● ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి
ఆత్మకూరు: ‘ప్యాకేజీలకు లొంగి పార్టీ మారేవారితో ఎలాంటి నష్టం లేదు. రాష్ట్ర ప్రజలు పూర్తిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వైపే ఉన్నారు’ అని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 15, 16 వార్డుల్లో మాజీ జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో కలిసి ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిపక్షం కొంతమంది ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురిచేసి ప్యాకేజీలతో పార్టీలో చేర్చుకుంటోందన్నారు. దీంతో బలం పెరిగిందని అనుకుంటున్నారని, వాస్తవానికి అలాంటి వారికి ప్రజల ఆదరణ ఉండదన్నారు. గడిచిన మూడు రోజుల్లో పట్టణంలో వందల సంఖ్యలో వైఎస్సార్సీపీలో చేరారన్నారు. గతంలో కంటే మరింత మెజార్టీ సాధిస్తామన్నారు. ఎమ్మెల్యే ప్రతి ఇంటికీ తిరుగుతూ కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు అల్లారెడ్డి ఆనంద్రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ డాక్టర్ ఆదిశేషయ్య, నాయకులు ఐవీ రమణారెడ్డి, మైనార్టీ నాయకురాలు షేక్ పర్వీన్, ముజీబ్, షేక్ రహీం తదితరులు పాల్గొన్నారు.