ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపునకు పటిష్టమైన ఏర్పాట్లు

Published Thu, Apr 25 2019 8:20 AM

రాష్ట్రంలో వచ్చే నెల 23వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఆయా కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం అమరావతిలోని సచివాలయం నుంచి కౌంటింగ్‌ ఏర్పాట్లు, తాగునీరు తదితర అంశాలపై ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది, డీజీపీ ఠాకూర్‌తో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement