Sakshi News home page

రూరల్లో ప్రశాంత వాతావరణం తీసుకొచ్చా

Published Wed, Apr 17 2024 12:10 AM

ప్రచారం చేస్తున్న ఆదాల, వైఎస్సార్‌సీపీ నాయకులు - Sakshi

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి

నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం తీసుకొచ్చినట్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. 18వ డివిజన్‌లోని హరనాథపురంలో ఒకటి నుంచి 5వ వీధి వరకు మంగళవారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదాల మాట్లాడుతూ తాను రూరల్‌ ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రౌడీయిజంపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. భవిష్యత్‌లో భూ కబ్జాలు, దౌర్జన్యాలు జరగకుండా చూస్తామన్నారు. డివిజన్‌లో పెండింగ్‌ పనులను పూర్తి చేశామన్నారు. మిగిలిన వాటిని ఎన్నికల అనంతరం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మేయర్‌ స్రవంతి, 18వ డివిజన్‌ కార్పొరేటర్‌ తోటకూర అశోక్‌కుమార్‌నాయుడు, నాయకులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, వేలూరు శివసునీల్‌రెడ్డి, వంశీ, రామిరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, పెనక రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement