వైభవంగా శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం

Published Fri, Apr 19 2024 1:30 AM

స్వామివారికి పట్టాభిషేకాన్ని జరిపిస్తున్న అర్చకస్వాములు  - Sakshi

నెల్లిమర్ల రూరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రామతీర్థం శ్రీ రామస్వామివారి దేవస్థానంలో శ్రీరామచంద్రస్వామి పట్టాభిషేక మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ అర్చకుల సమక్షంలో వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు చేపట్టారు. యాగశాలలో సుందరకాండ హవనం, గాయిత్రి రామాయణ హవనం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. మహాపట్టాభిషేకం సజావుగా సాగాలని ముందుగా విశ్వక్సేనుడి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పూజా ద్రవ్యాలకు పుణ్యాహావచనం గావించి అష్టోత్తర సహస్ర నామార్చనలతో స్వామివారికి విశేష పూజలు చేశారు. శ్రీ సీతారామచంద్ర ప్రభువుల వారిని మంటపంలో ఆశీనులు చేసి రాములోరిని పట్టాభిషిక్తుడిని చేశారు. దీనికి ముందు స్వామివారి బంగారు కిరీటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణ నడుమ స్వామివారికి బంగారు కిరీట దారణ చేశారు. అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు, కిరణ్‌, తదితరులు స్వామివారి పట్టాభిషేక మహోత్సవ ఘట్టాన్ని జరిపించారు. కార్యక్రమంలో ఈఓ శ్రీనివాసరావు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement