తెలంగాణ : లక్షకు చేరువలో కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

తెలంగాణ : లక్షకు చేరువలో కరోనా కేసులు

Published Fri, Aug 21 2020 8:28 AM

1967 New Coronavirus Cases Recorded In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1967 కరోనా వైరస్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.  26,767 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1967 మందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 99,391కి చేరింది. తాజాగా కరోనాతో 8 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 737కు పెరిగింది. కాగా బుధవారం  కొత్తగా 1781 మంది కోలుకోని ఆసుపత్రుల నుంచి డిశ్చార్చి అయ్యారు.  దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారి మొత్తం సంఖ్య 76,967కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 21,687 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 8,48,078 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది. తెలంగాణలో రికవరీ రేటు 73.91శాతం ఉందని బులెటిన్‌లో వెల్లడించింది.

Advertisement
Advertisement