ప్రధాన వార్తలు
ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేష్.. టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ
సాక్షి, విజయవాడ: టీడీపీ ఫేక్ ప్రచారంపై సీఐడీ విచారణ చేపట్టింది. చంద్రబాబు ఏ1గా, లోకేష్ ఏ2గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై ఐవీఆర్ఎస్ కాల్స్తో టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. టీడీపీ అసత్య ప్రచారంపై వైఎస్సార్సీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది.ఈసీ ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ.. విచారణ చేపట్టింది. చంద్రబాబు, లోకేష్తో పాటు 10 మందిపై కేసు నమోదు చేసింది. ఐవీఆర్ఎస్ కాల్స్ చేసిన ఏజెన్సీలపైనా కేసు నమోదైంది.కాగా, ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ తప్పుడు సమాచారంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం మీద ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఏప్రిల్ 29న ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన ఈసీ టీడీపీ దుష్ప్రచారంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని, అలా తీసుకున్న చర్యలపై తక్షణం నివేదిక ఇవ్వాలని మంగళగిరి సీఐడీ (సైబర్ సెల్) అడిషనల్ డీజీకి అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరీంధర ప్రసాద్ ఆదేశించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో దురుద్దేశపూర్వకంగా లాండ్ టైట్లింగ్ యాక్ట్పై ఐవీఆర్ఎస్ కాల్స్తో పాటు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ప్రచారం చేస్తోందంటూ వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఇందుకు తగిన ఆధారాలనూ సమర్పించింది.వివిధ ప్రాంతాల నుంచి వేర్వేరు నెంబర్ల ఐవీఆర్ కాల్స్ వస్తున్నాయని.. వాటిని లిఫ్ట్ చేయగానే.. ‘వైఎస్ జగన్ అధికారంలోకొస్తే మీ భూములు మీ పేరు మీద ఉండవు, జగన్ కాజేస్తాడు, ఒరిజినల్స్ ఆయన దగ్గర ఉంచుకుంటాడు, మీకు జిరాక్స్ కాపీలు వస్తాయి, కాబట్టి జగన్కు ఓటు వేయకుండా తెలుగుదేశంకు ఓటు వేయండి’.. అంటూ రికార్డ్ మెసేజ్లు వస్తున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.వీటికి సంబంధించిన వాయిస్ రికార్డులను వైఎస్సార్సీపీ ఈసీకి ఆధారాలుగా సమర్పించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం ఆమోదంలేకుండా ఎలాంటి ప్రచారం చేయడానికి వీల్లేదని.. కానీ ఎటువంటి అనుమతుల్లేకుండా వివిధ చోట్ల నుంచి కాల్స్చేస్తూ ఇలా ప్రచారం చేయడం ఉల్లంఘన కిందకే వస్తుందని.. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసింది.ఎన్నికల సమరంలో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంటుందని, ఈ విధంగా చట్టాలపై తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్న టీడీపీపై తక్షణం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ తన ఫిర్యాదులో కోరింది
ఎందుకీ కన్ఫ్యూజన్?.. చంద్రబాబుపై సీపీఐ రామకృష్ణ సెటైర్లు
సాక్షి, విజయవాడ: 40 ఏళ్ల సీనియారిటీ అని చెప్పే చంద్రబాబుకు ఉన్న కన్ఫ్యూజన్ ఎవరికి లేదంటూ సీపీఐ రామకృష్ణ సెటైర్లు వేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ల్యాండ్ టైటిలింగ్ గురించి మాట్లాడుతున్న బాబు.. ఆ చట్టం తీసుకొచ్చింది బీజేపీనే అనే సంగతి మరిచాడా ? అంటూ ప్రశ్నించారు.‘‘సభల్లో వైఎస్సార్సీపీపై మాట్లాడుతున్న బాబు.. బీజేపీ గురించి ఎందుకు మాట్లాడం లేదు? బీజేపీతో జోడి కట్టి ముస్లిం రిజర్వేషన్లు కొనసాగిస్తానంటే మోసం కదా?. నాడు మోదీని తిట్టిన బాబు నేడు పొగుడుతున్నారు.. నాలుగేళ్లలో మోదీ ఏం చేశాడు? మోదీ రాష్టానికి చేసిన మేలు ఏంటో బాబు చెప్పాలి?’’ అని రామకృష్ణ నిలదీశారు.‘‘కూటమి మ్యానిఫెస్టో విడుదలలో పురందేశ్వరి ఎందుకు లేదు? కూటమి మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ నేతలు చెప్పడం దేనికి సంకేతం. అవకాశవాదం, స్వార్థంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు’’ అంటూ రామకృష్ణ మండిపడ్డారు.
ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంపైనే అందరి దృష్టి. టీడీపీ నుంచి ఓ ‘బిజినెస్’మ్యాన్, వైఎస్సార్సీపీ తరపున ఓ ఉన్నత విద్యావంతుడు పోటీలో ఉన్నారు. తండ్రి పేరు, ఇంటి పేరు మినహా మరో అర్హత టీడీపీ అభ్యర్థికి లేదు. వైఎస్సార్సీపీ అభ్యర్థి సాధారణ కుటుంబం నుంచి వచ్చి పెద్ద చదువు, ఉద్యోగం చేసి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి. పేదరికం విలువ తెలిసినోడు. పైగా తాను పోటీ చేసే సామాజికవర్గం మొత్తం తమ అభ్యర్థిని కచ్చితంగా గెలిపించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇదే ఇప్పుడు ప్రత్యర్థిపార్టీ అభ్యర్థిలో గుబులు రేపుతోంది. ఈ నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు 1.15లక్షలు. నియోజకవర్గంలో గెలుపోటములను నిర్దేశించే ఓటర్లు వీరే. అయితే బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో ఈ ఓట్లు తమకు రావనే భావనలో టీడీపీ అభ్యర్థి ఉన్నారు. అందుకే తన నామినేషన్ నుంచి ప్రచారం దాకా ఎక్కడా కాషాయ జెండా కనిపించలేదు. కషాయ జెండా, కమలం గుర్తు కనిపిస్తే బీజేపీ ఓట్లు దూరమవుతాయనేది ఈ అభ్యర్థి భావన. అయితే తన తండ్రి ఏకంగా బీజేపీలోనే ఉన్నారనే విషయాన్ని ఆయన మర్చిపోయాడు. ఇదే సమయంలో మైనార్టీ ఓటర్లకు మాత్రం ఈ దఫా ఎవరికి ఓటు వేయాలనే విషయంలో ఓ స్పష్టత ఉంది. ఇది గ్రహించిన టీడీపీ అభ్యర్థి తండ్రి రంగంలోకి దిగి ప్రలోభాలకు తెరలేపాడు. ఒకరిది జన బలం.. మరొకరిది ధన బలం వైఎస్సార్సీపీ అభ్యర్థి ప్రజల మద్దతుతో గెలవాలనే భావనలో ప్రచారం చేస్తుంటే, టీడీపీ అభ్యర్థి తండ్రి మాత్రం డబ్బుతోనే రాజకీయం చేస్తున్నాడు. ఓ టీంను నియమించుకుని, వారికి జీతాలు ఇస్తూ 50 ఓట్లు ప్రభావితం చేసే వ్యక్తుల నుంచి పారీ్టలతో సంబంధం లేకుండా ఓ జాబితా సిద్ధం చేయించారు. వీరందరికీ ఫోన్లు చేసి స్వయంగా పిలిపించుకుని డబ్బులిస్తూ, తన కుమారుడికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు. ప్రత్యర్థి పార్టీల నుంచి అనుకూలత లేకపోవడంతో తాను 2014, తన కుమారుడు 2019లో ఓడిపోయామని.. ఈ దఫా తన కుమారుడు ఓడిపోతే రాజకీయల నుంచి పూర్తిగా దూరం కావడంతో పాటు నియోజకవర్గాన్ని వదిలేసి హైదరాబాద్కు వెళ్లి రాజకీయాలు చేసుకుంటారని చెబుతున్నారు. ఓడిపోతే హైదరాబాద్కు వెళ్లి రాజకీయాలు చేసేవాడు, గెలిచినా అదే చేస్తాడు. అలాంటి వ్యక్తి రాజకీయాలకు ఏం పనికొస్తారని ప్రత్యర్థిపారీ్టల నేతలు గట్టిగానే బదులిస్తున్నారు. ఇలాంటి వారికి మాకు సాయం చేయకపోయినా ఫర్వాలేదు. వైఎస్సార్సీపీ కోసం తిరగకుండా ఇంట్లో మౌనంగా కూర్చుంటే సరిపోతుందని సెలవిస్తున్నారు. ఒకరిద్దరు డివిజన్స్థాయి నేతలు ఆయన ప్రలోభాలకు లొంగడం మినహా తక్కిన వారంతా ధిక్కారస్వరం వినిపించడం గమనార్హం. ఓటుకు రూ.2వేల చొప్పున రూ.50కోట్లు పంచేందుకు సిద్ధం పోలింగ్ ఈ నెల 13న జరగనుంది. ఈ లోపు ఓటుకు రూ.2వేల చొప్పున 2.50లక్షల ఓట్లకు రూ.50కోట్లు పంచేందుకు నగదు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తుల ఇళ్లతో పాటు తన వ్యాపార సముదాయాల్లో నగదు నిల్వలను ఉంచినట్లు సమాచారం. ప్రతీ ఎన్నికల్లో కేవలం 50శాతం మాత్రమే ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతోంది. ఇందులో మైనార్టీ ఓట్లు అధికంగా పోలవుతాయి. ఆ తర్వాతి స్థానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లు. ఈ వర్గాలన్నీ వైఎస్సార్సీపీకి అనుకూలమనే భావనలో టీడీపీ అభ్యర్థి ఉన్నారు. దీంతో వీరికి అవసరమైతే మరికొంత ఎక్కువ ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటికే కూటమి నేతలకు భారీగా ఖర్చు పెట్టారు. ఈ ఎన్నికల్లో రూ.80 కోట్ల నుంచి రూ.100కోట్లు ఖర్చు పెట్టేందుకు ఈ నేత సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఖర్చు విషయంలో తండ్రీ, కొడుకుల మధ్య తగువు నియోజకవర్గంలో ఓ సామాజికవర్గం ఓట్లు ఎన్ని, ఏ పారీ్టకి ఎవరు అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉందని లెక్కలు వేశారు. దీంతో మైనారీ్ట, ఎస్సీ ఓట్లు గెలుపును నిర్దేశించే స్థాయిలో ఉన్నాయి. ఎస్టీ, బీసీలు కూడా వైఎస్సార్సీపీ వైపు అధికంగా ఉన్నట్లు వారి లెక్కలో తేలింది. పోలింగ్కు కూడా వీరే ఎక్కువగా వస్తారు. దీంతో తక్కిన వర్గాల ఓట్లు తక్కువగా పోలయ్యే అవకాశం ఉందని అంచనా వేసి లెక్కలు వేస్తే తమకు పరాభావం తప్పదని తేలింది. అలాంటప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరం లేదని అభ్యర్థి తండ్రితో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ‘గత రెండు ఎన్నికల్లో మనం ఓడిపోయాం. ఈ దఫా ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో మనకు సీటు కూడా ఇవ్వరు. కచ్చితంగా గెలవాలి. డబ్బులు చూడకూడదు’ అని తండ్రి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీతో పొత్తు వల్లనే ఇదంతా జరగుతోందని, పొత్తు పెట్టుకున్నందుకు చంద్రబాబును కూడా నిషూ్టరమాడుతున్నట్లు చర్చ జరుగుతోంది.
AP: ఓటు వేసిన 102 ఏళ్ల వృద్ధురాలు
పాలకోడేరు: ఓటు ఎంత విలువైనదో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరు మండలం, కుముదవల్లి గ్రామంలో 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు వి.లక్ష్మీ నరసమ్మ శనివారం తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బంది ఆమె ఇంటికి వెళ్లి ఓటు వేయించారు. వయో వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించి హోం ఓటింగ్ రెండోరోజైన శనివారం కూడా కొనసాగింది. గొల్లలకోడేరు, మోగల్లు, కోరుకొల్లు, గరగపర్రు గ్రామాల్లోని వారంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
వీడియోలు
రైల్వే జోన్ పై కొత్త రాజకీయం
షర్మిల నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు: పొన్నవోలు
ఈరోజే వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టో
కేంద్ర మంత్రికి బొత్స స్ట్రాంగ్ కౌంటర్
కేంద్ర మంత్రికి బొత్స స్ట్రాంగ్ కౌంటర్
ఎక్కడ మద్యం దొరికినా సోమిరెడ్డి నాపై బురద జల్లుతున్నాడు
సుజనా చౌదరి అఫిడవిట్ పై అనుమానాలు..కేశినేని నాని డిమాండ్
మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు
మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు
మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు