కల్యాణోత్సవానికి ఎర్రబెల్లి గుట్ట ముస్తాబు

ఎర్రబెల్లిలో విద్యుత్‌ దీపాలతో శివపార్వతులు  - Sakshi

నిడమనూరు : జాతర సందర్బంగా ఎర్రబెల్లి లింగమంతుల స్వామి గుట్టను నిర్వాహకులు విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. ఆదివారం రాత్రి 2గంటల తర్వాత మానిక్యాలదేవి–లిగమంతుల స్వామిల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. కల్యాణోత్సవానికి ముందుగా మానిక్యాలదేవికి తల్లిగంపతో వేడుక నిర్వహించారు. సోమవారం తెల్లవారు జామునస్వామి వారి కల్యాణోత్సవం అనంతరం ఉదయం 8గంటలకు నైవేథ్యం(బోనాలు) సమర్పించనున్నారు. ఉమ్మడి నల్లగొండతో పాటు చుటుపక్కల జిల్లాలకు చెందిన యాదవులు, భక్తులు మూగజీవాలను స్వామి వారికి నైవేథ్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. గుట్ట చుట్టూ వ్యారస్తులు గుడారాలు వేశారు. గుట్టకు, మొట్లకు, కల్యాణ మండపానికి విద్యుత్‌ దీపాలను అలంకించారు.

Election 2024

Read latest Suryapet News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top