క్లుప్తంగా | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Published Sat, May 25 2024 12:15 PM

క్లుప

వేడుకగా ఊంజల్‌ సేవ

తిరుత్తణి: పౌర్ణమి సందర్భంగా ద్రౌపదీదేవి ఊంజల్‌సేవను గురువారం రాత్రి నిర్వహించా రు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుత్తణి గాంధీ రోడ్డు మార్గంలోని ద్రౌపదీదేవి ఆలయంలో పౌర్ణమి పూజలు చేశారు. అమ్మవారికి విశిష్ట అభిషేక ఆరాధన పూజలు చేశారు. రాత్రి 8 గంటల సమయంలో ఊంజల్‌ సేవ సందర్భంగా ద్రౌపదీదేవి ఉత్సవమూర్తులకు పుష్పాలతో అలంకరించి, ఊంజల్‌ సేవ నిర్వహించారు.

దుకాణాల తొలగింపు

తిరువళ్లూరు: ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా రోడుకిరువైపులా వెలిసిన దుకాణాలను మున్సిపల్‌ అధికారులు పోలీసుల సహకారంతో శుక్రవారం ఉదయం నుంచి తొలగించారు. తిరువళ్లూరులోని సీవీనాయుడు రోడ్డు, జేఎన్‌ రోడ్డు, బజారువీధి, మార్కెట్‌, బస్టాండ్‌ ప్రాంతాల్లో రోడ్డుకిరువైపులా పండ్లు, పూల దుకాణా లు వెలిశాయి. ఈ దుకాణాలకు వచ్చే వారు అడ్డదిడ్డంగా వాహనాలను ఆపిపేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడి వాహనా ల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఇందులో భాగంగానే మున్సిపల్‌ కమిషనర్‌ సుభాషిణి, సీఐ అంథోని స్టాలిన్‌, మహిళ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ సెల్వరాణి ఆధ్వర్యంలో సిబ్బంది రోడ్డుకిరువైపులా ఉన్న దుకాణాలను తొలగించారు. దుకాణాలను తొలగించే సమయంలో వ్యాపారులకు, అధికారులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది.

క్లుప్తంగా
1/1

క్లుప్తంగా

Advertisement
 
Advertisement
 
Advertisement