● ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డి
కావలి: కావలిని కనకపట్నంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి పట్టణంలో ఎన్నికల క్యాంప్ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే కావలి సమగ్రాభివృద్ధి సాధ్యమన్నారు. కావలి నుంచి అత్యధిక మెజారిటీ సాధించడమే లక్ష్యంగా కృషి చేస్తున్న రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా త్వరలోనే అన్ని వార్డుల వారీగా కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉండేందుకు, పార్టీలో చేరికలను ప్రోత్సహించేందుకు కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మంచి చేసి ఉంటేనే ఓటు వేయమని అడిగిన ఏకైక నాయకుడు జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. ఎంపీగా విజయసాయిరెడ్డిని, ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని సీఎంగా మళ్లీ జగన్మోహన్రెడ్డిని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రానున్న రోజుల్లో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో అందించగలిగే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు మన్నెమాల సుకుమార్రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.