వైరల్‌ : ప్రార్థన చేసి, గుంజీలు తీసి ఆపై.. | Sakshi
Sakshi News home page

వైరల్‌ : ప్రార్థన చేసి, గుంజీలు తీసి ఆపై..

Published Fri, Nov 22 2019 7:03 PM

ఒక దొంగ దర్జాగా గుడి లోపలికి వచ్చి దేవుడిని ప్రార్థన చేసి మరీ కిరీటాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ వింత ఘటన మన హైదరాబాద్‌లోని అబిడ్స్‌ ప్రాంతంలోనే బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. కాగా దొంగ చేసిన పని సీసీ కెమెరాలో రికార్డవడం అది కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దొంగతనం చేసే ముందు ఆ వ్యక్తి చేసిన పని అందరికి నవ్వు తెప్పిస్తుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో నిత్యం రద్దీగా ఉండే అబిడ్స్‌ ప్రాంతంలో ఉన్న దుర్గ గుడికి బుధవారం సాయంత్రం ఒక వ్యక్తి వచ్చాడు.