బాబు పాలనలో మోసపోయిన వారందరికీ అండగా నేనుంటా | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో మోసపోయిన వారందరికీ అండగా నేనుంటా

Published Sun, Mar 24 2019 6:38 PM

చంద్రబాబు నాయుడి పాలనలో పేదవాడికి ఏది కావాలన్న జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలు రేషన్‌ తీసుకోవాలన్నా, బాత్‌రూమ్‌ నిర్మించుకోవాలన్నా ప్రభుత్వానికి లంచం చెల్లించాల్సిన పరిస్థితి టీడీపీ ప్రభుత్వంలో ఉందని ఆరోపించారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదని, రైతుల, నిరుద్యోగుల ఆత్మహత్యలు తప్ప మరేమీ లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికలు ఇరవై రోజులే ఉన్నందున అనేక అబద్ధాలు చెప్పడానికి చంద్రబాబు సిద్ధమైయ్యారని, ఆయనతో యుద్ధం చేయడానికి మనందరం సిద్ధంగా ఉండాలన్నారు.