Sakshi News home page

వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి

Published Mon, Mar 25 2024 9:15 AM

- - Sakshi

సిద్దిపేటకమాన్‌: ప్రశాంత వాతావరణంలో ప్రజలు హోలీ పండగను జరుపుకోవాలని సిద్దిపేట పోలీసు కమిషనర్‌ అనురాధ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సహజసిద్ధమైన రంగులతో హోలీ పండగను జరుపుకోవాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. లోతట్టు ప్రదేశాల్లో, చెరువుల్లో స్నానాలకు వెళ్లే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు సీపీ శుభాకాంక్షలు తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో యువత అతివేగం, ర్యాష్‌ డ్రైవింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌ లాంటివి చేయకూడదని సూచించారు.

Advertisement

What’s your opinion

Advertisement