-
TDP: అరాచక శక్తులు.. కేసులు గుట్టలు
👉 భూముల కబ్జాకోరులు, కరుడుగట్టిన నేరస్తులకు చంద్రబాబు టికెట్లు ఒకరు భూ కబ్జాకోరు, హత్యా రాజకీయాలకు మారు పేరు.. మరొకరు అవినీతి అక్రమాలకు దేశస్థాయిలో పేరుగాంచిన వారు.. బ్యాంకులకే ఎగనామం పెట్టిన వారు ఇంకొకరైతే, బ్లాక్మెయిలింగ్కు పేరుగాంచిన మహానుభావుడు మరొకరు.. కుట్రలు, కుతంత్రాలకు మారుపేరైన చంద్రబాబు.. తనకు తగ్గ టీంనే ఈసారి బరిలోకి దించారు. దౌర్జన్యకారులు, ఖూనీకోరులను ఎంపిక చేసి మరీ టికెట్లు కట్టబెట్టారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ టికెట్లు దక్కించుకున్న వారిలో ఎవరి చరిత్ర చూసినా కళ్లు బైర్లు కమ్ముతాయి. వీరిని తలచుకుంటేనే సామాన్యులు బెంబేలెత్తాల్సిన పరిస్థితి. కానీ, వీరంతా టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టిలో సచ్ఛీలురు కావడమే దౌర్భాగ్యం. అడుగడుగునా అడ్డదారుల్లో ముందుకెళ్తూ, ఎదురొచ్చిన వారిని అడ్డు తొలగించుకుంటూ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించిన చంద్రబాబు టీంలోని వీరు ఒకవేళ కర్మ కొద్దీ ప్రజాప్రతినిధులుగా ఎన్నికై తే జిల్లాలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు.దళితులకు శఠగోపం.. హత్యా రాజకీయం..తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్పై 2015లో ఏకంగా హత్య కేసు నమోదైంది. వైఎస్సార్ సీపీ నేత ప్రసాద్రెడ్డి దారుణ హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఇక.. బండమీద పల్లిలో ఓ దళితుడి భూమిని అక్రమంగా లాక్కున్నాడన్న కారణంగా బాధితుడు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. దీంతో అప్పట్లో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్కు వ్యతిరేకంగా దళిత సంఘాల నాయకులు ధర్నాకు దిగడం జిల్లాలో చర్చనీయాంశమైంది.డాక్టర్ వద్దంట.. కేసుల వీరుడే ముద్దంటమడకశిర నియోజకవర్గ సీటును 52 కేసులున్న ఎమ్మెస్ రాజుకు చంద్రబాబు కేటాయించారు. ఉన్నత చదువులు చదివిన డాక్టర్ సునీల్కు ముందు టికెట్ ఇచ్చిన బాబు... ఆ తర్వాత ఆయన నుంచి టికెట్ లాక్కుని మరీ నేర చరితుడికి కట్టబెట్టారు. బ్లాక్మెయిలింగ్ చేయడం, డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడం, ప్రశ్నిస్తే దౌర్జన్యం చేయడం ఇలా రకరకాల కేసులు ఎమ్మెస్ రాజుపై నమోదై ఉండడం గమనార్హం. శింగన మల, అనంతపురం ప్రాంతాల్లోని స్టేషన్లలో దాదాపు 52 కేసులు ఇతనిపై ఉన్నాయి.జేసీ చరిత్రంతా నేరాల మయమే..జేసీ.. ఈ పేరు చెబితే చాలు నేరాలకు కేరాఫ్ అడ్రస్ అన్నట్టుంటుంది. ఫ్యాక్షన్ హత్యలను ప్రోత్సహించి చలి కాచుకున్న జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి.. అవినీతి చేయడంలోనూ పేట్రేగిపోయారు. నకిలీ ఇన్వాయిస్లతో వాహనాల అమ్మకం, అనుమతులు లేకుండా బస్సులు తిప్పడం కేసుల్లో జేసీ ప్రభాకర్రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డి జైలుకు కూడా వెళ్లొచ్చారు. దేశస్థాయిలో వీరి ఘనకార్యంపై చర్చ నడిచింది. ఇప్పుడు అలాంటి నేరచరిత్ర కలిగిన అస్మిత్ రెడ్డికే చంద్రబాబు తాడిపత్రి టికెట్ ఇచ్చారు. ఎప్పుడూ తాడిపత్రిలో ఏదో ఒక వివాదం సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని అందరికీ తెలిసిందే.తిట్టి.. టికెట్ కట్టబెట్టి..గుమ్మనూరు జయరాం మంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు, ఆయన పుత్రరత్నం నారా లోకేష్లు జయరాంను తిట్టని తిట్టంటూ లేదు.మట్కా ఆడిస్తారని, పేకాట క్లబ్బులు నడిపిస్తారని, బెంజ్కార్లు లంచంగా తీసుకున్నారని ఇలా లెక్కలేనని ఆరోపణలు చేశారు. అయితే, ఎప్పుడైతే ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారో వెంటనే సచ్ఛీలుడై పోయాడు. ఇష్టమొచ్చినట్లు తిట్టిన బాబే ఆయనకు గుంతకల్లు టికెట్ ఇవ్వడంతో స్థానికులే కాదు.. జిల్లా ప్రజానీకమంతా ముక్కున వేలేసుకుంది.పరిటాలకే ఎందుకో..?టీడీపీ తరఫున రాప్తాడు ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న పరిటాల సునీత కుటుంబం పేరెత్తితేనే గతంలో ఆ కుటుంబం సాగించిన రక్తచరిత్ర గుర్తుకొస్తుంది. సునీత భర్త పరిటాల రవి అప్పట్లో చేసిన హత్యారాజకీయాల గురించి ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా కథలుకథలుగా చెప్పుకుంటారు. ఆర్వోసీ పేరుతో కొన్ని వందల మందిని ఊచకోత కోసినట్లు చెబుతారు. దీనికితోడు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన సునీత అవినీతి, అక్రమాలకు లెక్కేలేదు.కబ్జాల కందికుంటకదిరి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కందికుంట వెంకటప్రసాద్పై లెక్కలేనన్ని కేసులున్నాయి. కదిరిలో కంటికి కనిపించిన భూములన్నీ కబ్జా చేసేస్తాడనే ఆరోపణలున్నాయి. ఒక రేప్ కేసులో ఈయన నిందితుడిగా ఉన్నట్లు గతంలో ఓ సర్వే సంస్థ వెల్లడించింది. హత్య, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. చెక్బౌన్స్ కేసులైతే లెక్కలేనన్ని. నకిలీ డీడీల కేసులోనూ నిందితుడిగా ఉన్నారు. ఆ కేసును ఇటీవల కొట్టేయడంతో ఇదే అదనుగా చంద్రబాబు ఆయనకు సీటిచ్చేశారు.👉 పెనుకొండ టీడీపీ అభ్యర్థి సవిత కూడా తక్కువేమీ కాదు. గ్రానైట్, మట్టి, పెట్రోలు కుంభకోణాలకు పాల్పడ్డారని ఈమైపె అనేక కేసులున్నాయి.ఒక హత్య.. మరో హత్యాయత్నం!ఎన్నికల నేపథ్యంలో హత్యా రాజకీయాలకు టీడీపీ నాయకులు తెరలేపారు. కొన్ని రోజుల క్రితం అనంతపురం అర్బన్లో వైఎస్సార్ సీపీ నాయకుడు గుజ్జల నగేష్పై పచ్చ పార్టీకి చెందిన జయరాం నాయుడు వర్గీయులు మారణాయుధాలతో విరుచుకుపడ్డారు. మరోవైపు కదిరి నియోజకవర్గం జౌకుల గ్రామంలో నాగభూషణం అనే యువకుడిని టీడీపీ వర్గీయులు చంపేశారు. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. నేర చరితులకు చంద్రబాబు టికెట్లు కట్టబెట్టడంతోనే ఇలా జరుగుతోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
No Headline
● కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం రాష్ట్రంలోనే ప్రసిద్ధి పొందింది. ఏటా శ్రావణ, కార్తీక మాసాల్లో ప్రతి శని,మంగళవారాల్లో దేవాలయానికి ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు వేలాదిగా తరలివస్తారు. ● నియోజకర్గంలోని గుతి ్తకోట అత్యంత పురాతనమైన దుర్గాల్లో ఒకటి. 7వ శతాబ్దానికి చెందినదిగా ఇక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది. గుత్తి కోట సందర్శనకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ● గుత్తి మండలంలోని చెర్లోపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న సేవాగఢ్ సంత్సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్యదైవంగా విరాజిల్లుతున్నాడు. ఏటా జరిగే జయంత్యుత్సవాలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేలసంఖ్యలో బంజారాలు తరలివస్తుంటారు. ● గుంతకల్లు పట్టణంలోని మస్తానయ్య దర్గా కులమతాలకు అతీతంగా ఖ్యాతిగాంచింది. ఏటా జరిగే మస్తానయ్య ఉరుసులో రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక నుంచి వేలాదిగా భక్తులు తరలి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ● పామిడి వస్త్ర రంగానికి ప్రసిద్ధి, ఈ గ్రారమంలోని సగం జనాభా వస్త్ర వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంటారు. దీంతో పామిడిని రెండో ముంబాయిగా పిలుస్తుంటారు. నియోజవర్గ ప్రత్యేకతలు.. -
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
గుత్తి/తాడిపత్రి: జిల్లాలోని గుత్తి, తాడిపత్రి ప్రాంతాల్లో రైలు కింద పడి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. జీఆర్పీ ఎస్ఐ నాగప్ప తెలిపిన మేరకు... గుత్తి మండలం శ్రీపురం గ్రామానికి చెందిన జనార్దన్ (46) రెండేళ్లుగా గుత్తి ఆర్ఎస్లోని సుందరయ్య కాలనీలో నివాసముంటున్నాడు. అర్థిక సమస్యలు తలెత్తడంతో మానసికంగా కుదేలైన ఆయన శనివారం ఉదయం ఎంఎంస్ హైస్కూల్ సమీపంలోని పట్టాలపై చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ● తాడిపత్రిలోని శ్రీనివాసపురానికి చెందిన రఫీ, రషీదా దంపతుల కుమారుడు షాహీద్ బాషా (20) ఇంటర్ పూర్తి చేశాడు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఇంటి పట్టునే ఉంటున్నాడు. కొంత కాలంగా మానసిక స్థిమితం కోల్పోయి అప్పుడప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయేవాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన షాహిద్ బాషా అర్ధరాత్రి సమయంలో యల్లనూరు – పుట్లూరు మార్గంలోని రైల్వే లెవల్ క్రాసింగ్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయాన్ని తాడిపత్రి స్టేషన్ మాస్టర్కు లోకో పైలట్ తెలపడంతో శనివారం ఉదయం రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఈ రెండు ఘటనలపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు జీఆర్పీ ఎస్ఐ నాగప్ప తెలిపారు. -
నీటి టబ్బులో పడి చిన్నారి మృతి
చెన్నేకొత్తపల్లి: టబ్బులో ఆడుకుంటున్న ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు... చెన్నేకొత్తపల్లి మండలం యర్రజినన్నగారిపల్లి (కొండకింద పల్లి) గ్రామానికి చెందిన బొగ్గు మురళి, అరుణ దంపతులకు ఓ కుమార్తెతో పాటు 14 నెలల వయసున్న కుమారుడు ఉన్నారు. శనివారం వేసవి తాపం అధికంగా ఉండడంతో సాయంత్రం టబ్లో నీరు పోసి అందులో కుమారుడిని కూర్చొబెట్టి తల్లి ఆడించింది. ఈ క్రమంలోనే పనిపై చిన్నారిని టబ్లోనే వదిలేసి ఇంట్లోకి వెళ్లిన ఆమె బయటకు వచ్చి చూసే లోపు నీట మునిగి బాలుడు మృతి చెందాడు. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
అనంతపురం అర్బన్: పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ స్పష్టం చేశారు. రాప్తాడు అసెంబ్లీ, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక పంగల్రోడ్డులోని టీటీడీసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ను కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన, ఇతర జిల్లాలకు చెందిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. జిల్లాలో రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి మూడు మండలాలు ఉన్నాయని, మిగిలిన మండలాలు శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నాయన్నారు. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే విషయంలో కొద్దిపాటి గందరగోళం ఉందని, దీనిపై స్పష్టత ఇవ్వాలని పోలింగ్ సిబ్బంది, అభ్యర్థులు కోరారన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన వారు ఇక్కడికి శిక్షణకు వచ్చామని, ఇక్కడే ఓటు హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ అంశంపై ఆ జిల్లా కలెక్టర్తో మాట్లాడి నివేదిక తెప్పించుకున్నామన్నారు. వారికి ఇక్కడ ఓటుహక్కు కల్పిస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి నిబంధనలు మారిన నేపథ్యంలో అవగాహన పొందాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని ఫారం–12 ఇచ్చిన ఉద్యోగులందరికీ వాయిస్ కాల్, మెసేజ్ ద్వారా తెలియజేశామన్నారు. కార్యక్రమంలో రాప్తాడు రిటర్నింగ్ అధికారి వసంతబాబు తదితరులు ఉన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement