No Headline
2014–2019 వరకూ టీడీపీ పాలనలో నాటి పాలకులు విజయనగరం జిల్లాకేంద్రంలో ఏవైనా భవనాలు నిర్మించారా అని ఆరాతీస్తే.. కనిపించేవి రెండే రెండు! వారు ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటున్న అన్న క్యాంటీన్ భవనాలే ఆ రెండూ!. అదీ 2019 సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలలు ముందు పెట్టినవే. అప్పట్లో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీకి చెందిన నిధులు కేటాయించి స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వద్ద ఒకటి, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగానున్న ప్రకాశం పార్కు వద్ద మరొకటి ప్రారంభించారు. వాటికీ టీడీపీ రంగు పసుపు వేసేసి ఎన్నికల ప్రచారానికి తెరలేపారు.