2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలన్నీ నెరవేర్చారు. మళ్లీ నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోతో మీ ముందుకు వస్తున్నాం. హామీ ఇస్తే
నిలబెట్టుకునేది..నెరవేర్చేది ఎవరో? ఎవరి పాలనలో పింఛన్ లబ్ధిదారులు కష్టపడకుండా ఇంటిదగ్గరే పెన్షన్ అందుకున్నారో? అందరూ గుర్తెరగాలి. రైతులకు అన్ని రకాలుగా సహాయం అందించే ప్రభుత్వ ఏదో గుర్తించాలి. ఈ ప్రభుత్వం రాకముందు ప్రతిపక్ష టీడీపీ పాలనలో పడిన ఇబ్బందులు గుర్తు చేసుకోవాలి. ఆ నాటి కష్టాలు మళ్లీ ఎదురు కాకుండా ఉండాలంటే అధికార వైఎస్సార్సీపీని గెలిపించాలంటూ పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో జోరుగా దూసుకుపోతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు గ్రామాల్లోకి ఎన్నికల ప్రచారం కోసం వస్తుంటే ఆయా గ్రామాల ప్రజలు ఎదురేగి హర్షధ్వానాలతో స్వాగతం పలుకుతున్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు.