గేట్లో మెరిసిన నిట్ విద్యార్థులు
తాడేపల్లిగూడెం: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2024) పరీక్షా ఫలితాల్లో ఏపీ నిట్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులతో మెరిశారు. ఈ వివరాలను గురువారం నిట్ అధికారులు తెలిపారు. జాతీయస్ధాయిలో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. జయంత్ హరిదాస్ పిశాల్ (బయో టెక్నాలజీ) 20వ ర్యాంకు, పూజారి కేశవ సుబ్రహ్మణ్యం (ఎలక్ట్రికల్) 32వ ర్యాంకు, పెద్ది సిద్ధార్థ(కెమికల్) 45వ ర్యాంకు, రామిరెడ్డి వెంకటసాయిరెడ్డి (బయో టెక్నాలజీ) 59వ ర్యాంకు సాధించారు. రుషినాఽథ్ (ఎంఎంఈ) 100వ ర్యాంకు, అభిరామ్ కల్లూరి (కెమికల్)103వ ర్యాంకు, ఆదిరాజు రామమోహన్ (సీఎస్ఈ) 124వ ర్యాంకు, సౌరవ్కుమార్ (ఎంఎంఈ) 135వ ర్యాంకు పొందారు. శశాంక్(బయోటెక్నాలజీ) 149వ ర్యాంకు, ఆరిఫ్ (ఎంఎంఈ) 154వ ర్యాంకు, బి.జీవన్ సంజయ్ (బయో టెక్నాలజీ) 177వ ర్యాంకు, మల్లా రామ్కుమార్ (కెమికల్) 351 జాతీయ ర్యాంకులను పొందారు.