కొంపముంచిన టమాటా రైస్‌ | Sakshi
Sakshi News home page

కొంపముంచిన టమాటా రైస్‌

Published Fri, Dec 14 2018 9:48 PM

గుడిలో పంచిపెట్టిన ప్రసాదం భక్తుల పాలిట  యమపాశమైంది.  కర్నాటక, చామరాజ్‌ నగర్ జిల్లాలోని సులివాడి గ్రామంలో  శుక్రవారం ఈ  విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా మారమ్మ దేవాలయం శంకుస్థాపన సందర్బంగా భక్తులకు పంపణీ చేసిన  ప్రసాదం విషపూరితం కావడంతో దాన్ని  స్వీకరించిన ఆరుగురు భక్తులు మృత్యువాత పడ్డారు. దాదాపు 80మందికి పైగా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో12మంది భక్తులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.