ఈవీఎం, స్ట్రాంగ్‌ రూముల పరిశీలన | Sakshi
Sakshi News home page

ఈవీఎం, స్ట్రాంగ్‌ రూముల పరిశీలన

Published Sat, May 25 2024 1:40 PM

ఈవీఎం, స్ట్రాంగ్‌ రూముల పరిశీలన

పాల్గొన్న కలెక్టర్‌, వివిధ రాజకీయ పార్టీల

ప్రతినిధులు

ఒంగోలు అర్బన్‌: సాధారణ ఎన్నికలకు సంబంధించి జరిగిన పోలింగ్‌ అనంతరం ఈవీఎంలను భద్రపరిచిన రైజ్‌ ఇంజినీరింగ్‌ కాలేజిలోని స్ట్రాంగ్‌ రూములను కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థులతో కలిసి పరిశీలించారు. స్ట్రాంగ్‌ రూములకు వేసిన సీళ్లు, ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, భద్రతా చర్యలను పర్యవేక్షించారు. అనంతరం అక్కడే ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్‌ కేంద్రాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. కౌంటింగ్‌ రూముల్లోకి ఈవీఎంలను తీసుకువెళ్లేందుకు ఏజెంట్లను అనుమతించేందుకు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. లెక్కింపు ఫలితాలను ఎప్పటికప్పుడు డిస్‌ప్లే చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కలెక్టర్‌తో పాటు డీఆర్‌ఓ శ్రీలత, మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌మీనా, వైఎస్‌ఆర్‌ సీపీ ప్రతినిధి దామరాజు క్రాంతికుమార్‌, ఇతర పార్టీల ప్రతినిధులు రసూల్‌, కాలేషాబేగ్‌, రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement