Sakshi News home page

త్వరితగతిన ఇళ్ల నిర్మాణం

Published Wed, Nov 15 2023 2:08 AM

మాట్లాడుతున్న ఐటీడీఏ పీఓ కల్పనాకుమారి   - Sakshi

సీతంపేట: గృహ నిర్మాణాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఐటీడీఏ పీఓ కల్పనాకుమారి అధికారులను ఆదేశించారు. ఐటీడీఏలో గృహనిర్మాణ అధికారులు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రారంభం కాని ఇళ్లను త్వరితగతిన ప్రారంభించేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. హౌసింగ్‌ లే అవుట్‌ల సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు.

అనంతరం బీఎల్‌ఓలతో సమావేశమై ఓటరు జాబితాలో ఎటువంటి తప్పిదాలు లేకుండా చూడాలని సూచించారు. మరణించిన ఓటర్ల పేర్లును నిబంధనల మేరకు జాబితా నుంచి తొలగించాలన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement