-
జగన్తోనే పారదర్శక పాలన
కొండపి (సింగరాయకొండ): వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక పాలన చేశారని..పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించారని.. మంత్రి, కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం మండలంలోని నేతివారిపాలెంలో రోడ్షో నిర్వహించారు. ముందుగా గ్రామ నాయకుడు దివి శ్రీనివాసులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సువర్ణ పాలనను గుర్తించి మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత జగన్కే దక్కిందన్నారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోను చూసి మరోసారి మోసపోవద్దని కోరారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆయనకు ప్రజలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. ఆయన కథ ఏంటో 2014 లోనే ప్రజలకు తెలిసొచ్చిందన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించారన్నారు. రైతులు, పొదుపు మహిళల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి వారిని మోసం చేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మరోసారి ఆయన మాటలకు మోసపోవద్దని సూచించారు. 13వ తేదీ జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఆరికట్ల కోటిలింగయ్య, జేసీఎస్ కన్వీనర్ గొట్టిపాటి మురళి, గ్రామ నాయకులు దివి శ్రీనివాసరావు, నన్నూరి శ్రీను, కొండయ్య, బొక్కిసం సుబ్బారావు, మారెడ్డి వెంకటాద్రి రెడ్డి, వేముల రమేష్, చింతల వెంకటేశ్వర్లు, సురేష్, సుధాకర్, ఎస్సీ సెల్ కన్వీనర్ గర్నిపూడి రమేష్, వసంత్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమం మంచి చేసిన ప్రభుత్వానికి అండగా నిలవండి ఎన్నికల ప్రచారంలో మంత్రి ఆదిమూలపు సురేష్ -
సమరోత్సాహంలో యువత
మద్దిపాడు: రాబోయే ఎన్నికల్లో యువత సమరోత్సాహంతో ముందుకు నడుస్తోందని పార్టీకి మూల స్తంభాలు యువతే అని సంతనూలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని ఏడుగుండ్లపాడు, సీతారాంపురం, నేలటూరివారిపాలెం, లింగంగుంట, పెదకొత్తపల్లి, నేలటూరు గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నిక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. నేలటూరు గ్రామంలో ప్రచారానికి వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవడానికి యువత సిద్ధంగా ఉందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు అవసరమని నమ్మి వాటికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించారన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిన ఘనుడు చంద్రబాబు అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ముఖ్యమంత్రి పై అభాండాలు వేస్తూ తన పచ్చ ప్రసార సాధనాల్లో విషం చిమ్మారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవడానికి మోసపూరిత హామీలు ఇస్తున్నాడని అన్నారు. ఇంటికి ఒక చిన్నారికే అమ్మ ఒడి పథకం అమలు చేస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి శ్రీలంకలా మారుస్తున్నాడంటూ గగ్గోలు పెట్టిన ఈ పెద్దమనిషి ఇప్పుడు తన మ్యానిఫెస్టోలో ఇంటిలో అందరికీ అమ్మకు వందనం పథకంలో రూ.15 వేలు ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పక్క రాష్ట్రాల నుంచి, వైఎస్సార్ సీపీ నుంచి పథకాలను కాపీ కొట్టిన చంద్రబాబు తన మ్యానిఫెస్టో అంటూ చెబుతున్నాడని.. కానీ గత ఎన్నికల్లో చెప్పిన మ్యానిఫెస్టో ఏమైందో అందరికీ తెలుసని అన్నారు. ర ముందుగా ప్రతి గ్రామంలో యువకులు బైకులతో ర్యాలీలు నిర్వహిస్తూ మేళతాళాలతో ఊరేగింపుగా మంత్రి మేరుగు నాగార్జునను తమ గ్రామాలకు ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు మండవ అప్పారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీటీసీ వాకా కోటిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చుండూరి రవి, గొర్రెపాటి శ్రీను, పార్టీ సీనియర్ నాయకులు బాలాంజనేయరెడ్డి, గుడ్డపాతల రవి, మండవ బాల చంద్రమౌళి, మేకల కృష్ణారెడ్డి, కంచి శ్రీనివాసరెడ్డి అచ్యుత్, మందా చిన్న, జనార్దన్, శ్రీకాంత్, దుంపా సుబ్బారెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు యువత భారీగా పాల్గొన్నారు. పార్టీ విజయానికి పాటుపడతామన్న యువత మంత్రి మేరుగు నాగార్జున ఎన్నికల ప్రచారం -
గెలిపించండి..మీ నమ్మకాన్ని నిలబెడతాం
ఒంగోలు టౌన్: ఎమ్మెల్యే, ఎంపీగా తమను గెలిపించండి, మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. నగరంలోని ఏవన్ ఫంక్షన్ హాలులో ఆదివారం రాత్రి ఆర్యవైశ్య అత్మీయ సమావేశం నిర్వహించారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన సభలో బాలినేని మాట్లాడుతూ తెలుగుదేశం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సభలో ఎప్పుడూ అబద్దాలు మాట్లాడే జనార్దన్ నేను ఆర్యవైశ్యులను ఇబ్బందులు పెట్టినట్లు చెప్పాడని, పాతికేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేశాను, ఏనాడూ ఆర్యవైశ్య వ్యాపారులను ఇబ్బందులు పెట్టలేదని అన్నారు. కరోనా లాంటి విపత్కర సమయాల్లో కూడా ఆర్యవైశ్యులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు పూర్తిగా సహకరించానని తెలిపారు. అదే తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. నేను ఎలాంటి ఇబ్బందులు కలిగించినట్లు రుజువు చేస్తే ఇప్పుడే రాజీనామా చేసి పోతానని చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం గురించి టీడీపీ లెక్కలేనన్ని అబద్ధాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావుకు టీటీడీ చైర్మన్ గా చేయాలని కోరికగా ఉందని, ఆయనను టీటీడీ చైర్మన్ను చేసేంత వరకు ముఖ్యమంత్రితో పోరాడుతానని చెప్పారు. ప్రతి రెండేళ్లకోసారి ఒంగోలులో శ్రీనివాస కళ్యాణం జరిపిస్తానన్నారు. మీ కోసం ఏది చేయడానికై నా సిద్ధంగా ఉన్నాను, నన్ను, చెవిరెడ్డి భాస్కరెడ్డిని గెలిపించండి, మీ రుణం తీర్చుకుంటాం అన్నారు. ఆర్యవైశ్యుల ఇంట్లో పెరిగాను: చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తాను చిన్నప్పుడు ఆర్యవైశ్యుల ఇంటిలోనే పెరిగానని, వారితోనే తిరిగానని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డి తెలిపారు. ఆర్యవైశ్యులు నిజాయితీకి మారుపేరని, నమ్మకంగా ఉంటారని, అందుకే వారంటే తనకు ఎంతో గౌరవమని చెప్పారు. తన వ్యాపారాల విషయంలో ఆర్యవైశ్యులను నమ్ముతానని అన్నారు. ఆరో తరగతి నుంచి బీఈడీ దాకా 18 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే చదువుకునే అదృష్టం లభించిందని చెప్పారు. టీటీడీ బోర్డులో పలు మార్లు సభ్యుడిగా పనిచేసే అవకాశం దేవుడు కల్పించారన్నారు. మీ సేవ చేయడానికే వెంకటేశ్వరస్వామి ఇక్కడికి నన్ను పంపించాడని భావిస్తున్నానని, ఎంపీగా గెలిపిస్తే మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. ఐదేళ్లకోసారి వచ్చిపోయే రకం కాదని, మీ కుటుంబ సభ్యుడిగా, మీలో ఒకడిగా వ్యవహరిస్తానని అన్నారు. కష్టాల నుంచి పెరిగాను, కష్టాల విలువ బాగా తెలుసు, ప్రజల కష్ట సుఖాల్లో అండగా ఉంటానని చెప్పారు. బాధ్యతగా, నిజాయతీగా పనిచేస్తాను, ఆశీర్వదించండి అని కోరారు. ఆర్యవైశ్యులంతా ఐక్యంగా కలిసి మెలిసి వైఎస్సార్ సీపీకి ఓట్లేయాలని, బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలను గెలిపించాలని మాజీ మంత్రి శిద్దా రాఘవరావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బాలినేని శచీదేవి, బాలినేని కావ్య, నగర మేయర్ గంగాడ సుజాత, కారంశెట్టి పుష్పలత, కుప్పం ప్రసన్న, ఆర్యవైశ్య నాయకులు మునగా కృష్ణారావు, కోడూరి సత్యనారాయణ, మట్టరాజ, తడపర్తి వాసు, తాతా మధు, రామస్వామి, శిద్దా హనుమంతరావు, సురేష్, ప్రవీణ్, సత్యం, వినోద్ ఆరె శ్రీను, ఆనంద్, కూరపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆత్మీయ సమావేశంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చిన్నారులు ప్రదర్శించిన శాసీ్త్రయ నృత్యాలు హైలెట్గా నిలిచాయి. ఆధ్యాత్మిక గీతాలు రంజింప చేశాయి. వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర గురించి నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. తొలుత వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మట్టి శివలింగానికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమాలకు హోస్టర్లుగా మృదుల, సుమన శ్రీ, మలక్ పేట శైలజ వ్యవహరించారు. ఆర్యవైశ్యులకు బాలినేని శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విజ్ఞప్తి గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు.. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా చూసుకుంటానన్న బాలినేని ఆర్యవైశ్యుల ఇళ్లలోనే పెరిగాను..మీతో శభాష్ అనిపించుకుంటానన్న చెవిరెడ్డి పండుగలా జరిగిన ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం -
దామా.. అంతా డ్రామా జనం చిత్రవధ
కుట్రలూ..కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి కింది స్థాయి నేతల వరకూ అదేతీరు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు అభివృద్ధికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రజల్ని ఇబ్బందులకు గురిచేశారు. పార్టీ అధినేత చంద్రబాబు మెప్పు కోసం ఊరచెరువు ప్రాంతంలోని ముస్లింలపై ప్రతాపాన్ని చూపారు. నగరంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు అడుగడుగునా న్యాయపరమైన అవరోధాలు కల్పించారు. ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం ఆ తర్వాత మొండిచేయి చూపడం ఆయనకు అలవాటేఒంగోలు సాక్షిప్రతినిధి: తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఒంగోలు నియోజకవర్గ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ వ్యవహార శైలితో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆయన పాల్పడిన అక్రమాలు ఎన్నో ఉన్నాయి. పుష్కరకాలంగా దామచర్ల కుట్రలు, కుతంత్రాలకు సాక్ష్యంగా పలు సంఘటనలు నిలుస్తున్నాయి. ఆయన సొంత సామాజిక వర్గం నేతల్ని మినహా మిగతవారందరినీ అవసరాలకు తగ్గట్టుగా వాడుకుని వదిలేస్తారన్నది బహిరంగ రహస్యం. 2012 సంవత్సరంలో జరిగిన ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దామచర్ల పోటీకి దిగారు. ఆ నాటి నుంచి నేటి వరకూ నగరంలో జరిగిన సంఘటనల్లో ప్రధానమైనవి పరిశీలిస్తే నియోజకవర్గానికి ఎంత నష్టం జరిగిందో అవగతమవుతుంది.👉 2012 ఉప ఎన్నికల సమయంలో 9వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో సొంతంగా మినరల్ వాటర్ ప్లాంటు పెడుతున్నట్లు డ్రామా ఆడారు. వైఎస్సార్ ప్రభుత్వంలో కేటాయించిన నివాస ప్లాట్లలో ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి చేశారు. అది కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉండగా. దీంతో అప్పట్లో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి రాగానే మినరల్ వాటర్ ప్లాంటు పెడతామని హామీ ఇచ్చారు. కానీ నేటికీ అక్కడ మినరల్ వాటర్ ప్లాంటు ఏర్పాటు కాలేదు.👉 ఏడుగుండ్లపాడు నుంచి ఒంగోలుకు మంచినీటి పైపులైను నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. సమయంలో ప్రైవేటు స్థల యజమానికి పరిహారం ఇవ్వకుండా ఇష్టారీతిన వ్యవహరించడంతో పనులు నిలిచిపోయాయి. మరో వైపు నరగపాలక సంస్థ రూ.70 కోట్లు భాగస్వామ్యంగా వ్యయం చేయాల్సి ఉంది. అయితే కేంద్రం విడుదల చేసిన నిధులను ఖర్చుచేసి కమీషన్లు కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి.👉 నగరంలో రెండో కేంద్రీయ విద్యాలయం అవసరం ఉందని అప్పట్లో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్ర మానవవనరుల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక ప్రభుత్వ భవనాల సముదాయంలో రూములు కూడా తాత్కాలికంగా కేటాయించారు. సొంత భవనం నిర్మాణం కోసం స్థానిక జవహర్ నవోదయ విద్యాలయానికి సంబంధించి శిథిలమైన క్వార్టర్లు ఉండే భాగాన్ని ఎంపిక చేశారు. కానీ ఆ స్థలాన్ని కేటాయిస్తే వైఎస్సార్ సీపీకి మంచి పేరువస్తుందని కుట్రలు పన్ని అడ్డుకున్నారు దామచర్ల.👉 రాష్ట్రవ్యాప్తంగా మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని టీడీపీ ప్రభుత్వం సూచించింది. అందుకుగాను ఎన్టీయార్ సుజల పథకం అని నామకరణం చేశారు. అందులో భాగంగా ఒంగోలులో కూడా కేశవరాజుకుంటలో ఒక నివేశన స్థలంలో ప్లాంటు అయితే ఏర్పాటు చేశారు కానీ చుక్క నీరు కూడా విడుదల చేయలేదు. పేరుకు మాత్రం 20 లీటర్ల నీరు రూ.2లకే అని పేర్కొన్నారు. అందులోనూ తిరకాసే. ఖర్చు దాతలది...ప్రచారం ప్రభుత్వానికి కావడంతో దాతలు ముందుకు రాలేదు.👉 ప్రస్తుత మినీ స్టేడియం పక్కన ఉన్న జెడ్పీ ప్రాంగణాన్ని టీడీపీ కార్యాలయం కోసం కేటాయించాలంటూ జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబుపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆయన అందుకు తిరస్కరించడంతో జైకా నిధులతో నిర్మిస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు కార్యాలయంపై కన్ను పడింది. కార్యాలయ భవన నిర్మాణ పనులను అడ్డుకుని నానా యాగీ చేశారు. నేటికీ పునాది దశలోనే ఆ నిర్మాణం దర్శనమిస్తోంది.👉 వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఉచితంగా స్థలమిచ్చి ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. అందులో భాగంగా యరజర్ల వద్ద 25 వేలమందికి ఇళ్లపట్టాలు ఇచ్చి శాటిలైట్ సిటీ నిర్మించాలని బాలినేని యత్నిస్తే దానిని కోర్టు కేసుల ద్వారా అడ్డంకులు సృష్టించి అడ్డుకున్నారు. పేదలకు ఎలాగైనా సొంతిళ్లు నిర్మించాలని బాలినేని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా అధికారులు పక్కాగా ప్రైవేటు స్థలాలను కొనుగోలు చేశారు. సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇస్తే అవి దొంగపట్టాలంటూ తప్పుడు ప్రచారానికి తెరతీశారు. ఈ స్థలాలపై కూడా న్యాయపరమై ఇబ్బందులు కలిగించేందుకు యత్నిస్తూనే ఉన్నారు.👉 సంతనూతలపాడు, కొప్పోలు చెరువులను సమ్మర్ స్టోరేజీ ట్యాంకులుగా ఏడాది కాలంలో నిర్మిస్తానని ఎంఎల్ఏగా గెలిచిన మొదటి పర్యటలోనే ప్రజలకు దామచర్ల హామీ ఇచ్చారు. కానీ ఆయన పదవీ కాలం పూర్తయ్యేనాటికి కూడా కనీసం వాటివైపు తొంగి చూసిన దాఖలాలు కూడా లేవు.👉 స్థానిక బైపాస్లో విలువైన స్థలాన్ని పార్టీ కార్యాలయం కోసం ప్రభుత్వం వద్ద నుంచి లీజుకు తీసుకున్నారు. దాని ప్రకారం అందులో నిర్మాణం ప్రారంభించాల్సి ఉన్నా అది ప్రారంభం కాకపోవడంపై దాతలు దొరక్కే అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.👉 స్థానిక కేశవరాజు కుంటలో పెళ్లి కానుక పేరుతో ధనికులైన, తెల్లకార్డు కూడా లేని తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్లకు ఎన్ఎస్పీ భూమికి నకిలీ పట్టాలు సృష్టించి మరీ అప్పగించిన చరిత్ర దామచర్లదే. చివరకు ఈ వ్యవహారంపై తిరగబడ్డ సమీప కాలనీవాసులైన మహిళలపై పెద్ద ఎత్తున కేసులు కూడా పెట్టించి పోలీసుస్టేషన్కు తీసుకువెళ్లిన ఘనత దామచర్లదే.👉 దామచర్ల తన కార్యాలయంలో పనిచేసే వ్యక్తిని డ్రైవింగ్ లైసెన్స్, టూ వీలర్ కాగితాలు చూపించాలని ట్రాఫిక్ ఎస్సై మహేష్ కోరినందుకు ట్రాఫిక్ పోలీస్స్టేషన్నే ముట్టడించారు.బాబు మెప్పుకోసం..తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒంగోలు ఊరచెరువుపై చంద్రబాబు కన్నుపడింది. ఆ స్థలంలో భువనేశ్వరి హాస్పిటాలిటీ సర్వీసెస్ పేరుతో ఆ భూమిని లీజుకు కేటాయించేందుకు యత్నాలు జరిగాయి. అప్పటి టీడీపీ మున్సిపల్ పాలకవర్గం అనుమతి కూడా ఇచ్చేసింది. అప్పటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అడ్డుతగలడంతో అది కాస్తా ఆగింది. తిరిగి 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు కన్ను మరోమారు ఆ ప్రాంతంపై పడింది. అధినేతను ప్రసన్నం చేసేందుకు దశాబ్దాలుగా ఊరచెరువు ఒడ్డున ఇనుపరేకులు, చెక్క వస్తువుల తయారీ దుకాణాలు ఏర్పాటు చేసు కుని పొట్టపోసుకుంటున్న ముస్లిం కుటుంబాలపై ప్రతాపాన్ని చూపారు దామచర్ల. రంజాన్ మాసం అని కూడా చూడకుండా వారి షాపులను కూల్చివేయించారు. దానిని హస్తగతం చేసుకోవాలని యత్నించినా బాలినేని ముస్లింలకు అండగా నిలిచారు. దీంతో నేటికీ వారి దుకాణాలు అక్కడే ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాడు అరాచకాలకు పాల్పడి నేడు ఎన్నికలు సమయం వచ్చేసరికి ముస్లింలకు అండగా ఉంటానంటూ ప్రవచనాలు వల్లిస్తున్నారు.జెడ్పీ పీఠంపైనా కుట్రే..2014 సాధారణ ఎన్నికలకు కొద్ది ముందుగా జిల్లా ప్రజాపరిషత్కు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు 31 ప్రాదేశికాలను కై వసం చేసుకుంటే టీడీపీ 25 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో ముగ్గురు అభ్యర్థులను కొనుగోలు చేయడం ద్వారా, మరో వైఎస్సార్ సీపీ అభ్యర్థిని ఎన్నికకు హాజరుకాకుండా పోలీసుల అండగా యత్నించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ తదితరులు అడ్డుకట్ట వేశారు. అయితే ఈదర హరిబాబు జెడ్పీ చైర్మన్గా ఎంపిక కావడం ఇష్టంలేని దామచర్ల చివరకు ఆయనను జెడ్పీ చైర్మన్ స్థానంలో కొనసాగకుండా చేసేందుకు ఎంతోమందిపై ఎన్నోరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చారు.కాపులపైనా కేసులుఅధికారంలో ఉన్నప్పుడు కాపులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన జనార్దన్ నేడు జనసేన పొత్తు కలవడంతో కుల రాజకీయాలకు తెరతీశారు. నేతలను తమ వైపునకు తిప్పుకుంటే ఓట్లు వాటంతట అవే పడతాయనే భావనతో నేతలపై ఆకర్ష పథకాన్ని ప్రారంభించారు. నాడు కాపు సోదరునిపై గంజాయి కేసు పెట్టించారు. అంతే కాదు ముద్రగడపై టీడీపీ ప్రభుత్వ దమన కాండను నిరశిస్తూ కంచాలు మోగిస్తే దానిపై సైతం కేసులు పెట్టించిన విషయాన్ని కాపులు మర్చిపోలేదు. ఇలా అన్ని రకాలుగా నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన దామచర్లను జనం ‘నిన్ను నమ్మం’ బాబూ అంటున్నారు. -
సంక్షేమంలో ఛాలెంజ్
మేలుమార్కాపురం: దివ్యాంగులు ఎందులోనూ తక్కువ కాదు. అవయవ లోపం వారి ప్రతిభకు అడ్డు కానే కాదు. వివక్ష చూపడం, అవహేళనగా మాట్లాడటం మాని సమానంగా చూడటం సామాజిక బాధ్యత. కానీ ప్రభుత్వాలే దివ్యాంగులను నిర్లక్ష్యం చేస్తే సమాజం మరింత చిన్న చూపు చూస్తుంది. దివ్యాంగుల విషయంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి సంక్షేమానికి చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. దివ్యాంగుల్లో మరింత ఆత్మస్థ్యైర్యం నింపాయి. రేపటిపై ఆశతో, భవిష్యత్పై భరోసాతో సమస్యలను ‘ఛాలెంజ్’ చేస్తూ దివ్యాంగులు ముందుకు సాగుతున్నారు. దివ్యాంగులకు డిజిటల్ విద్య విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు సైతం డిజిటల్ విద్యను చేరువ చేసింది. జిల్లాలో 38 భవిత కేంద్రాల్లో సుమారు 800 మంది విద్యార్థులు నమోదై ఉన్నారు. వీరిలో 380 మంది వరకు ఇంటి వద్దనే ఉంటూ ఐఈఆర్టీల ద్వారా శిక్షణ పొందుతున్నారు. దృష్టిలోపం, నోవిజన్, మూగ, చెవుడు కలిగిన ఉన్నత పాఠశాలల విద్యార్థులు సుమారు 296 మందికి, ఐఈఆర్టీలు 75, స్కూల్ అసిస్టెంట్లకు (స్పెషల్ బీఈడీ చేసిన ఉపాధ్యాయులు) 43 ట్యాబ్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఎన్ఏపీ 2020లో భాగంగా దివ్యాంగ విద్యార్థులకు అందించిన ఒక్కో ట్యాబ్ విలువ సుమారు రూ.30 నుంచి రూ.35 వేల వరకు ఉంటుంది. ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్ (ఐఈఆర్టీ), దివ్యాంగుల తల్లిదండ్రులకు ట్యాబ్ల వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.● దివ్యాంగులకు గతం కంటే మిన్నగా చేయూత ● ఆత్మస్థైర్యం పెంచేలా ప్రభుత్వ కార్యక్రమాలు ● పర్సెంటేజీని బట్టి పింఛను ఇచ్చే విధానం రద్దు ● పింఛను పెంపు, ఇతర సంక్షేమ పథకాల్లో ప్రాధాన్యం ● పక్షవాతం బాధితులకు రూ.5 వేలు, మంచానికే పరిమితమైతే రూ.10 వేల పింఛను ● వాహనాలు, ఉపకరణాల రూపంలో 1,899 మందికి రూ.2.84 కోట్ల లబ్ధి ● ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ నాడు దురవస్థ గత టీడీపీ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, వారిలో ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసింది. పింఛను ఎప్పుడిస్తారో తెలియదు. సదరం క్యాంపుల్లో సర్టిఫికెట్లు అందక, వారికి కావాల్సిన ప్రత్యేక ఉపకరణాలు లభించక దివ్యాంగులు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఏదైనా పథకం కోసం దరఖాస్తు చేసుకుని మంజూరు కావాలంటే ఉత్తర(రెకమెండేషన్ లెటర్), దక్షిణాలు (మామూళ్లు) సమర్పించుకున్నా నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి. అయినా పథకాలు అందాయా అంటే అదీ లేదు. నేడు ఆత్మస్థ్యైర్యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దివ్యాంగుల్లో ఆత్మస్థ్యైర్యం పెంపొందించేలా గతంలో 3 శాతంగా ఉన్న రిజర్వేషన్ను 4 శాతానికి పెంచారు. గతంలో బస్పాసుల కాల పరిమితి ఏడాది కాగా మూడేళ్లకు పెంచారు. జగనన్న హౌసింగ్ స్కీమ్లో దివ్యాంగులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. క్రమం తప్పకుండా సదరం క్యాంపులు నిర్వహిస్తూ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారు. దివ్యాంగుల కోరిక మేరకు పర్సంటేజీని బట్టి పింఛను ఇచ్చే విధానాన్ని రద్దు చేశారు. పక్షవాతం ఉన్న దివ్యాంగులకు రూ.5 వేలు, పూర్తిగా మంచానికే పరిమితమైన దివ్యాంగులకు 10 వేలు పింఛను అందించడంతో వారికి ఆర్థిక భరోసా దక్కినట్టయింది. జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మూడు చక్రాల వాహనాలు, ఇతర ఉపకరణాలు అందజేశారు. జిల్లాలో 32 దివ్యాంగ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయడంతోపాటు అర్హులైన వారికి సబ్సిడీపై రుణాలు మంజూరు చేసి జీవితంలో నిలదొక్కుకునేలా చేశారు. పింఛను పెంపుతో సంతోషం జిల్లాలో 36,310 మంది దివ్యాంగులకు వివిధ రకాల పింఛన్లు అందిస్తున్నారు. వీరిలో రూ.3 వేలు పింఛను తీసుకుంటున్న దివ్యాంగులు 33,205 మంది, రూ.5 వేలు పింఛను తీసుకుంటున్న దివ్యాంగులు (డీఎంహెచ్ఓ పరిధి) 2,540 మంది, రూ.10 వేలు పింఛను తీసుకుంటున్న దివ్యాంగులు 565 మంది ఉన్నారు. సీఎం వైఎస్ జగన్ పింఛను పెంచడంపై దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.దివ్యాంగులకు అన్ని విధాలాదివ్యాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందించిన సహకారం మర్చిపోలేం. రిజర్వేషన్ను 3 నుంచి 4 శాతానికి పెంచడంతోపాటు ఉపకరణాలు కూడా అందించారు. పింఛను నగదు, బస్పాసుల కాలపరిమితి పెంచారు. దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే మ్యారేజ్ ఇన్సెంటివ్ అవార్డు కింద గతంలో ఇస్తున్న రూ.లక్షను రూ.1.50 లక్షలకు పెంచారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే పింఛను నగదును రూ.3 వేలు చేశారు. ఇలా అన్ని విధాలుగా దివ్యాంగులకు మేలు చేకూరింది. – డి.గోపాల్రెడ్డి, వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు, మార్కాపురం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement