అందరికీ వైద్యం | Sakshi
Sakshi News home page

అందరికీ వైద్యం

Published Thu, Sep 19 2019 10:27 AM

రాష్ట్ర ప్రజలకు నవంబర్‌ 1వ తేదీ నుంచి హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉన్న 150 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో (ఏపీలో ఇప్పటికే వైద్య సేవలు అందుతున్నాయి) ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. కొత్త ప్రతిపాదనలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింతగా విస్తరిస్తామని చెప్పారు. ఆరోగ్య శాఖలో సంస్కరణల కోసం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుజాతారావు అధ్యక్షతన నియమించిన నిపుణుల కమిటీ బుధవారం ముఖ్యమంత్రిని కలిసింది. సుమారు 100కు పైగా సిఫార్సులతో 182 పేజీల నివేదికను సమర్పించింది. ఈ నివేదికపై సుమారు 3 గంటల పాటు ముఖ్యమంత్రి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించి పలు అంశాలను వెల్లడించారు.