ప్రధాన వార్తలు
AP Elections 2024: చివరి నాలుగు రోజులే!
హైదరాబాద్, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేని రీతిలో ఈ దఫా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. సంక్షేమాభివృద్ధిలు, సామాజిక న్యాయం అజెండాగా అధికార వైఎస్సార్సీపీ ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడకముందే ప్రచార క్షేత్రంలోకి దిగింది. మరోవైపు.. పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు గందరగోళం నడుమ అయోమయంగానే సాగుతోంది కూమిటి పార్టీల ప్రచారం.ఏపీలో ఈ నెల 11వ తేదీన సాయంత్రం 5గం. ప్రచార పర్వం ముగియనుంది. మే 13వ తేదీన(సోమవారం) ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ చివరి నాలుగు రోజుల్లో ప్రచారం హోరెత్తె అవకాశాలున్నాయి.ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్లతో సంబంధం లేకుండా.. ఏడాది కిందటి నుంచే వైఎస్సార్సీపీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అభ్యర్థుల ఎంపిక.. అందునా సిట్టింగ్లలో ఎవరెవరిని తప్పిస్తారనేది ముందు నుంచే చెబుతూ పార్టీని, పార్టీ శ్రేణుల్ని మానసికంగా సిద్ధం చేస్తూ వచ్చారు. అందుకే సిట్టింగ్లలో కొందరికి సీట్లు దక్కకపోయినా.. పార్టీ కేడర్ మాత్రం ఎక్కడా చెక్కుచెదరలేదు. ఆ వెంటనే సిద్ధం సభలతో పార్టీకి ఉన్న అశేష ప్రజాదరణను దేశం మొత్తానికి చూపించిన సీఎం జగన్.. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేపట్టారు.ఇక బస్సు యాత్ర ముగిసిన వెంటనే కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో.. మరోవైపు జగన్ కోసం సిద్ధం పేరిట మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి తమ విశ్వసనీయత ప్రదర్శిస్తున్నారు. అదే సమయంలో.. సీఎం జగన్ కేవలం తన పరిపాలన గురించి, చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అందుకే సీఎం జగన్ ప్రచారం ఏ రూపంలో ఉన్నా సరే.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఇక కూటమి పార్టీల ప్రచారానికి ప్రజా స్పందనే కరువైంది. ఒకవైపు ఎన్నికల ప్రచార సభలకు జనం లేక వెలవెలబోతుంటే.. పిల్ల కాలువను సముద్రంలా చిత్రీకరించేందుకు ఎల్లో మీడియా ఆపసోపాలు పడుతోంది. యువగళం, ప్రజాగళం, వారాహి.. నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఎవరికి వారే సభలు పెట్టినా.. ఆఖరికి అంతా కలిసి ఉమ్మడిగా సభలు నిర్వహించినా.. జనం ఆసక్తి చూపించడం లేదు. ఆఖరికి.. సూపర్సిక్స్ ల్యాంటి గిఫ్ట్ ప్యాక్లతో ఎరవేసే యత్నం చేసినా.. ఛీ కొట్టేస్తున్నారు. కూటమి పార్టీల ప్రధాన నేతలు ప్రచారంలో జనాకర్షణ కోసం చెమటోస్తున్నారు.ప్రస్ట్రేషన్తో చంద్రబాబు ప్రజాగళం సాగుతోంది. తన హయాంలో జరిగిన ఇది అని చెప్పలేకపోతున్నారు, ప్రజల్లో సెంటిమెంటును ఎమోషన్ను రెచ్చగొట్టేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తనకు అధికారం వస్తే ఇలా చేస్తానని ఇవి అమలు చేస్తానని చెప్పుకోలేకపోతున్నారు. ఇక ఊగిపోతూ పవన్ చేస్తున్న ప్రసంగాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అసలు ప్రచారం చేస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏం జరిగిందో తెలియదుగానీ.. ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పూర్తిగా దూరం ఉండిపోయారు. ఇంకోవైపు వైఎస్సార్సీపీ ఓట్లను చీల్చే కుట్రలో భాగంగా సీఎం జగన్ను.. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు ఏపీ పీసీసీ చీఫ్, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల. ఇక్కడ కాంగ్రెస్ ప్రచారం చెప్పుకోవడం వేస్ట్.కూటమిలో బీజేపీ కూడా ఉండడంతో.. చివరి నాలుగు రోజుల్లో ఆ పార్టీ అగ్రనేతలు ప్రచారంలోకి దిగనున్నారు. మోదీ, అమిత్ షాలు ప్రచారం చేయనున్నారు. మొత్తంగా చూసుకుంటే.. ఏపీ రాజకీయాల్లో మునుపెన్నడూ లేనంతంగా ప్రతిపక్ష కూటమి ప్రచారం అయోమయంగా, గందరగోళంగా సాగుతుండగా, ఒక షెడ్యూల్ ప్రకారం క్లారిటీతో వైఎస్సార్సీపీ ప్రచారంలో దూసుకుపోతోంది.
పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
తూర్పు గోదావరి: అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తుంటే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి రోజురోజుకూ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన నాయకులు వరుస రాజీనామాలు చేయడం, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడం వంటి పరిస్థితులు నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. ఒకపక్క 2009 ఎన్నికల నుంచి టీడీపీ టిక్కెట్ ఆశించి నిరాశ చెందిన పరమట శ్యామ్కుమార్కు ఈ సారీ టిక్కెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో స్వతంత్ర (రెబల్) అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇదే క్రమంలో నియోజకవర్గ టీడీపీలో కీలక నాయకుడిగా ఉన్న మండలానికి చెందిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ప్రకటన చేయడం టీడీపీలో ప్రకంపనలు సృష్టించింది. జగ్గయ్యనాయుడు దూరంగా ఉంటానన్న ప్రకటన వెనుక నియోజకవర్గంలో చోటుచేసుకున్న తాజా పరిమాణాలే కారణమని సమాచారం. పరమట శ్యామ్కుమార్ రెబల్గా పోటీ చేయడంపై తెర వెనుక తన అన్నయ్యతో పాటు తన ప్రమేయం ఉందన్న గుసగుసలు జగ్గయ్యనాయుడిని కొంచెం బా«ధించాయి. టీడీపీలో జరుగుతున్న ఈ అనూహ్య పరిణామాలతో తనకు సంబంధం లేదన్న బాధతో రాజకీయాలకు దూరమయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ తన సోదరుడు చినరాజప్పతోనూ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి ఆనందరావుతోనూ ఎడమోహం పెడమోహంతో ఉంటున్న జగ్గయ్యనాయుడు పొమ్మనకుండానే పొగ పెడుతున్నట్టు ముందుగానే గుర్తించి రాజకీయాలకు దూరంగా ఉంటున్నానన్న మాటతో పరోక్షంగా టీడీపీకి దూరమవుతున్న సంకేతాలను తెలియజేశారు. ఇటీవల అల్లవరం మండలానికి చెందిన టీడీపీ కీలక నాయకుడు అడపా కృష్ణ పారీ్టకి రాజీనామా చేసి రెబల్ అభ్యర్థి పరమట శ్యామ్కుమార్ పక్కన చేరడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. ఇలా వరుస ప్రతికూల ప్రకటనలతో టీడీపీ అభ్యర్థి ఆనందరావు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
నాడు ఒప్పయింది.. నేడు తప్పయిందా?
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో తెలుగుదేశం... దాని అనుబంధ ఎల్లో మీడియా పాపం పిల్లిమొగ్గలు వేస్తోంది... ఎలాగైనా ప్రజలను మెప్పించాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు కాకుంటే ఇప్పుడు ఆ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్లే జస్ట్.. కొద్దిరోజుల క్రితం అబ్బో ఆ చట్టం... రైతులకు చుట్టం... అసలు అలాంటి చట్టం ఉంటే భూ యజమానులు నిశ్చింతగా ఉండొచ్చు.. మీ భూములు.. స్థలాలు కాపాడుకునేందుకు యాతనపడక్కర్లేదు అంటూ అప్పుడు చెప్పినవాళ్ళే ఇప్పుడు ఆమ్మో అది చట్టం కాదు... భూతం అంటూ కొత్త రాగాలు అందుకుంటున్నారు.చంద్రబాబుకు పనికొస్తుంది ఆంటే రాజ్యాంగాన్ని సైతం రద్దు చేద్దాం అనే స్థాయికి దిగజారిపోయారు.. చంద్రబాబు కోసం ఐతే రామాయణం..ఇతిహాసాలు... బైబిల్ ఖురాన్ సైతం చదవొద్దు అని చెప్పడానికి వాళ్ళు ఏమాత్రం వెనుకాడరు.👉ల్యాండ్ టైట్లింగ్ చట్టం సూపర్...అలాంటి చట్టం దేశంలో గతంలో రానేలేదు... అలాంటి చట్టాలు ఉంటే ప్రజలకు నిశ్చింత..భూములకు భద్రతా అంటూ టీడీపీ ఎమ్మెల్యే పబ్లిక్ ఎకవుంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా ఆనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ చట్టం మంచిదని, పలు దేశాల్లో ఇలాంటి చట్టం ఉండడంవల్లనే అక్కడ భూతగాదాలు లేవని వివరించారు...ఇలాంటి చట్టం ఆంధ్రాలో కూడా రావాలని డిమాండ్ చేసారు.. దీంతో అయన వాగ్ధాటి, విషయపరిజ్ఞానం చూసి టీడీపీ సభ్యులు బల్లలు చరిచారు.👉ఈనాడు వారి ఈటీవీలో సైతం ఆమధ్య ఈ చట్టం గొప్పది అంటూ కథనాలు ఇచ్చారు... ఇప్పుడు ఆ చట్టం పేరిట ప్రజలను భయపెట్టడంలో రామోజీ ముందున్నారు...ఈనాడు పేజీలన్నీ ఆ చట్టాన్ని భూతంలా చూపిస్తూ నింపేయగా...ఈటీవీలో గంటలకొద్దీ చర్చలు పెడుతున్నారు... ఆంటే చంద్రబాబుకు ఉపయుక్తం ఆంటే తన వైఖరి ఎలాగైనా మార్చుకునేందుకు రామోజీరావుకు ఎలాంటి సిగ్గు ఉండదు.👉ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రసంగించారు... ఇప్పుడేమో ఆమె తన బంధువు చంద్రబాబు కోసం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు... ఆంటే ఈ చట్టం గొప్పతనం..ప్రజలకు కలిగే మేలు గురించి ఈ ముగ్గురికీ తెలుసు కానీ...ఇప్పుడు చంద్రబాబుకు లబ్ది చేకూర్చడానికి ఆ ముగ్గురూ నాలుక మడతేశారు... జస్ట్ వారంలో జరిగే ఎన్నికల్లో ప్రజలు కుర్చీలు మడతేసి కొడితే ఆ ముగ్గురితో బాటు చంద్రబాబుకు సైతం జేజెమ్మ గుర్తొస్తుంది.:::: సిమ్మాదిరప్పన్న
TDP: అరాచక శక్తులు.. కేసులు గుట్టలు
👉 భూముల కబ్జాకోరులు, కరుడుగట్టిన నేరస్తులకు చంద్రబాబు టికెట్లు ఒకరు భూ కబ్జాకోరు, హత్యా రాజకీయాలకు మారు పేరు.. మరొకరు అవినీతి అక్రమాలకు దేశస్థాయిలో పేరుగాంచిన వారు.. బ్యాంకులకే ఎగనామం పెట్టిన వారు ఇంకొకరైతే, బ్లాక్మెయిలింగ్కు పేరుగాంచిన మహానుభావుడు మరొకరు.. కుట్రలు, కుతంత్రాలకు మారుపేరైన చంద్రబాబు.. తనకు తగ్గ టీంనే ఈసారి బరిలోకి దించారు. దౌర్జన్యకారులు, ఖూనీకోరులను ఎంపిక చేసి మరీ టికెట్లు కట్టబెట్టారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ టికెట్లు దక్కించుకున్న వారిలో ఎవరి చరిత్ర చూసినా కళ్లు బైర్లు కమ్ముతాయి. వీరిని తలచుకుంటేనే సామాన్యులు బెంబేలెత్తాల్సిన పరిస్థితి. కానీ, వీరంతా టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిలో సచ్ఛీలురు కావడమే దౌర్భాగ్యం. అడుగడుగునా అడ్డదారుల్లో ముందుకెళ్తూ, ఎదురొచ్చిన వారిని అడ్డు తొలగించుకుంటూ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన చంద్రబాబు టీంలోని వీరు ఒకవేళ కర్మ కొద్దీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికై తే జిల్లాలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.దళితులకు శఠగోపం.. హత్యా రాజకీయం..తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్పై 2015లో ఏకంగా హత్య కేసు నమోదైంది. వైఎస్సార్ సీపీ నేత ప్రసాద్రెడ్డి దారుణ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఇక.. బండమీద పల్లిలో ఓ దళితుడి భూమిని అక్రమంగా లాక్కున్నాడన్న కారణంగా బాధితుడు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. దీంతో అప్పట్లో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు వ్యతిరేకంగా దళిత సంఘాల నాయకులు ధర్నాకు దిగడం జిల్లాలో చర్చనీయాంశమైంది.డాక్టర్ వద్దంట.. కేసుల వీరుడే ముద్దంటమడకశిర నియోజకవర్గ సీటును 52 కేసులున్న ఎమ్మెస్ రాజుకు చంద్రబాబు కేటాయించారు. ఉన్నత చదువులు చదివిన డాక్టర్ సునీల్కు ముందు టికెట్ ఇచ్చిన బాబు... ఆ తర్వాత ఆయన నుంచి టికెట్ లాక్కుని మరీ నేర చరితుడికి కట్టబెట్టారు. బ్లాక్మెయిలింగ్ చేయడం, డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం, ప్రశ్నిస్తే దౌర్జన్యం చేయడం ఇలా రకరకాల కేసులు ఎమ్మెస్ రాజుపై నమోదై ఉండడం గమనార్హం. శింగన మల, అనంతపురం ప్రాంతాల్లోని స్టేషన్లలో దాదాపు 52 కేసులు ఇతనిపై ఉన్నాయి.జేసీ చరిత్రంతా నేరాల మయమే..జేసీ.. ఈ పేరు చెబితే చాలు నేరాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టుంటుంది. ఫ్యాక్షన్ హత్యలను ప్రోత్సహించి చలి కాచుకున్న జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి.. అవినీతి చేయడంలోనూ పేట్రేగిపోయారు. నకిలీ ఇన్వాయిస్లతో వాహనాల అమ్మకం, అనుమతులు లేకుండా బస్సులు తిప్పడం కేసుల్లో జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డి జైలుకు కూడా వెళ్లొచ్చారు. దేశస్థాయిలో వీరి ఘనకార్యంపై చర్చ నడిచింది. ఇప్పుడు అలాంటి నేరచరిత్ర కలిగిన అస్మిత్ రెడ్డికే చంద్రబాబు తాడిపత్రి టికెట్ ఇచ్చారు. ఎప్పుడూ తాడిపత్రిలో ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని అందరికీ తెలిసిందే.తిట్టి.. టికెట్ కట్టబెట్టి..గుమ్మనూరు జయరాం మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు, ఆయన పుత్రరత్నం నారా లోకేష్లు జయరాంను తిట్టని తిట్టంటూ లేదు.మట్కా ఆడిస్తారని, పేకాట క్లబ్బులు నడిపిస్తారని, బెంజ్కార్లు లంచంగా తీసుకున్నారని ఇలా లెక్కలేనని ఆరోపణలు చేశారు. అయితే, ఎప్పుడైతే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారో వెంటనే సచ్ఛీలుడై పోయాడు. ఇష్టమొచ్చినట్లు తిట్టిన బాబే ఆయనకు గుంతకల్లు టికెట్ ఇవ్వడంతో స్థానికులే కాదు.. జిల్లా ప్రజానీకమంతా ముక్కున వేలేసుకుంది.పరిటాలకే ఎందుకో..?టీడీపీ తరఫున రాప్తాడు ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న పరిటాల సునీత కుటుంబం పేరెత్తితేనే గతంలో ఆ కుటుంబం సాగించిన రక్తచరిత్ర గుర్తుకొస్తుంది. సునీత భర్త పరిటాల రవి అప్పట్లో చేసిన హత్యారాజకీయాల గురించి ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా కథలుకథలుగా చెప్పుకుంటారు. ఆర్వోసీ పేరుతో కొన్ని వందల మందిని ఊచకోత కోసినట్లు చెబుతారు. దీనికితోడు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన సునీత అవినీతి, అక్రమాలకు లెక్కేలేదు.కబ్జాల కందికుంటకదిరి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కందికుంట వెంకటప్రసాద్పై లెక్కలేనన్ని కేసులున్నాయి. కదిరిలో కంటికి కనిపించిన భూములన్నీ కబ్జా చేసేస్తాడనే ఆరోపణలున్నాయి. ఒక రేప్ కేసులో ఈయన నిందితుడిగా ఉన్నట్లు గతంలో ఓ సర్వే సంస్థ వెల్లడించింది. హత్య, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. చెక్బౌన్స్ కేసులైతే లెక్కలేనన్ని. నకిలీ డీడీల కేసులోనూ నిందితుడిగా ఉన్నారు. ఆ కేసును ఇటీవల కొట్టేయడంతో ఇదే అదనుగా చంద్రబాబు ఆయనకు సీటిచ్చేశారు.👉 పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవిత కూడా తక్కువేమీ కాదు. గ్రానైట్, మట్టి, పెట్రోలు కుంభకోణాలకు పాల్పడ్డారని ఈమైపె అనేక కేసులున్నాయి.ఒక హత్య.. మరో హత్యాయత్నం!ఎన్నికల నేపథ్యంలో హత్యా రాజకీయాలకు టీడీపీ నాయకులు తెరలేపారు. కొన్ని రోజుల క్రితం అనంతపురం అర్బన్లో వైఎస్సార్ సీపీ నాయకుడు గుజ్జల నగేష్పై పచ్చ పార్టీకి చెందిన జయరాం నాయుడు వర్గీయులు మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. మరోవైపు కదిరి నియోజకవర్గం జౌకుల గ్రామంలో నాగభూషణం అనే యువకుడిని టీడీపీ వర్గీయులు చంపేశారు. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నేర చరితులకు చంద్రబాబు టికెట్లు కట్టబెట్టడంతోనే ఇలా జరుగుతోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
వీడియోలు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని
మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్
తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల