Sakshi News home page

అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కృషి

Published Tue, Nov 14 2023 4:20 AM

ప్రచారంలో మాట్లాడుతున్న మహేశ్‌రెడ్డి   - Sakshi

పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

పరిగి: అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని మాదారం, గడిసింగాపూర్‌ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... దేశానికి ఆదర్శంగా మన రాష్ట్ర పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణ రాక ముందు ఎలా ఉండే ప్రస్తుతం ఎలా ఉందో ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. మూడో సారి తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరవింద్‌రావు, జెడ్పీటీసీ సభ్యురాలు హరిప్రియ, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు

Advertisement

What’s your opinion

Advertisement