్కరణ:నిషేధిత జాబితా నుంచి ఆ భూముల తొలగింపుఆంక్షలు తొలగిన భూములు: 1,61,584 ఎకరాలు లబ్ధి పొందిన రైతుల సంఖ్య : 1,58,113 ప్రయోజనం: ఆంక్షలు తొలగడంతో కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి వంటి పలు వృత్తుల వారికి కేటాయించిన సర్విస్ ఈనాం భూముల రైతుల కుటుంబాల్లో వెలుగులు.షరతులు గల పట్టా భూములపై ఆంక్షలు తొలగింపుగతం: పూర్వం నుంచి అనుభవిస్తున్న షరతులు గల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చిన చంద్రబాబు ప్రభుత్వం సంస్కరణ: ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగింపు తొలగించిన భూములు: 33 వేల ఎకరాలు లబ్ధి పొందిన రైతులు: 30 వేల మంది ప్రయోజనం: నిలిచిపోయిన ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వాటిపై రుణాలు వస్తున్నాయి. అమ్మకాలు జరుగుతున్నాయి. అనాదీనం, ఖాళీకాలమ్ భూముల సమస్య పరిష్కారంగతం : చుక్కల భూములు మాదిరిగానే ఆర్ఎస్ఆర్లో అనాధీనం, ఏమీ రాయకుండా ఖాళీగా వదిలేసిన భూముల సమస్య. సంస్కరణ: అలాంటి భూములను గుర్తించి నిషేధిత జాబితా నుంచి తొలగింపు తొలగించిన భూములు: సుమారు 50 వేల ఎకరాలు లబ్ధి పొందిన రైతులు: సుమారు 30 వేల మంది ప్రయోజనం: భూములపై వారికి సర్వ హక్కులు ఏర్పడ్డాయి. రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. సుదీర్ఘకాలం తర్వాత భూ పంపిణీకి శ్రీకారం పంపిణీ చేసిన భూమి: 46,463 ఎకరాలు లబి్ధదారులు: 42,307 ప్రయోజనం: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఆరి్థకంగా పైకి తీసుకువచ్చే కార్యక్రమంలంక భూములకు డీకేటీ పట్టాలు కృష్ణా, గోదావరి లంక గ్రామాల్లో రైతుల సాగులో ఉన్న లంక భూములకు పట్టాలు జారీ. దశాబ్దాల లంక భూముల సమస్యకు పరిష్కారం పట్టాలిచ్చిన భూమి: 9,064 ఎకరాలు లబ్ధి పొందిన రైతులు: 17,768 ప్రయోజనం: ఆ భూములపై రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమాలాంటివి పొందవచ్చు. దళిత వాడలకు శ్మశాన వాటికలు శ్మశాన వాటికలు లేని దళిత వాడలు ఉండకూడదనే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం దళిత వాడల కోసం కేటాయించిన శ్మశాన వాటికలు: 1,563 ఇందుకోసం ప్రభుత్వం కేటాయించిన భూమి: 951 ఎకరాలు ప్రయోజనం: స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా అంత్యక్రియలు చేసుకోవడానికి స్థలాలు లేని గ్రామాల సమస్యకు పరిష్కారం కొత్త రిజిస్ట్రేషన్ల విధానంరిజిస్ట్రేషన్ల విధానాన్ని ఆధునీకరించి మరింత సులభంగా ప్రజలకు రిజిస్ట్రేషన్ల సేవలు. కార్డ్ ప్రైమ్ 2.0 ద్వారా ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్లు. అందులోనే డాక్యుమెంట్లు తయారు చేసుకునే అవకాశం. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్. ఆధార్ సైన్ ద్వారా అవకతవకలకు ఆస్కారం లేని విధానం. ఆటో మ్యుటేషన్ పాత రిజిస్ట్రేషన్ల విధానంలో వ్యవసాయ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మళ్లీ వ్యక్తిగతంగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ పూర్తవగానే ఆటో మ్యుటేషన్ జరిగిపోతోంది. అంటే రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆన్లైన్లో పేరు మారుతుంది. ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు ఒకేసారి 30.61 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వం వాటిని లబ్ధిదారుల పేరు మీద రిజిస్టర్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కన్వేయన్స్ డీడ్లు పంపిణీ చేసింది. దీనివల్ల ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలపై లబ్ధిదారులకు హక్కులు లభించాయి. వాటిని బ్యాంకు ల్లో పెట్టి రుణాలు తీసుకోవచ్చు. పదేళ్ల తర్వాత ఎన్ఓసీ అవసరం లేకుండానే కన్వేయన్స్ డీడ్లు సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ఆ పట్టాలు ప్రైవేటు పట్టాల మాదిరిగా వినియోగించుకోవచ్చు. కుల ధ్రువీకరణ పత్రం శాశ్వతం గతం : సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులను ప్రతిసారీ కుల ధ్రువీకరణ పత్రాలను అడగడం వల్ల ఇబ్బందులు ఏర్పడేవి. సంస్కరణ: ఒకసారి కుల ధ్రువీకరణ పత్రం తీసుకుంటే దాన్ని శాశ్వతంగా ప్రకటించింది ప్రభుత్వం. మీ సేవ ద్వారా గతంలో కుల ధ్రువీకరణ పత్రాలు పొందితే ఆ డేటా ఆధారంగానే మళ్లీ పత్రాలు జారీకి అవకాశం. ఆదాయ ధ్రువీకరణ సులభతరంగతం : స్కాలర్íÙప్లు, ప్రభుత్వ పథకాలు, ఫీజు మినహాయింపుల కోసం కుటుంబాల ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ప్రతిసారి విచారణ చేయాల్సివచ్చేది. సంస్కరణ: ప్రతిసారి విచారణ చేయకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహించే ఆరు దశల నిర్ధారణ ప్రక్రియనే ఉపయోగించుకునేలా మార్పులు. గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు వ్యవసాయం చేసుకునేందుకు అటవీ ప్రాంతంలో ఇచ్చిన పట్టాలు. గత ప్రభుత్వాల కంటే ఎక్కువ పట్టాలు ఇచ్చారు. పట్టాలిచ్చిన భూమి విస్తీర్ణం: 2,87,710 ఎకరాలు లబ్ధిదారులు: 1,30,368చుక్కల భూములకు విముక్తి గతం: చంద్రబాబు హయాంలో జరిగిన తప్పిదంతో 22(ఏ) జాబితాలో చేరిన 22.06 లక్షల ఎకరాల చుక్కల భూముల సమస్య. సంస్కరణ: 22ఏ జాబితా నుంచి వాటిని తొలగించి విముక్తి కల్పించిన ప్రభుత్వం ప్రయోజనం: చాలా సంవత్సరాల నుంచి నిలిచి పోయిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు జరుగుతున్నాయి. పంట రుణాలు కూడా వస్తున్నాయి. ఆ భూములను రైతులు స్వేచ్ఛగా అమ్ముకునే హక్కు ఏర్పడింది.భూమి కొనుగోలు పథకం భూములకు హక్కులు గతం : భూమి లేని నిరుపేద దళితులకు భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములు ఎస్సీ కార్పొరేషన్ తనఖాలో ఉండడంతో వాటిపై కొనసాగుతున్న ఆంక్షలు. సంస్కరణ: ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగింపు నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములు : 22,837 ఎకరాలు విముక్తి పొందిన రైతులు : 22,346 ప్రయోజనం: ఆ భూములపై హక్కులు పొందిన దళిత రైతులు. ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న రైతుల సమస్యకు పరిష్కారం.గిరిజనులకు డీకేటీ పట్టాలు గిరిజనులు అటవీ ప్రాంతంలోని భూములపై ఫల సాయాన్ని పొందేందుకు వీలుగా వారికి డీకేటీ పట్టాల పంపిణీ. పట్టాలిచ్చిన భూముల విస్తీర్ణం: 39,272;లబ్ధిదారులు: 26,287 – బి ఫణికుమార్, సాక్షి అమరావతి
బాబుకు భంగపాటు.. బెడిసికొట్టిన టీడీపీ అధినేత పన్నాగం
సాక్షి, అమరావతి: అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను బురిడీ కొట్టించడం చంద్రబాబు మా ర్కు రాజకీయం అన్నది బహిరంగ రహస్యం. 40 ఏళ్లుగా అదే చేస్తున్న ఆయన ప్రస్తుత ఎన్నికల్లో మ రోసారి అదే కుట్రకు యత్నించి అభాసుపాలయ్యారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు చంద్రబాబు పన్నిన కుతంత్రానికి ఎన్నికల కమిషన్ గండికొట్టింది. గ్యారంటీ కాదు బురిడీ..ఇక సూపర్ సిక్స్ అంటూ ఎంతగా ఊదరగొడుతున్నా తనను ప్రజలు ఏమాత్రం నమ్మడంలేదన్నది చంద్రబాబు గుర్తించారు. దీంతో ప్రజల్ని మస్కా కొట్టేందుకు ఆయనో పన్నాగం పన్నారు. ఇంకా పోలింగ్ కూడా కాకముందే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసినట్లుగా ప్రజలకు భ్రమ కల్పించేందుకు ఎత్తుగడ వేశారు. జూన్ 4 తరువాత లబ్ధిదారులకు ఇవిగో ఈ పథకాలు వస్తాయి.ఇంతమేర ఆర్థిక ప్రయోజనం కలుగుతుందని కరపత్రాలు ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేపట్టారు. ఏకంగా ఓటర్ల జాబితాలోని ఓటర్ల వివరాలను దుర్వినియోగం చేస్తూ టీడీపీ ఈ కుతంత్రానికి తెగించింది. ఓటర్ల పేర్లతో కార్డులు ముద్రించి మరీ పంపిణీకి తెగించింది. అంతేకాక.. ఓటర్ల వ్యక్తిగత ఫోన్ నంబర్లకు ఫోన్లుచేస్తూ మరీ ప్రచారాన్ని ఊదరగొట్టింది. టీడీపీ నేతల వద్ద పేర్లు నమోదు చేసుకుంటే చాలు పథకాలిస్తామని ప్రలోభాలకు గురిచేసింది. ఆ ప్రచారానికి సంబంధించి ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను బురిడీ కొట్టించేందుకు సిద్ధపడింది. బాబు కుట్రను తిప్పికొట్టిన ఈసీ..టీడీపీ చేస్తున్న ప్రచారంపై ఎన్నికల కమిషన్ తీ వ్రంగా స్పందించింది.ఇది పూర్తిగా ఓటర్లను ప్ర లోభాలకు గురిచేయడమేనని మండిపడింది. ఒ క్కో ఓటరుకు భవిష్యత్తులో ఇంత లబ్ధిచేకూరుతుందని చెప్పడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన,ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడమేనని తేల్చిచెప్పింది. ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 ఉల్లంఘన కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.ఈ మేరకు పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో ప్రచారం చేయడంగానీ ఓటర్లకు కార్డులు పంపిణీ చేసినా నేరంగా పరిగణించి కేసులు నమోదుచేస్తామని స్పష్టంచేసింది. ఎన్నికల కమిషన్ సత్వరం అప్రమత్తమై కొరఢా ఝళిపించడంతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. ఓటర్లను మభ్యపెట్టి ఎన్నికల్లో అడ్డదారిలో ప్రయోజనం పొందాలన్న టీడీపీ కుతంత్రానికి తెరపడింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
వీడియోలు
రైల్వే జోన్ పై కొత్త రాజకీయం
షర్మిల నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు: పొన్నవోలు
ఈరోజే వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో
కేంద్ర మంత్రికి బొత్స స్ట్రాంగ్ కౌంటర్
కేంద్ర మంత్రికి బొత్స స్ట్రాంగ్ కౌంటర్
ఎక్కడ మద్యం దొరికినా సోమిరెడ్డి నాపై బురద జల్లుతున్నాడు
సుజనా చౌదరి అఫిడవిట్ పై అనుమానాలు..కేశినేని నాని డిమాండ్
మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు
మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు
మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు