-
నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేస్తారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోని రాజానగరం నియోజకవర్గంలో ఉన్న కోరుకొండ జంక్షన్లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం లోక్సభ స్థానం పరిధిలోని ఇచ్ఛాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విశాఖపట్నం లోక్సభ పరిధిలో గాజువాక నియోజకవర్గంలో ఉన్న పాత గాజువాక సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. -
తూర్పు గడ్డపై ఫ్యాన్ హోరు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఫ్యాన్ జోరుగా తిరుగుతోంది. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తూర్పు గడ్డపై వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించనుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ జిల్లాలో బలంగా ఉందనుకున్న జనసేనపై నమ్మకం సడలి ఆ పార్టీ నేతలు జారుకోవడం, టీడీపీ ఆదరణ కోల్పోవడం తదితర పరిణామాలతో వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది.పోలింగ్ సమయం దగ్గర పడుతున్నకొద్దీ పార్టీ గెలుపు దిశగా పరుగులు తీస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి తూర్పులో 19 అసెంబ్లీ స్థానాల్లో 15 వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు అన్ని స్థానాల్లోనూ క్లీన్స్వీప్ చేయడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.కన్నబాబు కన్నుల్లో ఆనందమే రెండుసార్లు ఎమ్మెల్యేగా, వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి అభివృద్ధితో తనదైన ముద్ర వేసుకున్న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబు గెలుపు నల్లేరుపై నడకే. వివాదరహితుడు, అందరితో కలిసిపోయేతత్వం ఈయనకు సానుకూల అంశాలు. ఆయన స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసినప్పుడు 40 వేల ఓట్లు పైచిలుకు సాధించిన రికార్డు ఉంది. జనసేన నుంచి పంతం వెంకటేశ్వరరావుపై పలు స్టేషన్లలో 19 కేసులున్నాయి. దీంతో ఆయనకు అన్ని వర్గాల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. ప్రత్తిపాడులో ఫ్యాన్ పవర్ ప్రత్తిపాడులో ఈసారి ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావు, టీడీపీ అభ్యర్థిగా వరుపుల సత్యప్రభ నిలిచారు. వీరిద్దరూ వరుసకు తాత, మనవరాలు. సీనియర్ నాయకుడు కావడం, వివాదరహితుడనే పేరు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సుబ్బారావుకు కలిసి వచ్చే అంశాలు. వయస్సుతో నిమిత్తం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉండటం సుబ్బారావుకు ప్లస్ పాయింట్. ఈ ఎన్నికల్లోనే తొలిసారి బరిలో నిలిచిన సత్యప్రభకు రాజకీయాలు కొత్త. పారీ్టలో తన భర్త దివంగత రాజాతో విభేదాలున్న వర్గం సత్యప్రభకు వ్యతిరేకంగా పనిచేస్తుండటం ప్రతికూలాంశం.కాకినాడ మరోసారి కేకకాకినాడ సిటీ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి హ్యాట్రిక్ విజయం దిశగా పయనిçస్తున్నారు. విద్యార్థి దశ నుంచి కాకినాడలో దాదాపు అన్ని వర్గాల సాన్నిహిత్యంతో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్మార్ట్ సిటీ నిధులతో సుందర నగరంగా తీర్చిదిద్దడం, ఎన్నికల మేనేజ్మెంట్లో నైపుణ్యం, ముక్కుసూటితనం ద్వారంపూడికి మూడోసారి గెలుపునకు సానుకూల పవనాలు వీస్తున్నాయి. ద్వారంపూడికి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు సొంత సామాజికవర్గం నుంచి వ్యతిరేకత, టీడీపీలో గ్రూపుల గోలతో ఎదురీదుతున్నారు. ‘తోట’కే విజయ ఫలంపూర్తిగా మెట్ట ప్రాంతం జగ్గంపేట. రెండు కుటుంబాల మధ్య హోరాహోరీ పోరుకు తెరలేచింది ఇక్కడ. వైఎస్సార్సీపీ నుంచి మాజీ మంత్రి తోట నరసింహం, ప్రత్యరి్థగా టీడీపీ నుంచి జ్యోతుల నెహ్రూ పోటీ చేస్తున్నారు. వీరిద్దరు 2004, 2009 ఎన్నికల్లో జగ్గంపేటలో పాత ప్రత్యర్థులే. ఈ రెండుసార్లు కూడా తోటదే గెలుపు. మూడోసారి మళ్లీ తలపడుతున్నారు. మహానేత వైఎస్ కేబినెట్లో మంత్రిగా తోట చేపట్టిన అభివృద్ధి, గడచిన ఐదేళ్లలో చేపట్టిన పనులు నరసింహంకు సానుకూలత ఏర్పడింది. టీడీపీ అభ్యర్థి నెహ్రూకు పారీ్టలోని వ్యతిరేక వర్గంతోపాటు జనసేన రెబల్గా బరిలో ఉన్న పాటంశెట్టి సూర్యచంద్రరావు తోడుకావడం మైనస్.జగ్గిరెడ్డిని ఆపతరమా..? కొత్తపేటలో పాత ప్రత్యర్థుల మధ్యనే మరో సారి పోరు సాగుతోంది. వైఎస్సార్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ప్రత్యరి్థగా టీడీపీ నుంచి బండారు సత్యానందరావు బరిలోకి దిగారు. 2004 నుంచి వరుసగా అన్ని ఎన్నికల్లోను వీరిద్దరే ప్రత్యర్థులు. 2009లో తప్ప మిగిలిన అన్నిసార్లూ చిర్లదే గెలుపు. జగ్గిరెడ్డి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు సానుకూలమైన వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. గడచిన ఐదేళ్లుగా చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో చిర్ల గెలుపు వాకిట ముందున్నారు. టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావుకు పొత్తుతోనే చిత్త య్యే వాతావరణం కనిపిస్తోంది. పిఠాపురంలో పవన్కు భంగపాటే... అపజయం ఎరుగని రాజకీయ నాయకురాలిగా పేరున్న సిట్టింగ్ కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనా«థ్ పిఠాపురం బరిలో నిలిచారు. 2009లో తొలిసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గీత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉన్న ఏకైక మహిళా నాయకురాలిగా పేరుంది. నియోజకవర్గంలో ఎవరినైనా పేరు పెట్టి పిలవగలిగేటంతటి పరిచయాలున్న గీతతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీపడుతున్నారు. తనకున్న పరిచయాలు, కలుపుగోలుతనం, జడ్పీ చైర్పర్సన్, ఎంపీ, రాజ్యసభ సభ్యురాలు, ఎమ్మెల్యేగా విశేషమైన అనుభవంతో పిఠాపురంలో పవన్కు చుక్కలు చూపిస్తూ గెలుపు దిశగా అడుగులేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎన్నికలప్పుడు కనిపించి తరువాత ముఖం చాటేస్తారనే భయం ఉంది. ‘పెద్ద’రికానికి బ్రేకు తప్పదు పెద్దాపురం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి దవులూరి దొరబాబు టీడీపీ వరుస విజయానికి బ్రేక్ వేసే వైపు అడుగులేస్తున్నారు. గడచిన ఐదేళ్లుగా నియోజకవర్గంలో పల్లెపల్లెనా తిరుగుతూ వారి సమస్యల పరిష్కారానికి దొరబాబు చేసిన కృషి విజయం వైపు నడిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పకు ఈసారి ఆశాభంగం తప్పదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నియోజకవర్గ చరిత్ర తిరగేసి చూస్తే పెద్దాపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన దాఖలాలు లేవు. ఇక్కడి నుంచి రెండుసార్లు వరుసగా ఎమ్మెల్యే అయిన చినరాజప్ప ఈ సారి తప్పకుండా ఓటమి చవిచూస్తారని అంటున్నారు. తునిలో టీడీపీ తూర్పుకు దండమే తూర్పు సెంటిమెంట్ నియోజకవర్గం తుని. రెండు, మూడు సందర్భాలు మినహాయిస్తే ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పారీ్టనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్ ఉంది. మూడోసారి గెలుపుతో హ్యాట్రిక్ కొట్టాలని వైఎస్సార్సీపీ అభ్యరి్థ, సిట్టింగ్ మంత్రి దాడిశెట్టి రాజా ధీమాగా ఉన్నారు. చేపట్టిన అభివృద్ధి, సాయం అర్థించి వస్తే కాదనలేని మనస్తత్వం రాజాను గెలిపిస్తుంది. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో కుమార్తె దివ్యను బరిలోకి దింపినా ఎదురీదక తప్పడం లేదు. రామకృష్ణుడు మోసానికి గురైన తమ్ముడు కృష్ణుడు టీడీపీకి గుడ్బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరడంతో గెలుపు మరింత సులువైంది. కమలానికి కంటి తడి తప్పదు రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్సీపీ అభ్యరి్థగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ బరిలోకి దిగగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి పోటీపడుతున్నారు. చేయి తిరిగిన వైద్యుడిగా పేరొందిన శ్రీనివాస్ను బలహీనవర్గాల కోటాలో ఈ స్థానాన్ని కట్టబెట్టడంతో బీసీలతో పాటు ఇతర సామాజికవర్గాల మద్ధతుతో సానుకూల పవనాలు వీస్తున్నాయి.స్థానికులను కాదని పురందరేశ్వరికి బీజేపీ సీటు కేటాయించడంతో కమళనాథుల కుమ్ములాటలతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. దిగుమతి చేసుకునే నేతలకు పట్టంకడితే పరిస్థితి ఎలా ఉంటుందనేది గతంలో సినీ నటుడు మురళీమోహన్ విషయంలో చూసిన ఈ ప్రాంత జనం పురందరేశ్వరి అభ్యరి్థత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.‘బుచ్చిబాబు’ను వెంటాడుతున్న పాపాలు ముమ్మిడివరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు ఎదురీదుతున్నారు. గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు అతని అనుచరగణం సాగించిన అరాచకాలు, సెటిల్మెంట్లు ఈ ఎన్నికల్లో వెంటాడుతున్నాయి. నాడు చేసిన తప్పులు ఇప్పుడు కొద్దోగొప్పో బాగుందనుకుంటున్న పార్టీకి మైనస్గా మారాయి. సమస్యల పరిష్కారంలో సామాజికంగా కొన్ని పక్షాలను దూరం పెట్టిన ప్రభావం ఇప్పుడు వ్యతిరేకతగా మారి ఓటమి అంచులకు చేరుస్తోందని ఆ వర్గాలే భావిస్తున్నాయి. వైఎస్సార్సీపీ అభ్యరి్థ, సిట్టింగ్ ఎమ్మెల్యే పొన్నాడ సతీ‹Ùకుమార్కు బలమైన రెండు సామాజికవర్గాల మద్దతుతో ఈసారి కూడా గెలుపు సునాయసమేనని విశ్లేíÙస్తున్నారు. సునీల్..గెలుపు జిగేల్ కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ, జనసేన పార్టీల మధ్య పోటీ నెలకొంది.వైఎస్సార్సీపీ నుంచి బరిలో నిలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్తో జనసేన అభ్యర్థి టీటైమ్ అధినేత తంగెళ్ల ఉదయశ్రీనివాస్ పోటీపడుతున్నారు. సునీల్కు మెట్ట ప్రాంత మండలాల్లో పారీ్టరహితంగా నేతలతో ఉన్న బంధుత్వాలు, పరిచయాలు కలిసి వస్తున్నాయి. సునీల్తో పోటీపడుతోన్న జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్ స్థానికేతరుడు, కనీస పరిచయాలు లేకపోవడం ప్రతికూలతగా మారింది. మిత్రపక్షం టీడీసీలో అంతర్గత కుమ్ములాటలు, వారి నుంచి ఎదురవుతోన్న సహాయనిరాకరణతో ఎదురీదుతున్నారు. గొల్లపల్లి గుప్పెట్లో రాజోలు ఎమ్మెల్యే, మంత్రిగా రాజకీయాల్లో అపారమైన అనుభవం, ఈ ప్రాంతంలో విస్తృతమైన పరిచయాలు, రాజోలులో వైఎస్సార్సీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు విజయావకాశాలకు ఢోకా లేకుండాపోతోంది. గతంలో గొల్లపల్లి చేసిన అభివృద్ధి, గడచిన ఐదేళ్లలో చేపట్టిన పనులు, వందేళ్లుగా జరగని సఖినేటిపల్లి– నర్సాపూర్ వంతెన నిర్మాణం కోసం రూ.580 కోట్లు కేటాయింపు సానుకూల అంశాలై గెలుపు ఖాయమంటున్నారు. ఇక్కడి నుంచి ప్రత్యర్థిగా పోటీచేస్తున్న జనసేన అభ్యర్థి దేవ వర ప్రసాద్ ఈ ప్రాంతంతో పరిచయం లేకపోవడంలో ఓటమి ఖరారుగా కనిపిస్తోంది. అనపర్తి సత్తికి కంచుకోట అనపర్తి నియోజకవర్గం వైఎస్సార్సీపీ కంచుకోటగా మరోసారి నిలుస్తోంది. వైఎస్సార్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, టీడీపీ నుంచి బీజేపీ టికెట్పై పోటీ చేస్తున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ పడుతున్నారు. ప్రభుత్వం అందించిన సుపరిపాలన, సంక్షేమ పాలనకుతోడు అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన అందించిన సత్తికి గెలుపు సునాయాసమేనంటున్నారు. ఓటమి ఖాయమనే సర్వే నివేదికలతో వెనక్కు తగ్గిన టీడీపీ, బీజేపీని బరిలోకి దింపింది. టీడీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి పంపించి పోటీకి పెట్టింది. ఈ పరిణామాలతో విస్తుపోయిన ప్రజలు వైఎస్సార్సీపీకే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. అమలాపురంలో ‘దేశం’ సర్దుకోవలసిందే అమలాపురం నియోజకవర్గంలో మంత్రి, వైఎస్సార్సీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ గెలుపు బాటలో పయనిస్తున్నారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సీనియర్గా అన్ని వర్గాలతో మమేకం కావడం, అందరినీ కలుపుకునిపోయే మనస్తత్వం, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవంతో విశ్వరూప్ విజయానికి ఢోకా లేదు. ప్రత్యర్థిగా బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు ఎమ్మెల్యేగా ప్రజలతో పెద్దగా మమేకమవకపోవడం ప్రతికూలతగా మారింది. సొంత పారీ్టలోనే కాకుండా కూటమిలోని జనసేన నేతలు కూడా తెరవెనుక వ్యతిరేకంగా పనిచేస్తుండటం మైనస్.‘రాజా’నగరమే ఇక్కడ వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ప్రత్యరి్థగా జనసేన నుంచి బత్తుల బలరామకృష్ణ పోటీపడుతున్నారు. రూ.1773 కోట్లతో అభివృద్ధి పనులు, రూ.1377 కోట్లతో అందించిన సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా నిలిచి సానుకూలమైన వాతావరణం ఏర్పడింది. జనసేన అభ్యర్థి బలరామకృష్ణ ఉద్యోగాలు వేయిస్తానని పలువురిని మోసం చేయడం వంటి కేసులుండటంతో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. జనసేనతో జతకట్టిన టీడీపీ నేతల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకత బలరామకృష్ణకు ప్రతికూల అంశం. బలరామకృష్ణ ఏకైక నమ్మకం పవన్ సామాజికవర్గం.రామచంద్రపురంలో వైఎస్సార్సీపీ రయ్..రయ్ రాజకీయ దురంధరుడైన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్చంద్రబోస్ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని రామచంద్రపురం బరిలోకి దిగిన అతని తనయుడు, విద్యావంతుడు పిల్లి సూర్యప్రకాశ్ విజయానికి చేరువలో ఉన్నారు. స్థానికుడు, తండ్రి బోస్ ద్వారా గ్రామ,గ్రామాన ఉన్న విస్తృతమైన పరిచయాలు సానుకూల అంశాలు. బోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు చెందిన బలమైన సామాజిక వర్గాలు నియోజకవర్గ చరిత్రలో తొలిసారి వైఎస్సార్సీపీ పక్షాన నిలవడం ప్లస్ పాయింట్. టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ స్థానికేతరుడు, నేరచరిత్ర, అమలాపురం పరిసరాల్లో ఉన్న కేసులు, జనసేన నుంచి సహాయ నిరాకరణ ప్రతికూల అంశాలు.మార్పు కోరుతున్న ‘రూరల్’ రాజమహేంద్రవరం రూరల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పదేళ్లపాటు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. టీడీపీలో ఆ«ధిపత్య సామాజిక వర్గానికి చెందిన గోరంట్లపై బీసీ సామాజికవర్గానికి చెందిన బీసీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ బరిలోకి దిగారు. సమస్యలు పరిష్కరించలేక చేతులెత్తేసిన గోరంట్ల ఇక్కడ మూడోసారి తలపడుతుంటే, నియోజకవర్గ కోఆర్డినేటర్గా నియమితులై ప్రగతికి శ్రీకారం చుట్టడంతో వేణుకు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్సార్సీపీకి ప్రసాదమే అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీలో ఉన్న రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు ఫ్యాన్గాలి బలంగా వీస్తోంది. దేశంలో ఎస్సీ సామాజికవర్గం బలంగా ఉన్న రెండో పార్లమెంటు స్థానం అమలాపురం కావడం, ఆ సామాజికవర్గం ముద్ర వైఎస్సార్సీపీపై బలంగా ఉండటంతో కలిసి వచ్చే అంశం. రాపాకకు ప్రత్యరి్థగా టీడీపీ నుంచి పోటీచేస్తోన్న గంటి హరీ‹Ùమాధుర్కు రాజకీయాలపై పెద్దగా అవగహన లేకపోవడం మైనస్. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోను టీడీపీ, జనసేన పార్టీ నేతల మధ్య వర్గవైషమ్యాలు హరీ‹Ùకు ప్రతికూలంగా ఉన్నాయి.మండపేటలో వేగుళ్ల ఎదురీతమండపేటలో ఈ సారి వైఎస్సార్సీపీ దెబ్బకు బద్దలైపోవడం ఖాయంగా కనిపిస్తోంది. నియోకవర్గంలో తొలిసారి టీడీపీలో ఆధిపత్య సామాజిక వర్గాన్ని ఢీకొట్టే సత్తా కలిగిన నాయకుడిగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బరిలోకి దిగారు. సొంత సామాజికవర్గంతోపాటు బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలు మునుపెన్నడూ లేని రీతిలో తొలిసారి టీడీపీని కాదని కలిసి వస్తుండటం సానుకూలంగా మారింది. టీడీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన వేగుళ్ల జోగేశ్వరరావు ఈసారి ఏటికి ఎదురీదుతున్నారు. వేణుకు ‘వరమే’మృదు స్వభావి, నీటి పారుదల ఇంజనీర్గా రైతులకు చేసిన సేవలు పి.గన్నవరంలో వైఎస్సార్సీపీ అభ్యరి్థ, జడ్పీ చైర్పర్సన్ విప్పర్తి వేణుగోపాలరావును గెలుపు తీరానికి చేరుస్తున్నాయి. వివాదరహితుడు, విద్యావంతుడు, జడ్పీ చైర్మన్గా ఈ ప్రాంతాభివృద్ధిలో క్రియాశీలక పాత్ర, స్థానికుడు కావడం తదితర అంశాలు గెలుపునకు సానుకూలంగా మారాయి. ప్రత్యర్థి జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ స్థానికేతరుడు కావడం మైనస్గా ఉంది. పొత్తు సమన్వయం లేకపోవడం, ఆ పార్టీ నేతలు కలిసి రాకపోవడంతో గిడ్డికి ఎదురుగాలి వీస్తోంది.రాజమండ్రి సిటీలో సీటు చిరిగిపోయినట్లే రాజమహేంద్రవరం సిటీలో టీడీపీ ఎదురీదుతోంది. సిటీలో కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులే వైఎస్సార్సీపీ అభ్యరి్థ, సిటింగ్ ఎంపీ మార్గాని భరత్రామ్ను గెలుపు బాటలో పయనింపచేస్తున్నాయి. కళ్లెదుట కనిపిస్తున్న సుమారు రూ.400 కోట్లతో చేపట్టిన నగర సుందరీకరణ భరత్కు సానుకూలంగా మారింది. నగరంలో దశాబ్దన్నర కాలంగా అధికారాన్ని చెలాయిస్తున్న ప్రత్యరి్థ, టీడీపీ అభ్యరి్థగా ఆదిరెడ్డి వాసుపై నెలకొన్న అసంతృప్తే అతనికి మైనస్గా మారింది. తల్లి నగరపాలక సంస్థ మేయర్గా, భార్య భవానీ ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నప్పుడు నగరాభివృద్ధిపై కన్నెత్తి చూడకపోవడంతో వాసుకు ప్రతికూలంగా మారింది. -
తస్మాత్ జాగ్రత్త
ఫ నేరం చేస్తే నేరుగా జైలుకే ఫ పోలీస్ నియమావళి కఠినతరం ఫ ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణే లక్ష్యం కాకినాడ సిటీ: ఎన్నికల వేళ పోలీసులకు విశేషాధికారాలు ఉంటాయి. వారు నిజంగా అనుకుంటే ఎంతటి నేరగాడినైనా ముప్పుతిప్పలు పెట్టే అవకాశం ఉంటుంది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే లక్ష్యంతో ఏ చిన్న నేరాన్నీ ఉపేక్షించకుండా కట్టడి చేసే అధికార అస్త్రాలు పోలీసుల అమ్ములపొదిలో ఉంటాయి. ఆ అస్త్రాలివీ.. ● సెక్షన్ 125ఎ: అభ్యర్థులు తమకు పడిన శిక్షలు, తమపై మోపిన నేరాలకు సంబంధించిన విచారణల వివరాలను ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచటం నేరం. దీనికి ఆరు నెలల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ● సెక్షన్ 126: ఎన్నికలకు 48 గంటల లోపు ఊరేగింపులు చేయడం, సమావేశాలు నిర్వహించటం, మీడియా ప్రకటనలు ఇవ్వడం, సంగీత కచేరీలు తదితర వినోద కార్యక్రమాలు నిర్వహించటం నేరం. దీనికి రెండేళ్ల వరకూ జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధిస్తారు. ● సెక్షన్ 127ఎ: ఘర్షణలు సృష్టించే ఉద్దేశంతో రాజకీయ పార్టీల బహిరంగ సభలకు ఎవరైనా అడ్డంకులు సృష్టించటానికి ప్రయత్నించటం నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఆరు నెలల జైలు శిక్ష తప్పదు. ● సెక్షన్ 127: ప్రచురణకర్తల చిరునామా లేకుండా కరపత్రాలు, పోస్టర్లు, ఇతర ప్రకటనలు ముద్రించటం నేరం. ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలను జిల్లా మెజిస్ట్రేట్ అనుమతితోనే జారీ చేయాలి. దీనిని ఉల్లంఘిస్తే ఆరు నెలల జైలు, రూ.25 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ● సెక్షన్ 128: ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల ప్రక్రియకు చెందిన విషయాలను గోప్యంగా ఉంచాలి. దీనిని ఉల్లంఘిస్తే మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. ● సెక్షన్ 129: ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఏ పార్టీ అభ్యర్థికై నా అనుకూలంగా వ్యవహరించటం నేరం. దీనిని అతిక్రమిస్తే ఆరు నెలల జైలు, జరిమానా తప్పవు. ● సెక్షన్ 130: పోలింగ్ స్టేషన్కు 100 మీటర్ల లోపు ప్రచారం నిర్వహించటం, ఓటర్లను అభ్యర్థించ టం, ఇతర పార్టీల అ భ్యర్థులకు ఓట్లు వేయవద్దని చెప్పడం నేరం. ● సెక్షన్ 131, 132: పోలింగ్ స్టేషన్లలోని వ్యక్తులకు, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఆగ్రహం తెప్పించేలా మెగా ఫోన్లు, లౌడ్ స్పీకర్లతో ధ్వనులు చేయడం నిషిద్ధం. అలాంటి వారిని అరెస్టు చేయాల్సిందిగా ప్రిసైడింగ్ అధికారులు, పోలీసు అధికారులకు సూచించవచ్చు. నిందితులకు మూడు నెలల జైలు, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ● సెక్షన్ 134ఎ: ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా రాజకీయ పార్టీకి పోలింగ్, కౌంటింగ్ ఏజెంటుగా ఉండటం నేరం. అలా చేస్తే మూడు నెలల జైలు తప్పదు. ● సెక్షన్ 134బి: ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, ఉన్నతాధికారుల అనుమతి పొందిన సాయుధ పోలీసులు మినహా ఎవ్వరూ ఆయుధాలు ధరించి, పోలింగ్ స్టేషన్ సమీపంలో సంచరించకూడదు. పట్టుబడితే రెండేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు. ● సెక్షన్ 165, 166 సీఆర్పీసీ: వారెంట్లు లేకుండానే సోదాలు చేసే అధికారాన్ని పోలీసులకు ఈ సెక్షన్లు కల్పిస్తాయి. ఓటర్లకు పంపిణీ చేయటానికి ఎక్కడైనా డబ్బు, మద్యం, ఇతర బహుమతులను భద్రపరచినట్లు సమాచారం వస్తే పోలీసులు వెంటనే సోదాలు నిర్వహిస్తారు. అనుమతి లేకుండా ఉంచిన ఆయా సామగ్రిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేస్తారు. ● సెక్షన్ 353, 332, 186, 189, 190: వీటి ప్రకారం ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులను నిరోధించటం, దౌర్జన్యాలకు పాల్పడటం, దాడులు చేయటం వంటి చర్యలను నేరాలుగా పరిగణిస్తారు. ఎన్నికల నేపథ్యంలో కిడ్నాపులు, దాడులు, దౌర్జన్యా లు, హత్యాయత్నాలు, మారణాయుధాలు వినియోగించి దాడులకు పాల్పడటం, బాంబులు విసురుకోవడం చేస్తే ఐపీసీతో పాటు ఆర్పీ యాక్టు, పోలీసు చట్టంలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. -
పూలవనం..గోదారి సోయగం..
నియోజకవర్గంలో 2019–23 మధ్య వివిధ పథకాల ద్వారా చేకూరిన లబ్ధి పథకం లబ్దిదారులు నిధులు (రూ.కోట్లలో) జగనన్న అమ్మ ఒడి 40,753 87.67 జగనన్న విద్యా దీవెన 15,939 52.43 జగనన్న వసతి దీవెన 12,069 19.75 వైఎస్సార్ ఆసరా 28,558 68.66 జగనన్న చేదోడు 3,469 4.71 వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 34,977 18.48 వైఎస్సార్ కాపు నేస్తం 8,955 15.7 వైఎస్సార్ ఈబీసీ నేస్తం 1448 4.05 వైఎస్సార్ చేయూత 26,045 68.67 వైఎస్సార్ పెన్షన్ కానుక 32,364 249.32 వైఎస్సార్ సున్నా వడ్డీ 26,177 10.02 వైఎస్సార్ వాహనమిత్ర 2,824 7.65 వైఎస్సార్ రైతు భరోసా 27,321 51.44 వైఎస్సార్ బీమా 1230 3.35 నాన్ డీబీటీ కార్యక్రమం పనులు/ నిధులు భవనాలు (రూ.కోట్లలో) నాడు–నేడు 86 38.12 రైతుభరోసా కేంద్రాలు 42 10.05 సచివాలయాలు 61 26.592 విలేజ్ క్లినిక్స్ 54 11.234 సీసీరోడ్లు, డ్రైన్లు (గ్రామాల్లో) 593 18.55 వాటర్ ట్యాంకులు 23 5.27 ఇళ్ల స్థలాలు 5,467 జగనన్న ఇళ్లు 5,511 42.82 అంగన్వాడీ భవనాలు 5 0.60 జల్జీవన్ మిషన్ 76 41.23 గడప గడపకూ మన ప్రభుత్వం 273 11.95 ● కాటన్ బ్యారేజీతో సస్యశ్యామలం ● మనసును దోచే నర్సరీలురాజమహేంద్రవరం రూరల్: దాదాపు మూడున్నర లక్షల జనాభా, రెండున్నర లక్షల మందికి పైగా ఓటర్లు, అనేక ప్రత్యేకతలతో రాజకీయ చైతన్యానికి కేంద్ర బిందువుగా నిలుస్తోంది రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం. దేశ, విదేశాల్లో గుర్తింపు పొందిన కడియం నర్సరీలు, డెల్టాకు గోదారమ్మ పరవళ్లను నియంత్రించే ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ, రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాలకు సరిహద్దుగా ఉండే ప్రధాన రైల్వే స్టేషన్ ఈ నియోజకవర్గ గుర్తింపును శాశ్వతం చేస్తున్నాయి. ఆధ్యాత్మికంగా ఇస్కాన్, స్వామి అయ్యప్ప, సరస్వతీ, మహాకాళేశ్వర ఆలయాలు కూడా మంచి గుర్తింపు పొందాయి. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బులుసు సాంబమూర్తి స్వగ్రామం దుళ్ల కూడా ఈ నియోజకవర్గంలోని కడియం మండలం పరిధిలోనే ఉంది. నియోజకవర్గ స్వరూపం గతంలో కడియం నియోజకవర్గంగా పిలిచేటప్పుడు దీనిలో కడియం, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం మండలాలతో పాటు రాజమహేంద్రవరం సిటీ శివార్లలోని పలు వార్డులు ఉండేవి. అనంతరం రాజానగరం ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడటంతో రాజమహేంద్రవరం రూరల్, కడియం మండలాలతో పాటు, సిటీలోని 9 వార్డు లు రూరల్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చాయి. ఈ నియోజకవర్గంలోని పది గ్రామాలను గ్రేటర్ రాజమహేంద్రవరం పరిధిలో చేర్చారు. విరివనాల సిరులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల కలగలుపుగా ఉండే ఈ నియోజకవర్గంలోని కడియం ప్రాంత పూల వనాలను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిందే. 25 వేల ఎకరాలకు పైగా విస్తరించిన ఇక్కడి నర్సరీల్లో దేశ, విదేశాలకు చెందిన వెయ్యికి పైగా పువ్వులు, పండ్లు, అలంకరణ మొక్కలను రైతులు అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ రెండు వేల మందికి పైగా గుర్తింపు పొందిన నర్సరీ రైతులున్నారు. ఈ నర్సరీలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి పైగా ఆధారపడి జీవిస్తున్నారు. ఇక్కడ పని చేయడానికి శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి తదితర ప్రాంతాల నుంచి వలస కార్మికులు వస్తూంటారు. అలాగే కడియం, రాజమహేంద్రవరం రూరల్, కొత్తపేట, ఆలమూరు తదితర మండలాలకు చెందిన కార్మికులు ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడి నుంచి దేశం నలుమూలలకే కాకుండా, అరబ్ దేశాలకు కూడా మొక్కలను ఎగుమతి చేస్తూంటారు. రెండు రూపాయల నుంచి రూ.20 లక్షలు పైగా విలువ చేసే మొక్కలు ఇక్కడ లభిస్తాయి. వీటిని చూసేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ నర్సరీలు సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట నిర్మించడంతో మరింతగా విస్తృతమయ్యాయని స్థానిక రైతులు చెబుతారు. ఈ ఆనకట్ట ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నపూర్ణగా మార్చింది. ఇవీ ప్రత్యేకతలు ● గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల పరిధిలోని లక్షల ఎకరాలకు ధవళేశ్వరం ఆనకట్ట ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ● గోదావరి తీరాన ఇస్కాన్, అయ్యప్పస్వామి, విశ్వేశ్వరస్వామి, సరస్వతి, మహాకాళేశ్వర ఆలయాలు, ధవళేశ్వరం జనార్దనస్వామి ఆలయం ప్రముఖమైనవి. ● పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, డైట్, పాలిటెక్నిక్ కళాశాలలు అందుబాటులో ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు చదువుకునేందుకు ఇక్కడకు వస్తారు. ● పునర్విభజన అనంతరం రాజమహేంద్రవరం కేంద్రంగా ఆవిర్భవించిన నూతన తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్ ఈ నియోజకవర్గ పరిధిలోని బొమ్మూరులో ఏర్పాటు చేశారు. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ కడియం నర్సరీలుఇప్పటి వరకూ ఎన్నికై న ఎమ్మెల్యేలు 1972 బత్తిన సుబ్బారావు (కాంగ్రెస్) 1978 పాటంశెట్టి అమ్మిరాజు (జనతా పార్టీ) 1983 గిరజాల వెంకటస్వామి నాయుడు (స్వతంత్ర) 1985 వడ్డి వీరభద్రరావు (టీడీపీ) 1989 జక్కంపూడి రామ్మోహనరావు (స్వతంత్ర) 1994 వడ్డి వీరభద్రరావు (టీడీపీ) 1999 జక్కంపూడి రామ్మోహనరావు (కాంగ్రెస్) 2004 జక్కంపూడి రామ్మోహనరావు (కాంగ్రెస్) రూరల్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009 చందన రమేష్ (టీడీపీ) 2014 గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ) 2019 గోరంట్ల బుచ్చయ్య చౌదరి (టీడీపీ) ఓటర్ల వివరాలు మొత్తం ఓటర్లు : 2,72,826 పురుషులు : 1,33,241 సీ్త్రలు : 1,39,561ఇతరులు : 24 -
పురాతన చరిత్ర నిడదవోలు సొంతం
● నియోజకవర్గం ఏర్పడింది మాత్రం 2009లోనే.. ● చాళుక్యులు, కాకతీయులు ఏలిన పట్టణం ● పురాతన శైవాలయాలకు, చర్చిలకు ప్రసిద్ధి నిడదవోలు: ఘనమైన చరిత్ర గల పురాతన పట్టణం నిడదవోలు. పూర్వం నిరవజ్జపురం, నిరవజ్జప్రోలు అనే పేర్లతో ప్రసిద్ధి పొంది నేడు నిడదవోలుగా పిలువబడుతోంది. ఈ పట్టణాన్ని మొదట చాళుక్యరాజులు పాలించారు. అనంతరం వారు కాకతీయ రాజులతో వియ్యం అందుకోవడంతో కాకతీయులు కొంతకాలం ఏలారు. వీరి హయాంలో శిల్పకళ అభివృద్ధి చెందింది. కొన్నేళ్ల క్రితం పట్టణంలో జరిపిన తవ్వకాల్లో బయటపడిన అందమైన విగ్రహాలు కాకతీయుల చరిత్రకు నిదర్శనంగా నిలిచాయి. నిడదవోలు పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి చినకాశిరేవులో సుమారు 30 ఆలయాలున్నాయి. పట్టణంలోని పురాతన గోలింగేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలు ప్రసిద్ధి చెందాయి. అలాగే రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో మండలంలోని తిమ్మరాజుపాలెంలో కొలువైన కోట సత్తెమ్మ వారి ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయానికి ఏడాదికి రూ.3 కోట్లకు పైగా ఆదాయం వస్తోంది. పట్టణంలోని చర్చిపేటలో 100 ఏళ్ల చరిత్ర గల కృపాధార లూథరన్ దేవాలయం, కురేషియా పెద మసీదులు ఎంతో పేరు గాంచాయి. రాజకీయ పోరు నిడదవోలు నియోజకవర్గం 2009లో ఏర్పడింది. తొలిసారిగా 2009లో నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో శేషారావు 5,766 ఓట్ల మెజారిటీతో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి జి.శ్రీనివాస్నాయుడిపై విజయం సాధించారు. ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన రుద్రరాజు గజపతి కుమార్ రాజుకు 44,511 ఓట్లు దక్కాయి. 2014 ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికే చెందిన బూరుగుపల్లి శేషారావు రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో శేషారావుకు 81,591 ఓట్లు రాగా, వైఎస్సార్ సీసీ తరుఫున పోటీ పడిన ఎస్.రాజీవ్కృష్ణకు 75,232 ఓట్లు దక్కాయి. బూరుగుపల్లి శేషారావుకు 6,352 ఓట్ల మెజార్టీ లభించింది. పోలింగ్ శాతం 85.56గా నమోదైంది. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసిన జి.శ్రీనివాస్నాయుడు 24,000 ఓట్ల మెజారిటీతో గెలిచాలి. ఆయన ప్రధాన ప్రత్యర్థి బూరుగుపల్లి శేషారావు. నియోజకవర్గ స్వరూపం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో నిడదవోలు నియోజకవర్గం ఏర్పడింది. నిడదవోలు మున్సిపాలిటీతో పాటు నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలు ఇందులో చేరి ఉన్నాయి. అంతకు ముందు నిడదవోలు పట్టణంతో పాటు నిడదవోలు మండలం కొవ్వూరు నియోజకవర్గంలోను, ఉండ్రాజవరం మండలం తణుకు నియోజకవర్గంలోను, పెరవలి మండలం పెనుగొండ నియోజకవర్గంలోను అంతర్భాగంగా ఉండేవి. 1999 ఎన్నికల నాటికి పూర్వపు ఉమ్మడి గోదావరి జిలాల్లో 16 నియోజకవర్గాలు ఉండేవి. ఆ ఎన్నికల్లో మొత్తం 15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యాయి. ఒక్క కొవ్వూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జీఎస్ రావు మాత్రమే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన వైఎస్సార్ సీపీ రాష్ట్ర సలహామండలి సభ్యుడిగా దివంతగ మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు జీఎస్రావు పీసీసీ అధ్యక్షుడిగా సేవలు అందించారు. భౌగోళిక స్వరూపం నిడదవోలు అసెంబ్లీ సెగ్మెంట్ 282.92 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. సరిహద్దులుగా తూర్పున గోదావరి (ఆచంట నియోజకవర్గం), పడమరన గోపాలపురం నియోజకవర్గం (దేవరపల్లి మండలం), ఉత్తరాన కొవ్వూరు నియోజకవర్గం (చాగల్లు మండలం) దక్షిణాన తాడేపల్లిగూడెం నియోజకవర్గం (తాడేపల్లిగూడెం మండలం). కాగా నియోజకవర్గ కేంద్రమైన నిడదవోలు ద్వితీయ శ్రేణి మునిసిపాలిటీ. ప్రధాన పంటలు నియోజకవర్గంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. మూడు మండలాల్లోని 36,500 ఎకరాల్లో వరి, 1,500 ఎకరాల్లో అరటి, కంది, పసుపు, జామ, కోకో, ఆకుకూరలు, పూల తోటలు సాగులో ఉన్నారు. చెంతనే పశ్చిమ డెల్టా గోదావరి ప్రధాన కాలువ జీవ నదిని తలపిస్తూ ప్రవహిస్తోంది. సాగునీటి ఇబ్బందులు లేకుండా ఏటా పుష్కలంగా రెండు పంటలు పండుతున్నాయి. జూన్ 2019 నుంచి నుంచి ఫిబ్రవరి 2024 వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నియోజకవర్గ ప్రజలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.1450 కోట్లు ఖర్చు చేసింది. అలాగే నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.670 కోట్లు వెచ్చింది. నిడదవోలు నియోజకవర్గంలో... నిడదవోలు పురపాలక సంఘం నిడదవోలు మండలం ఉండ్రాజవరం మండలం పెరవలి మండలం వివిధ సంక్షేమ పథకాలు.. లబ్ధిదారుల వివరాలు, పొందిన మొత్తం వివరాలు పథకం లబ్ధిదారులు (లబ్ధి రూ.కోట్లలో) జగనన్న అమ్మఒడి 22,260 109.60 జగనన్న వసతి దీవెన 4,818 15.41 జగనన్న విద్యాదీవెన 14,427 42.61 వైఎస్సార్ రైతు భరోసా 22,726 126.83 వైఎస్సార్ సున్నా వడ్డీ (రైతులకు) 7,761 2.12 వైఎస్సార్ ఉచిత పంటల బీమా 14,510 35.57 రైతుల ఇన్పుట్ సబ్సిడీ 9,444 14.07 వైఎస్సార్ సున్నా వడ్డీ (ఎస్హెచ్జీ) 15,560 34.98 వైఎస్సార్ పింఛను కానుక 33,553 373.84 వైఎస్సార్ చేయూత 9,044 59.24 వైఎస్సార్ ఆసరా 4,815 185.36 వైఎస్సార్ బీమా 196 4.99 వైఎస్సార్ కాపు నేస్తం 4,344 15.77 జగనన్న చేదోడు 1,281 2.59 ఇతర పథకాలు వైఎస్సార్ వాహనమిత్ర 1,300 3.10 వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 1,288 1.98 వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 14,940 51.47 ఆగ్రి గోల్డ్ బాధితులకు సాయం 2,102 1.32 వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా 284 1.64 లా నేస్తం 78 11 ( రూ.లక్షలు) అర్చకులు, ఇమాం, మౌజ్, పాస్టర్లు 244 27 (రూ. లక్షలు నేతన్న నేస్తం 08 04 (రూ.లక్షలు) నాన్ డీబీటీ పథకాలు జగనన్న తోడు 3,205 4.14 జగనన్న గోరుముద్ద 32,672 2.29 వైఎస్సార్ సంపూర్ణ పోషణ 40,496 29.92 జగనన్న విద్యాకానుక 41,069 6.69 ఇళ్ల స్థలాలు (భూసేకరణ) 11,197 109.90 ఇంటి రుణాలు 10,200 193.29 ఓటీఎస్ పట్టాలు 7,362 2.99 వైఎస్సార్ కంటి వెలుగు 6,449 32 ( రూ.లక్షలు) నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,13,396 పురుషులు 1,04,235 మహిళలు 1,09,157 ఇతరులు 04 పట్టణం, మండలాల వారీగా.. నిడదవోలు మునిసిపాలిటీ 35,112 నిడదవోలు మండలం 58,216 ఉండ్రాజవరం 62,362 పెరవలి 57,706 మొత్తం పోలింగ్ స్టేషన్లు 205
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- 3 రోజులు తేలికపాటి వానలు!
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- రైతు భరోసా నిధుల విడుదల
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement