బస్సు- టాటా ఏస్‌ ఢీ, ఏడుగురు మృతి | Sakshi
Sakshi News home page

బస్సు- టాటా ఏస్‌ ఢీ, ఏడుగురు మృతి

Published Wed, Mar 6 2019 1:53 PM

జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టాటా ఏస్‌ వాహనం ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్‌ నుంచి దేవరకొండవైపు వస్తున్న టాటాఏస్‌ వాహనం నాగార్జున సాగర్‌ హైవేపై కొండపల్లి మండలం చెన్నారం వద్దకు రాగానే టైర్‌ పేలడంతో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాటాఏస్‌ వాహనంలోని ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 10 మందికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే సమీపంలో ఆసుపత్రులు లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement