-
కర్నూలు.. ఫ్యాన్ జోరు!
సాక్షి ప్రతినిధి కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో సార్వత్రిక పోరు ఏకపక్షంగా కానుందా? 2019 ఫలితాలే పునరావృతం కాను న్నాయా? 2 ఎంపీలతో పాటు 14 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ క్లీన్స్వీప్ చేయనుందా? అంటే జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, పారీ్టల బలాబలాలు విశ్లేíÙస్తే అవుననే తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పట్ల ప్రజల్లో విశ్వసనీయత, ఇటీవల సీఎం జగన్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టడం, ఆచరణ సాధ్యమయ్యే హామీలతో విడుదల చేసిన మేనిఫెస్టోకు ప్రజల మద్దతు రావడం వంటి అంశాలతో వైఎస్సార్సీపీ జోష్లో ఉంటే, చంద్రబాబు సభలకు సరైన స్పందన లేకపోవడం, చాలా నియోజకవర్గాల్లో నాయకత్వలేమి, వర్గ విభేదాలతో టీడీపీ ఈ దఫా కూడా బోణీ కొట్టడం కష్టమేననే భావన విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి అత్యంత బలంగా ఉంది. ఈ ఐదేళ్లలో ప్రతి ఇంటికీ చేయని సంక్షేమ ఫలాలు అందాయి. ప్రతీ గ్రా మంలో అభివృద్ధి జరిగింది. దీనికి తోడు తమ నాయకు డిని మరోసారి సీఎంగా చూడాలనే ఆ కాంక్ష ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది.కర్నూలులో గెలుపు గ్యారంటీ..రాష్ట్రంలోనే మైనార్టీ ఓట్లు అత్యధికంగా (1.15లక్షలు) ఉండే నియోజకవర్గం కర్నూలు. ఇక్కడ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ను వైఎస్సార్సీపీ బరిలోకి దింపింది.ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డితో పాటు పార్టీ మొత్తం ఇంతియాజ్ గెలుపు కోసం పని చేస్తోంది. మైనారీ్టలంతా వైఎస్సార్సీపీ వైపు నిలబడ్డారు. మరోవైపు టీజీ వెంకటేశ్ బీజేపీలో, భరత్ టీడీపీలో కొనసాగుతూ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. రాజకీయాన్ని కూడా ‘బిజినెస్’గా చూసే టీజీ కుటుంబాన్ని గత రెండు దఫాలు ప్రజలు ఓడించారు. మైనార్టీ ఓట్లు దూరమవుతాయనే భావనతో బీజేపీని టీజీ భరత్ దగ్గరకు రానీయడం లేదు. దీంతో బీజేపీ నేతలు కూడా టీజీపై గుర్రుగా ఉన్నారు. కోడుమూరులో సునాయాసమే..కోడుమూరు(ఎస్సీ) టీడీపీలో గ్రూపు తగాదాలతో ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశం ఉంది. తనకు కాకుండా బొగ్గుల దస్తగిరికి టికెట్ ఇచ్చారని ఇన్చార్జ్ ఆకేపోగు ప్రభాకర్ ఏకంగా ఆత్మహత్యకు యత్నించారు. తన ప్రమేయం లేకుండా ఎదురూరు విష్ణువర్ధన్రెడ్డి సూచించిన అభ్యరి్థకి టికెట్ ఇవ్వడంతో కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి వర్గం దస్తగిరికి సహకరించడం లేదు. ఇటీవల సయోధ్య కుదిరినట్లు చెబుతున్నా సహకారం లేదు. మరోవైపు కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్రెడ్డి ఇటీవలే వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో వైఎస్సార్సీపీ బలం మరింత పెరిగింది.ఈ దఫా కూడా వైఎస్సార్సీపీకే అనుకూలంగా ఉంది. ‘ఆలూరు’లో పెరిగిన వైఎస్సార్సీపీ బలంఆలూరులో చిప్పగిరి జెడ్పీటీసీ వాలీ్మకి నేత విరూపాక్షి వైఎస్సార్సీపీ తరపున బరిలో ఉన్నారు. ఐదేళ్లు మంత్రి పదవి అనుభవించి పార్టీని వీడి వెళ్లిపోయిన గుమ్మనూరు జయరాం సిఫార్సుతో ఇక్కడ వీరభద్రగౌడ్కు టికెట్ ఇచ్చింది. దీంతో ఇక్కడ వాలీ్మకులంతా ఏకమయ్యారు. దీనికి తోడు టీడీపీ నుంచి వైకుంఠం మల్లిఖార్జున చౌదరి, మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, కురబ వర్గానికి చెందిన శశికళ వైఎస్సార్సీపీలో చేరారు. కోట్ల హరిచక్రపాణిరెడ్డి కోడుమూరుతో పాటు ఆలూరుపై పట్టున్న నాయకుడు. ఇక్కడ కురబ, బోయ వర్గాలు వైఎస్సార్సీపీతోనే ఉన్నాయి. దీంతో కచి్చతంగా గెలుస్తామనే భావనలో వైఎస్సార్సీపీ ఉంది. శ్రీశైలంలో శివతాండవమే..శ్రీశైలంలో శిల్పా చక్రపాణిరెడ్డి వైఎస్సార్సీపీ తరఫున బరిలో ఉన్నారు. నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు. టీడీపీ నేత బుడ్డా రాజశేఖరరెడ్డి నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాల్లో ఉంటున్నారు. ఓటమి భయంతోనే బుడ్డా ఇలా వ్యవహరిస్తున్నారనే చర్చ నడుస్తోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచి, టీడీపీలోకి వెళ్లి ప్రజల్లో బుడ్డా విశ్వసనీయత కోల్పోయారు. దీంతో టీడీపీ నేతలు కూడా ఇతని కోసం గట్టిగా పని చేసే పరిస్థితులు లేవు. ఏరాసు ప్రతాప్రెడ్డి కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. ‘పోచా’దే నంద్యాల!నంద్యాల ఎంపీ అభ్యరి్థగా పోచా బ్రహ్మానందరెడ్డి బరిలో ఉన్నారు. సిట్టింగ్ ఎంపీ. ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడటంతో పాటు ఇటు పార్టీ నేతలతో అటు పార్లమెంట్ పరిధిలోని ప్రజలతో మంచిగా ఉన్నారు. మరోవైపు టీడీపీ వేండ్ర శివానందరెడ్డిని కాదని, చివరి నిమిషంలో బీజేపీ నేత బైరెడ్డి శబరికి ‘పచ్చ కండువా వేయించి ఎంపీగా పోటీ చేయిస్తోంది. బైరెడ్డి రాజశేఖరరెడ్డి 2014లోనే ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. పైగా బైరెడ్డిని టీడీపీ నేతలే స్వాగతించడం లేదు. పార్లమెంట్లోని అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ హవానే ఉంది. అసెంబ్లీలు స్వీప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నంద్యాల మరోసారి పోచా వశం కానుంది. పత్తికొండలో టీడీపీ పరాభవం తథ్యం!పత్తికొండలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి నిత్యం జనంతో మమేకం అవుతున్నారు. మరోవైపు మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు ఐదేళ్లపాటు పారీ్టకి అందుబాటులో లేరు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కూడా వీరికి దూరంగా ఉన్నారు. ఇక్కడ టీడీపీ గెలుపు అవకాశాలు స్వల్పమే.ఎమ్మిగనూరు.. ఏకపక్షం!ఎమ్మిగనూరులో చేనేత వర్గానికి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుక వైఎస్సార్సీపీ తరఫున బరిలో ఉన్నారు. బీసీలకు టికెట్ ఇవ్వాలని సీనియర్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని పక్కనపెట్టారు. దీంతో ఇక్కడ చేనేతలు, బీసీలు రేణుక కోసం ఏకమయ్యారు. చెన్నకేశవరెడ్డి కూడా రేణుక గెలుపు కోసం శ్రమిస్తున్నారు. మరోవైపు జయనాగేశ్వరరెడ్డికి కోట్ల వర్గం నుంచి కూడా మద్దతు లేదు. ఇక్కడ కూడా ‘బుట్టా’కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.మంత్రాలయం, ఆదోనిలో మురిపిస్తున్న ఫ్యాన్..మంత్రాలయం నియోజకవర్గ ఆవిర్భావం నుంచి బాలనాగిరెడ్డికి ఓటమి లేదు. నిత్యం ప్రజల్లో ఉండే రాజకీయనేత. మరోవైపు తిక్కారెడ్డిని కాదని, బోయ వర్గానికి చెందిన రాఘవేంద్రకు టీడీపీ టికెట్ ఇచి్చంది. దీనిపై తిక్కారెడ్డి ప్రత్యక్షంగా నిరసన చేశారు. దీంతో జిల్లా అధ్యక్షపదవి ఇతనికి కట్టబెట్టింది. అయినా రాఘవేంద్రకు సహకరించడం లేదు. మరోవైపు తన అధ్యక్ష పదవిని తీయడంపై బీటీ నాయుడు గుర్రుగా ఉన్నారు. ఆదోనిలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న మీనాక్షి నాయుడును కాదని పొత్తులో భాగంగా బీజేపీకి టికెట్ ఇచ్చారు. ఇక్కడ టీడీపీ, బీజేపీ రెండూ బలహీనంగా ఉన్నాయి. దీంతో బీజేపీ కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితి.గెలుపు బాటలో ‘రామయ్య’ కర్నూలు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థిగా బీవై రామయ్య పోటీ చేస్తున్నారు. పేద వ్యక్తి. పార్లమెంట్లో బలమైన ‘వాల్మీకి’ వర్గానికి చెందిన నేత. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పని చేసిన అనుభవంతో పార్లమెంట్లో విస్తృత పరిచయాలున్నాయి. రామయ్య తెలియని వ్యక్తి లేరు. అజాత శత్రువైన రామయ్యకు ‘వాలీ్మకుల’తో పాటు అన్ని వర్గాల నుంచి మద్దతు ఉంది. 7 అసెంబ్లీలలో ‘ఫ్యాన్’ గాలి వీస్తోంది. మరోవైపు టీడీపీకి అభ్యర్థులు లేక పంచలింగాల నాగరాజు అనే రియల్టర్ను చివరి నిమిషంలో తీసుకొచ్చారు. ఆయనెవరో కూడా జిల్లా ప్రజలకు తెలీదు. వైఎస్సార్సీపీ పార్లమెంట్లో అత్యంత బలంగా ఉండటం, బలమైన సామాజిక వర్గం, మంచితనం వెరసి రామయ్య గెలుపు నల్లేరుపై నడకే అనే చర్చ సర్వత్రా నడుస్తోంది.డోన్, పాణ్యంలో దూకుడు!డోన్లో టీడీపీ అభ్యర్థిగా ధర్మవరం సుబ్బారెడ్డిని చంద్రబాబు రెండేళ్ల కిందటే ప్రకటించారు. అయితే సుబ్బారెడ్డి ఓడిపోతాడని సర్వేలో తేలడంతో కోట్ల సూర్యప్రకాశ్రెడ్డిని బరిలోకి దించారు. యూరోపియన్ మోడల్ విద్యాసంస్థలతో పాటు అన్ని రకాలుగా మంత్రి బుగ్గన డోన్ను అభివృద్ధి చేశారు. 2009 ఓటమి తర్వాత కోట్ల కుటుంబం డోన్ను వదిలేసింది. ఇప్పుడు ప్రకాశ్రెడ్డిని పంపింది. ఇష్టం లేకపోయినా డోన్కు వెళుతున్నారని ప్రకాశ్రెడ్డి కోడుమూరు కార్యకర్తల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక్కడ బుగ్గన గెలుపు లాంఛనమే అని విశ్లేషకులు చెబుతున్నారు. పాణ్యంలో కాటసాని రాంభూపాల్రెడ్డి వైఎస్సార్సీపీ తరఫున, గౌరు చరిత టీడీపీ అభ్యరి్థగా బరిలోకి దిగుతున్నారు. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే కాటసాని. నిత్యం ప్రజల్లో ఉంటారు. బైరెడ్డి, గౌరు ఏకం కావడం గౌరు వర్గీయులు కూడా జీరి్ణంచుకోలేకపోతున్నారు. ఇక్కడ ఈ దఫా కూడా కాటసానికే అనుకూలంగా ఉంది. నంద్యాలలో గెలుపు నల్లేరుపై నడకే..నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి సౌమ్యుడు. రవితోపాటు ఆయన తండ్రి ఎప్పుడూ ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదు. ఎవరు వెళ్లినా స్పందించే గుణం వారి సొంతం. మరో వైపు భూమా బ్రహ్మానందరెడ్డిని కాదని ఫరూక్కు టీడీపీ టికెట్ ఇచి్చంది. దీంతో బ్రహ్మం పూర్తి దూరంగా ఉన్నారు. నంద్యాలపై పట్టున్న అఖిలప్రియ కూడా ఫరూక్కు సహకరించలేదు. ఈ దఫా ఫరూక్ ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ తన తమ్ముడు జగత్ విఖ్యాత్కు ఇప్పించాలనేది అఖిల వ్యూహం. దీంతో వర్గవిభేదాలతో టీడీపీ నలిగిపోతోంది. బనగానపల్లిలో బోనస్ మార్కులే..బనగానపల్లిలో కాటసాని రామిరెడ్డి బలంగా ఉన్నారు. ఇక్క డ టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్రెడ్డి నియోజకవర్గం కంటే హైదరాబాద్లో ఎక్కువగా ఉంటారు. దీనికి తోడు డోన్, నంద్యాలలో తన వర్గానికి టికెట్లు ఇప్పించుకునే క్రమంలో కోట్ల, భూమాకు ప్రత్య ర్థిగా మారారు. ఈ ఎన్నికల్లో వీరు ఇతని ఓటమి కోసం పని చేసే అవకాశం ఉంది. బీసీపై భూమా బ్రహా్మనందరెడ్డి ఏకంగా చంద్రబాబుకే ఫిర్యాదు చేశారు. ఇక్కడ కాటసానికి గెలుపు అవకాశాలు ఎక్కువ. నందికొట్కూరులో తిరుగులేని ఫ్యాన్!నందికొట్కూరులో వైఎస్సార్సీపీ తరఫున సు«దీర్ పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం బైరెడ్డి సిద్ధార్థ్రెడ్డి శ్రమిస్తున్నారు. టీడీపీ తరఫున గిత్తా జయసూర్య పోటీ చేస్తున్నారు. ఇక్కడ మాండ్రను కాదని నంద్యాల ఎంపీ బైరెడ్డి రాజశేఖరరెడ్డి కుమారై శబరికి ఇచ్చారు. మాండ్ర హైదరాబాద్లో ఉంటున్నారు. దీంతో జయసూర్య ఒంటరైపోయాడు. దశాబ్దాలుగా ఫ్యాక్షన్ నడిపిన గౌరు, బైరెడ్డి వర్గాలు ఏకం కావడం కూడా నందికొట్కూరులో జీరి్ణంచుకోలేని అంశం. దీంతో అంతా వైఎస్సార్సీపీ వైపు నిలబడ్డారు. ఆళ్లగడ్డలో అఖిలకు ఎదురుగాలి..ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ తరచూ వివాదాలలో చిక్కు కుంటోంది. కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా దూరమయ్యారు. ‘భూమా’ ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి అఖిల ఓటమే లక్ష్యంగా పని చేస్తున్నారు. గంగుల బ్రిజేంద్రారెడ్డి, గంగుల ప్రభా కర్ రెడ్డి ఇద్దరూ ఆళ్లగడ్డలో ‘ఫ్యాక్షన్ ’ వాతావరణాన్ని తీసేసి ప్ర శాంతంగా మార్చారు. ఇదే వీరికి ఈ ఎన్నికల్లో బలంగా మారింది. -
బీసీ స్వగ్రామంలోనే టీడీపీకి షాక్
బనగానపల్లె రూరల్: బనగానపల్లె నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్రెడ్డి సొంత గ్రామమైన యనకండ్ల గ్రామానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీతో పాటు అన్నివర్గాలకు చెందిన 400 కుటుంబాలు ఆదివారం టీడీపీ వీడీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కాటసాని పార్టీ కండువావేసి సాదరంగా వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యనకండ్ల గ్రామంలో జరిగిన అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలతో పాటు మరింత అభివృద్ధి జరగాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి తనను ఫ్యాన్కు గుర్తుకు ఓటువేసి, వేయించి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అభ్యర్థించారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు కోడూరు రామచంద్రారెడ్డి ,బీసీ మహేశ్వరరెడ్డి, బొబ్బల మద్దిలేటి, పాపసాని గోపాల్రెడ్డి, బి మధుసూదన్రెడ్డి, వడ్డె సుబ్బారాయుడు, సంజీవగౌడ్, సాంబశివారెడ్డి, బాలీశ్వరరెడ్డి, మోహన్రెడ్డి, మల్లేశ్వరరెడ్డి, మధన్మోహన్రెడ్డి, కోటేశ్వరరెడ్డి, గొల్లబ్రహ్మం, సుబ్రమణ్యం, నాగశేషుడు మరికొందరు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. 400 కుటుంబాలు టీడీపీ వీడీ వైఎస్సార్సీపీలో చేరిక -
చంద్రబాబు కేరాఫ్ కరువు
● వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య మంత్రాలయం/పెద్దకడబూరు: చంద్రబాబు కేరాఫ్ కరవు కాగా.. వెన్నుపోటు పొడవడంలో ఆయనకు సాటెవ్వరూ లేరని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డితో కలిసి పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం, కల్లుకుంట, పెద్దకడబూరు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు వస్తే కరువు తప్ప ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. ఏనాడూ ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేసిన వ్యక్తి కాదన్నారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఏ గొప్ప పథకం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనలో ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104 అంబులెన్స్, జలయజ్ఞం తదితర పథకాలు గుర్తు వస్తాయన్నారు. అలాగే సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, విద్యా కానుక, విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన, వసతి దీవెన, రైతు భరోసా, సచివాలయం వ్యవస్థ ఇలా నవరత్నాల పథకాలు చరిత్రలో నిలిపోయేలా ఉన్నాయని కొనియాడారు. ఇలాంటి పథకాలు చంద్రబాబులో చరిత్రలోనే లేవని, పబ్బం గడుపుకోవడానికి లేనిపోని హామీలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలకు మేలు జరిగి ఉంటేనే ఓటు వేయమని అడిగే దమ్ము ఒక్క జగనన్నకే ఉందన్నారు. టీడీపీ ఓడిపోవడం ఖాయమన్నారు. ఆయనతోపాటు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్రెడ్డి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ చంద్రశేఖర్రెడ్డి పాల్గొన్నారు. -
మళ్లీ వచ్చేది ప్రజా ప్రభుత్వమే!
బేతంచెర్ల: నెల రోజుల్లో ప్రజలందరీ ఆశీర్వాదంతో మళ్లీ వచ్చేది ప్రజా ప్రభుత్వమేనని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని పాపసాని కొట్టాల, తవిసి కొండ, హుసేనాపురం, గూటుపల్లె గ్రామాల్లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో బుగ్గనకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లో బుగ్గన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదలను రైతులగా మార్చిందన్నారు. గూటుపల్లె గ్రామంలో 300 మంది రైతులకు 500 ఎకరాల ప్రభుత్వ భూమి పంచడం జరిగిందన్నారు. డీ పట్టా భూములపై సర్వ హక్కులు కల్పించి 150 మంది రైతులకు మరో 200 ఎకరాలు పంపిణీ చేశామన్నారు. వక్ఫ్ భూములలో ఉండి పోయి 1738 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయలేని విధంగా మిగిలిపోతే వాటిని కూడా కన్వర్షన్ చేయించే ప్రతి పాదనలను కలెక్టర్ ద్వారా వక్ఫ్ బోర్బు సీఈఓకు పంపినట్లు పేర్కొన్నారు. చెప్పిన్నవన్ని చేసే వారికి, చెప్పిందేది చేయని చంద్రబాబుకు మే 13వ తేదీన ఎన్నికల జరగనున్నాయన్నారు. ప్రజలకు వెన్నుపోటు పొడిచి పార్టీలు ఫిరాయించిన నాయకులను నమ్మొద్దన్నారు. మాజీ ఎంపీపీ సోమశేఖర్ రెడ్డి ఎంపీపీ పదవిని స్వలాభం కోసం మినహా ఏనాడు ప్రజల సాయం కోసం ఉపయోగించలేదన్నారు. రూ. 50 కోట్లతో మద్దిలేటి స్వామి ఆలయ స్వరూపాని మార్చడం అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. వేల కుటుంబాలకు కుల దైవమైన పాలుట్ల రంగస్వామి ఆలయం అభివృద్ధి ప్రతి ప్రక్షాలకు కనపడలేదాన్నారు. బేతంచెర్లలో 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రంగా చేసుకోవడం అభివృద్ధి కాదా అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కోసం వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఆశీర్వదించి, ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా పోచా బ్రహ్మనంద రెడ్డిని గెలిపించాలని మంత్రి బుగ్గన అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బుగ్గన నాగభూషణం రెడ్డి, గిడ్డంగుల శాఖ డైరక్టర్ బాబుల్ రెడ్డి, గ్రామాల సర్పంచ్లు శ్రీరాములు, లక్ష్మీదేవి, వేణుగోపాల్ రెడ్డి, వైస్ ఎంపీపీ రంగస్వామి, నాయకులు బుగ్గన చంద్రారెడ్డి, నాగేశ్వర్రెడ్డి, వెంకట స్వామి, పెద్ద రంగప్పగారి రంగస్వామి, శ్రీను, నాగేశ్వరరావు, బరగోడ్ల రంగస్వామి, రాజశేఖర్, మిద్దె శ్రీను, బండి కాటి వెంకటేశ్వర్రెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, శ్రీనాథ్రెడ్డి,తిరుమలేశ్వర్రెడ్డి, తిమ్మయ్య పాల్గొన్నారు. డీ పట్టా భూములపై పేదలకు సర్వహక్కులు మద్దిలేటయ్య క్షేత్రాభివృద్ధి ప్రతిపక్షాలకు ఎందుకు కనిపించదు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి -
మాటిచ్చాడంటే.. చేస్తాడంతే
బొమ్మలసత్రం: ఏదైనా చేస్తానని మాట ఇచ్చాడంటే చేసి చూపించే నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పారవి చంద్రకిషోర్రెడ్డి అన్నారు. పట్టణంలోని 18వ వార్డులో ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ దేశం సులోచన, దేశం సుధాకర్రెడ్డితో కలిసి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఎంపీ, ఎమ్యెల్యే అభ్యర్థులకు స్థానికులు గజమాలలు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా శిల్పా రవి మాట్లాడుతూ..2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేసి చూపించారని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఓటు అడుగుతున్న దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పారు. ప్రజలకు మరింత మేలు చేసేందుకు ఈ ఎన్నికల్లో నవరత్నాల ప్లస్తో ముందుకు వస్తున్నారని.. ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. టీడీపీ నాయకుల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. 2014లో వారిచ్చిన హామీలు.. ఆ తర్వాత ఏ విధంగా మోసం చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ 21 ఏళ్లు అధికారంలో ఉన్నా నంద్యాలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. ఆ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చినా.. కుట్రలు చేసినా గెలిచేది వైఎస్సార్సీపీనే అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, నాయకులు మధుసుదన్రెడ్డి, గోవిందరెడ్డి, నారాయణరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, గోపాల్రెడ్డి, ప్రసాద్రెడ్డి, అజయ్ నాయుడు, రవికుమార్రెడ్డి, సోమశేఖర్ పాల్గొన్నారు. విశ్వసనీయతకు మారుపేరు వైఎస్ జగన్ నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement