'శత్రువుల ప్రాణాలు తీయడం దేశభక్తి' | Sakshi
Sakshi News home page

'శత్రువుల ప్రాణాలు తీయడం దేశభక్తి'

Published Wed, Jan 11 2017 1:20 PM

'దేశభక్తి అంటే దేశం కోసం ప్రాణాలు ఇచ్చేయడం కాదు.. శత్రువుల ప్రాణాలు తీయడం' అంటూ ఘాజీ చిత్రంలోని డైలాగ్‌ రోమాలు నిక్కపోడిచేలా ఉంది. ప్రముఖ టాలీవుడ్‌ నటుడు దగ్గుపాటి రానా, తాప్సీ ప్రధాన నాయక నాయికలుగా నటించిన ఘాజీ చిత్రం ట్రైలర్‌ వచ్చేసింది. ట్రైలర్‌ చూస్తున్నంత సేపు దేశభక్తి నరాల్లో పొంగడంతోపాటు ఏ క్షణం ఏం జరగనుందా అనే ఉత్కంఠ రేపేలా ఈ ట్రైలర్‌ ఉంది. 1971లో విశాఖపట్నంలోని భారత ప్రముఖ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ధ్వంసం చేసే లక్ష్యంతో పాకిస్థాన్‌కు చెందిన జలాంతర్గామి పీఎన్‌ఎస్‌ ఘాజీ భారత జలాల్లోకి ప్రవేశిస్తుంది.

Advertisement
Advertisement