మురళీమోహన్‌ సహా ఐదుగురిపై కేసు నమోదు | Sakshi
Sakshi News home page

మురళీమోహన్‌ సహా ఐదుగురిపై కేసు నమోదు

Published Thu, Apr 4 2019 2:23 PM

రాజమండ్రి ఎంపీ, టీడీపీ నాయకుడు మురళీమోహన్‌పై సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం సాయంత్రం హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌లో పట్టుబడ్డ 2 కోట్ల రూపాయలకు సంబంధించి మురళీమోహన్‌తో పాటు మరో ఐదుగురిపై కూడా కేసు నమోదు చేసినట్టు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. వీరిలో ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉండగా, మురళీమోహన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.