ఈనాటి ముఖ్యాంశాలు | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Published Thu, Sep 5 2019 7:48 PM

ఆంధ్రప్రదేశ్‌ హోం మంత్రి మేకతోటి సుచరిత, తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహం వద్ద శ్రీదేవికి జరిగిన అవమానాన్ని సుచరిత ముఖ్యమంత్రికి వివరించారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, జైషే మహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ మహమ్మద్‌ సయీద్, ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు జకీ ఉర్‌ రెహ్మాన్‌ లఖ్వీలను వ్యక్తిగత హోదాలో ఉగ్రవాదులుగా ప్రకటించిన భారత ప్రభుత్వ నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా సమర్థించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement