గప్‌చుప్‌గా టీడీపీ నేతలు | Sakshi
Sakshi News home page

గప్‌చుప్‌గా టీడీపీ నేతలు

Published Mon, Oct 29 2018 10:43 AM

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోనే పథక రచన సాగించినట్లు తెలుస్తోంది. కోడిపందేలు, గుండాటల్లో ఆరితేరడం, దూకుడు స్వభావం, ఒకటి, రెండు కొట్లాటల్లో మారణాయుధాలతో దాడులకు తెగబడిన నేరచరిత్ర కలిగిన శ్రీనివాసరావును ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి ఎంపిక చేసుకున్నారు. రెండేళ్ల క్రితం స్వగ్రామం ఠానేలంకలో వివాహేతర సంబంధం విషయంలో ఘర్షణ,  2017లో బంధువుల వివాహంలో కొట్లాట, సరిహద్దు తగాదాలో ఒక ఉపాధ్యాయుడిపై కత్తితో దాడిచేసే ప్రయత్నంలో శ్రీనివాసరావు భయపడి ఊరి విడిచివెళ్లిపోవడం తదితర అంశాలపై ముమ్మిడివరం పోలీసు స్టేషన్‌లో కేసులున్నాయి.