పోలీసులు టైమ్ వేస్ట్ చేశారు | Sakshi
Sakshi News home page

పోలీసులు టైమ్ వేస్ట్ చేశారు

Published Fri, Nov 29 2019 1:15 PM

పోలీసులు వెంటనే స్పందించి ఉంటే తమ బిడ్డ ప్రాణాలతో దక్కేదని డాక్టర్ ప్రియాంకారెడ్డి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన తర్వాత ఎన్ని బృందాలతో వెళ్తే మాత్రం ఏం ఉపయోగం ఉంటుందని పోలీసుల తీరును ప్రశ్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్డు బ్రిడ్జి కింద పూర్తిగా తగలబడిన స్థితిలో ప్రియాంకారెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు స్వల్పకాలంలోనే ఛేదించారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పథకం ప్రకారం ప్రియాంకారెడ్డి స్కూటీని పంక్చర్‌ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు గుర్తించారు. 

Advertisement
Advertisement