Sakshi News home page

ఓటు ఆవశ్యకతపై అవగాహన

Published Fri, Mar 29 2024 12:35 AM

- - Sakshi

బుచ్చిరెడ్డిపాళెం రూరల్‌: మండలంలోని పోలినాయుడుచెరువు గ్రామంలో స్వీప్‌ ఆధ్వర్యంలో ఓటుహక్కు ఆవశ్యకతపై ప్రజలకు గురువారం అవగాహన కల్పించారు. ప్రలోభాలకు గురికాకుండా నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు. నగదు తీసుకొని ఓటేస్తే ప్రశ్నించేతత్వాన్ని కోల్పోతారని వివరించారు. తద్వారా అభివృద్ధి పనులు జరగవన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతారణంలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. స్వీప్‌ నోడల్‌ ఆఫీసర్‌ రత్నం, రవిశంకర్‌రెడ్డి, మల్లేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement