రాష్ట్రంలో తాజాగా జరగుతున్న పరిణామాలపై నాగబాబు ఆవేదన చెందుతూ.. తన యూట్యూబ్ చానెల్ ద్వారా ఓ సందేశాన్ని ఇచ్చారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఎందుకూ పనికి రాని వారికి క్రియేట్ చేస్తున్నారని.. తల్లిదండ్రులను, కమర్షియల్గా మారిన ఎడ్యుకేషనల్ సిస్టమ్పై ఫైర్ అయ్యారు. అయితే ఈ వీడియోలో నాగబాబు తమ కుటుంబ విషయాలు వెల్లడించారు.
చిరంజీవి డిగ్రీ పూర్తి చేశారని, ఇద్దరు సిస్టర్స్లో ఒకరు ఎంబీబీఎస్, మరోకరు డిగ్రీ పూర్తి చేశారని, పవన్ కళ్యాణ్ ఇంటర్ తరువాత ఐటీలో డిగ్రీ హోల్డర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఏనాడు తమ తల్లిదండ్రులు చదువు విషయంలో ఒత్తిడి చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియోలో పవన్ ఐటీ డిగ్రీ హోల్డర్ అని చెప్పిన విషయంపైనే అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.