మనుబోలు: ‘ఐదేళ్ల పాలనలో అన్ని విధాలుగా అండగా నిలిచాం. ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించండి’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కోరారు. మండలంలోని వడ్లపూడి, గొట్లపాళెం, లింగారెడ్డిపల్లి, రాజోలుపాడు, నాయుడుపల్లి, వీరంపల్లి తదితర గ్రామాల్లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఒక వైపు, హామీలను తుంగలో తొక్కి మోసం చేసిన చంద్రబాబు ఒక వైపు ఉన్నారని, ఎవరు కావాలో ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. తాను వ్యవసాయ శాఖ మంత్రి అయ్యాక మిల్లర్లను దూరం పెట్టి పారదర్శకంగా వ్యవహరించడంతో ధాన్యానికి గతంలో ఎన్నడూ లేనంత ధర లభిస్తోందన్నారు. పంటలకు సకాలంలో సాగునీరు అందించడమే కాకుండా వారికి అవసరమైన వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, విత్తనాలను ఆర్బీకేల ద్వారా అందించామన్నారు. కరోనాతో ప్రజలు తల్లడిల్లిపోతున్న సమయంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రజలను గాలికొదిలేశాడన్నారు. భయంతో బెంగళూరు, హైదరాబాద్లో తలదాచుకున్నాడన్నారు. తాను మాత్రం అన్ని రకాలుగా నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచానని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ బియ్యం, నూనె పంపిణి చేశామన్నారు. మరోసారి ప్రజలకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ గుండాల వజ్రమ్మ, ఎంపీటీసీ ఉన్నం లక్ష్మీనారాయణరెడ్డి, జట్టి సురేందర్రెడ్డి, బత్తల వెంకటేశ్వర్లురెడ్డి, చిట్టమూరు నరసారెడ్డి, ఈగా సురేష్, రఘురామిరెడ్డి, పెనుమల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
కాకాణి గోవర్ధన్రెడ్డి