Sakshi News home page

అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం

Published Tue, Apr 16 2024 3:35 AM

కుంద్రాలో వారోత్సవాలు జరుపుకొంటున్న సిబ్బంది  - Sakshi

జయపురం: జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. జయపురం సబ్‌డివిజన్‌ బొరిగుమ్మలో అగ్నిమాపక అధికారి ఉమేష్‌చంద్ర బాగ్‌ మాట్లాడుతూ 1944లో ముంబై డాక్‌యార్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో 66 మంది సిబ్బంది దుర్మరణం చెందారని, వారి సేవలకు గుర్తుగా ఏటా సహిద్‌ దినం, జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిబ్బంది దేవాసిస్‌ స్వై, రంజన్‌ మల్లిక్‌, రూసేబ్‌ పటేల్‌, ఆశిష్‌ పండా, ఢిల్లేశ్వర సెఠియ, హేమంత గొరడ పాల్గొన్నారు. కుంద్రాలోనూ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. అగ్నిమాపక అధికారి సరోజ్‌కుమార్‌ భుడియా, పీతాంబర్‌ బైరాగి, గురుదేవ్‌ నాయిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement