-
అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
‘ఒరే.. ఏరా..’ ఉద్యోగులను అచ్చెన్నాయుడు పిలిచే విధానమిది. ‘బట్టలూడదీసి కొడితే నీకు దిక్కెవరే..’ ఓ మహిళా కానిస్టేబుల్ను ఉద్దేశించి అచ్చెన్నాయుడు అన్న మాట ఇది. ‘ఏయ్ ఎగస్ట్రా చేయొద్దు. ట్రైనింగ్ ఎవరిచ్చారు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు’ పోలీసులను ఉద్దేశించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి నోటి వెంట వచ్చిన వ్యాఖ్యలివి. ఒంటి నిండా మదం, గొంతు నిండా విషం నింపుకున్న అచ్చెన్నాయుడు ప్రభుత్వ ఉద్యోగులను చాలాకాలంగా చులకనగా చూస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారం లేనప్పుడు కూడా ఆయన తీరు మారలేదు. ఎన్నికల నేపథ్యంలో అచ్చెన్న వ్యవహార శైలిని ఉద్యోగులు విశ్లేషించుకుంటున్నారు.👉ఆర్ అండ్ బీ ఉద్యోగి కళ్యాణి అనే మహిళపై అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో దురుసుగా ప్రవర్తించారు. ఆమైపె దౌర్జన్యం చేశారు. దీంతో మనస్థాపానికి గురై ఆమె ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది.👉 గతంలో కోటబొమ్మాళి మండలం సౌడాం సమీపంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద మహిళా కానిస్టేబుల్పై అచ్చెన్నాయుడు దాడి చేసి, నీకు బట్టలు ఊడదీసి కొడితే దిక్కెవరే అంటూ బెదిరించాడు. ఆ సంఘటనను కప్పి పుచ్చేందుకు అప్పట్లో పోలీస్ అధికారులను బెదిరించి కంప్లైంట్ నమోదు కాకుండా చేశారు.👉 గతంలో పోలాకి మండలం రహీమానుపురంలో జన్మభూమి కమిటీ సభ్యుడు బాలక గోపి తండ్రి డెత్ సర్టిఫికెట్ విషయంలో పంచాయతీ కార్యదర్శి హనుమంతు త్రివేణి అక్కడ నిబంధనల మేరకు వ్యవహరించిందని నిమ్మాడ పిలిపించి ఆగ్రహించడంతో ఆమె అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది.👉గతంలో టెక్కలి ఎంపీడీఓ కార్యాలయంలోకి చొరబడి అప్పటి ఎంపీడీఓగా పనిచేసిన లోకనాథంను బెదిరించారు. చెప్పినట్టు చేయలేదన్న ఆగ్రహంతో తలుపులేసి తంతే నీకు దిక్కెవరు అని భయపెట్టారు.👉గతంలో పోలాకిలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సూర్యారావు అనే కానిస్టేబుల్పై అచ్చెన్నాయుడు దాడి చేశారు. ‘నిన్ను తుపాకీ తిరగేసి కొడితే నీకు దిక్కెవరం’టూ అచ్చెన్నాయుడు బెదిరించారు. సంఘటనపై అప్పట్లో అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేశారు.👉‘ఏయ్ ఎగస్ట్రా చేయొద్దు. ట్రైనింగ్ ఎవరిచ్చారు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు. యూజ్లెస్ ఫెలో’ అని రాజధాని పోలీసు ఉన్నతాధికారులపై నోరు పారేసుకుని చివరికి కోర్టు ఆదేశాలతో కింజరాపు అచ్చెన్నాయుడు లొంగిపోయారు.👉ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరైస్టెనప్పుడు కోటబొమ్మాళి ఆస్పత్రి వద్ద వైద్య పరీక్షలు నిర్వహణ కోసం పోలీసులు తీసుకురాగా...అక్కడున్న సీఐ నీలయ్యను బెదిరించారు. ‘హోం మినిష్టర్ను అవుతాను. నీ లెక్క తేలుస్తాను’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై కింజరాపు అచ్చెన్నాయుడికి ఉన్న గౌరవిమిది. ఒరే..ఏరా అన్న పిలుపే తప్ప ఆయనలో అంతకుమించి సంస్కారం లేదని పలు సందర్భాల్లో తేటతెల్లమైంది. మంత్రి హోదాలోనే కాదు ప్రతిపక్ష నేతగా కూడా అచ్చెన్నాయుడు వ్యవహార శైలి వివాదాస్పదమే. ప్రభుత్వ ఉద్యోగులు అన్నా, అధికారులన్నా చిన్నచూపే. ప్రతి దానికి అధికారులపై మండిపడటం, ఉన్నతాధికారులను సైతం ఏకవచన ప్రయోగం చేయడం, పరుష పదజాలంతో నోటికొచ్చినట్టు మాట్లాడటం, బెదిరించడం ఆయన రాజకీయ జీవితంలో సర్వసాధారణమైపోయింది. అచ్చెన్నాయుడు వస్తే చాలు ఉద్యోగులు భయపడే పరిస్థితి నెలకొంది. ఇక, ఫోన్ బెదిరింపులైతే చెప్పనక్కర్లేదు. తన అనుయాయులకు పనిచేయకపోగా, చెప్పినట్టుగా అధికారులు నడుచుకోకపోయినా ఫోన్ చేసి తిట్టడం, దూషణలకు దిగడం అచ్చెన్నకు పరిపాటిగా మారిపోయింది.ఉద్యోగులపై నిత్యం జులుంటీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపైన జులుం ప్రదర్శించారు. ఎవరైనా జీ హుజూర్ అన్నట్టుగానే ఉండాలి. లేదంటే వారందరికీ శంకర గిరి మాన్యాలు పట్టిస్తానంటూ బెదిరింపులు చేసేవారు. చేయి చూపించి వార్నింగ్లు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. టీడీపీ ఓడిపోయాక కూడా ఆయన మదం తగ్గలేదు. నోటికొచ్చినట్టు దూషణలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులనే కాకుండా పోలీసు అధికారులను బెదిరించారు. అచ్చెన్నాయుడు, కూన రవికుమార్లను చూసుకుని మిగతా టీడీపీ నాయకులు కూడా ఉద్యోగులపైన, అధికారులపైన విరుచుకుపడ్డ సందర్భాలు ఉన్నాయి.బేరీజు వేసుకుంటున్న ఉద్యోగులు ఇటు కింజరాపు అచ్చెన్నాయుడు, అటు కూన రవికుమార్ వ్యవహార శైలిపై ప్రభుత్వ ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం అధికారులకు గానీ, ఉద్యోగులకు గానీ గౌరవం లేకుండా పోయిందని, అదే సంస్కృతిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కొనసాగించారని ప్రభుత్వ ఉద్యోగులు విశ్లేíÙంచుకుంటున్నారు. అధికారులపైన, ఉద్యోగులపైన జులుం ప్రదర్శించడంతో పాటు దూషణలు, బెదిరింపులకు దిగే టీడీపీ నాయకులెక్కడ, ఉద్యోగులను గౌరవించే ప్రస్తుత వైఎస్సార్సీపీ పాలకులెక్కడ అని బేరీజు వేసుకుంటున్నారు. ఎవరి హయాంలో ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకున్నామన్నదానిపై ఎన్నికల నేపథ్యంలో తేడాలు గమనించుకుంటున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసుకునే తరుణంలో ఎవరు బెస్ట్ అనే దానిపై పోల్చి చూసుకుంటున్నారు. -
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
శ్రీకాకుళం పాత బస్టాండ్: పోస్టల్ బ్యాలెట్లను శనివారం నుంచి స్వీకరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి మన్జీర్ జిలానీ సమూన్ తెలిపా రు. జిల్లాలో సుమారుగా 30,606 మంది ఎన్నికల విధుల్లో వివిధ కేడర్లలో పాల్గొంటున్నారని, వీరంతా వారికి కేటాయించిన షెడ్యూల్ ప్రాప్తికి ఓట్లను పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేసుకోవాలని ఆయన తెలిపారు. పీఓలు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్స్, హోం ఓటింగ్ ఇతర టీంలకు 4వ తేదీన, ఓపీఓలు, సెక్టార్ అధికారులు, ఇతర టీంలకు 5వ తేదీన, పోలీస్, ప్రైవేటు డ్రైవర్స్, ఆర్టీసీ డ్రైవర్స్, వీడియోగ్రాఫర్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, ఎక్స్సర్వీస్మెన్లకు 6వ తేదీన, జిల్లా స్థాయి అధికారులకు, ఇతర జిల్లాల్లో పనిచేసిన వారికి, హోం ఓటింగ్ పరిశీలకులకు 6వ తేదీన, రిజర్వ్ డే గా 7వ తేదీని కేటాయించారు. ఈ తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ను వేసుకోవాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు ఇచ్ఛాపురం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పలాస ప్రభుత్వ హైస్కూల్, పలాస టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, టెక్కలి పాతపట్నం ఏపీ మోడల్ స్కూల్, పాతపట్నం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల (మెన్) ఆమదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఆమదాలవలస ఎచ్చెర్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పోలీస్ క్వార్టర్స్ నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నరసన్నపేట -
ఈవీఎంల కమిషనింగ్ ప్రారంభం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మన్జీర్ జిలాని సమూన్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈవీఎంలపై సీరియల్ నంబర్లు, అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన చిహ్నాల ఏర్పాటు సీసీ కెమెరాల ఎదుట పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. కమిషనింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి, ఈవీఎంల పనితీరు పరిశీలించి, వారికి పూర్తిస్థాయిలో నమ్మకాన్ని కలిగించాలని సూచించారు. రెండో విడత ర్యాండమైజేషన్లో కేటాయించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల నంబర్లను కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్లని ఆయా పోలింగ్ కేంద్రాలకు కేటాయించే ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం అక్కడే నియోజకవర్గ ఎన్నికల సిబ్బంది శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి తనిఖీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. -
దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటరమణ సస్పెన్షన్
అరసవల్లి: జిల్లా దేవదాయ శాఖకు చెందిన నరసన్నపేట గ్రూప్ టెంపుల్స్ ఈఓగా పనిచేస్తున్న శ్రీకాకుళం డివిజన్ ఇన్స్పెక్టర్ కె.వెంకటరమణను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్.సుజాత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నరసన్నపేట గ్రూప్ టెంపుల్స్లో భాగంగా ఉన్న శ్రీకాకుళం మండలం సింగుపురం కొండపై ఉన్న శ్రీ హటకేశ్వర స్వామి వారి ఆలయంలో గత నెల 24న జరిగిన జాతర మహోత్సవం అనంతరం హుండీ కానుకల లెక్కింపును అనధికారికంగా చేపట్టడంతో పాటు నిబంధనలను పాటించకపోవడంపై ఈఓ వెంకటరమణపై ఉన్నతాధికారులు పైచర్యలకు ఉపక్రమించారు. ఆలయ హుండీ లెక్కింపునకు సంబంధించి జిల్లా దేవదాయ శాఖాధికారి కార్యాలయానికి ఇతర నిర్వహణ శాఖలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే హుండీలను తెరిపించారన్న విషయం జిల్లా అధికా రుల దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించారు. ఈ మేరకు విచారణ అనంతరం శ్రీకాకుళం డివిజన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న వెంకటరమణను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ డిప్యూటీ కమిషనర్ సుజాత ఉత్తర్వులను జారీ చేశారు. ఆయన స్థానంలో ఇన్స్పెక్టర్గా రవికుమార్కు బాధ్యతలను అప్పగించారు. జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన 5 నుంచి 18 ఏళ్ల లోపు గల బాలల నుంచి కేంద్ర ప్రభుత్వ సీ్త్ర,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కారాలను ప్రదానం చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఏపీఎస్సీపిసీఆర్) సభ్యుడు గొండు సీతారాం శుక్రవారం తెలిపారు. సామాజిక సేవ, సాంకేతిక పరిజ్ఞానం, విద్య, ధైర్య సాహసాలు, పర్యావరణం, క్రీడలు, కళలు, సాహిత్యం, సంగీతం, నృత్యంతో పాటు వివిధ వాటిలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన, దేశానికి చెందిన వారు అర్హులన్నారు. ఆసక్తి గల బాలలు జూలై 31వ తేదీ లోపు హెచ్టీటీపీఎస్ డాట్ అవర్డ్స్డాట్ జీఓవీడాట్ ఇన్ వెబ్ సైట్ ద్వారా పంపించాలని సీతారాం సూచించారు. ‘హింసకి తావులేని ఎన్నికలే లక్ష్యం’ శ్రీకాకుళం పాతబస్టాండ్: సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా, రీ పోలింగ్ జరగకుండా ఉండేలా పని చేయడమే ప్రధాన లక్ష్యం కావాలని భారత ఎన్నికల కమిషన్, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నారు. ఆయన శుక్రవారం జిల్లాల ఎన్నికల అధికారులు, సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా నితేష్ మాట్లాడుతూ రీ పోల్కు తావు లేకుండా పారదర్శక ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా అందరూ కృషి చేయాలని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కీలకమని, వారికి ఈవీఎం వాడకంపై పూర్తి అవగాహన ఉండాలని, వారు పోలింగ్ ప్రక్రియలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు అనే అంశాలు స్పష్టంగా తెలుసుకోవాలని సూచించారు. పోలింగ్ ప్రక్రియలో లోపం ద్వారా రీపో ల్కు అవకాశం ఉండరాదని స్పష్టం చేశారు. ఈవీఎం వినియోగం, రీప్లేస్మెంట్ కు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉందని ఆ మేరకు మాత్రమే చర్యలు ఉండాలని తెలిపారు. జిల్లా నుంచి సాధారణ పరిశీలకులు శేఖర్ విద్యార్థి మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధంగా ఉన్నా మని తెలిపారు. పోలీస్ అబ్జర్వర్ దిగంబర్ పి.ప్రధాన్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఏర్పాటయ్యాయని, వాటిని తాను స్వయంగా పరిశీలించానని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్, ఎస్పీ జీఆర్ రాధిక మాట్లాడుతూ అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుల ఏర్పాటు, అంతర్ జిల్లాల చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఎప్పటికప్పుడు సీజర్ అంశాలు, ఎన్నికల వ్యయ పరిశీలన జిల్లాలో పక్కాగా ఉన్నాయని, జిల్లాలో సు మారు రూ. 4 కోట్ల వరకు సీజ్ చేశారని తెలిపారు. ఇప్పటికే రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశం నిర్వహించి తదుపరి ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పులు బీఎల్వోల ద్వారా సంబంధిత ఓటరుకు పంపిణీ చేయడం జరుగుతోందని అన్నారు. -
ఓటు వేసిన పారామిలటరీ సైనికులు
నరసన్నపేట: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాకు చెందిన పారామిలటరీ సైనికులు తమ సర్వీసు ఓటును శుక్రవారం వినియోగించుకున్నారు. చత్తీస్గఢ్ రాష్ట్రం దుర్గు జిల్లా బిళాయి వద్ద పారామిలటరీ క్యాంపులో కమాండింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన పోలింగ్ కేంద్రంలో వీరు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటును పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో వేశారు. జిల్లాకు చెందిన 81 మంది పారామిలటరీ సైనికులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. వీరిలో 76 మంది ఆమదాలవలస, నరసన్నపేట, పలాస. ఇచ్చాపురం నియోజకవర్గాలకు చెందిన అసెంబ్లీ అభ్యర్థులకు ఓటు వేశారు. 81 మంది శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థులకు ఓటు వేశారు. ఈ మేరకు పారామిలటరీ సైనికుడు పోలాకి మండలం ఖాన్సాహేబ్పేటకు చెందిన కోట్ని లక్ష్మణరావు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాయ్బరేలీలో రాహుల్కు దినేష్ పోటీనివ్వగలరా?
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
రాజకీయ ఎంట్రీ? జ్యోతిక సమాధానమిదే!
వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
అనకాపల్లిలో కలకలం.. బూడి ముత్యాలనాయుడు హత్యకు కుట్ర!
కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
ఢిల్లీలో కుమారి ఆంటీ తరహా ఎపిసోడ్
సరైన సమయంలో సరైన పుస్తకం 'మూడు దారులు’!
తప్పక చదవండి
- కాంగ్రెస్కు షాక్.. ‘ప్లీజ్ పోటీ చేయలేను’
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- ఆ రాష్ట్రంలో రెండు రోజులు డ్రై డే!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- మీసాలున్నాయని 80 మందిని తొలగించిన కంపెనీ!
- అగ్ని ప్రమాదం.. చిన్నపాటి ఖర్చుతో మరింత భద్రం!
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- స్టార్క్ దెబ్బకు ఇషాన్ బౌల్డ్.. రితిక రియాక్షన్ వైరల్
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
Advertisement