Sakshi News home page

బీజేపీకి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా..

Published Fri, Nov 10 2023 5:00 AM

-

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో ఒక్కసారి బీజేపీకి అవకాశమివ్వాలని, అభివృద్ధి చేసి చూపిస్తానని పార్టీ అభ్యర్థి ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తా పేర్కొన్నారు. నగరంలోని 10వ డివిజన్‌ నాగారంలోని గురువారం ఆయన ఇంటింటికీ బీజేపీ ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ధన్‌పాల్‌ మాట్లాడుతూ.. పేదల భూములకు రక్షణ లేకుండా పోయిందని, కాపాడే వారే కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నగరంలో అనేక కబ్జాలు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కనుసన్నల్లోనే జరిగాయన్నారు. కమీషన్లకు ఆశపడి అభివృద్ధిని మరిచారన్నారు. అర్బన్‌లో కాంగ్రెస్‌కు ఉనికి లేదని, బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తోడు దొంగలని విమర్శించారు. ఎన్నికల సమయంలో హడావుడి చేసి మాయమాటలు చెప్పి ఓట్లను కొల్లగొట్టేందుకు వచ్చే నాయకులను నమ్మొద్దని హితవుపలికారు. అంతకుముందు మహిళలు ఆయనకు మంగళహారతులతో స్వాగతం పలికారు. నాయకులు పుట్ట వీరేందర్‌, గంగాధర్‌, కార్పొరేటర్లు, నాయకులు స్రవంతిరెడ్డి, నాగోళ్ల లక్ష్మీనారాయణ, కిషోర్‌, కిరణ్‌, శివాజీ, పాల్గొన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌ అభ్యర్థి

ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తా

నగరంలో కొనసాగిన ప్రచారం

Advertisement

What’s your opinion

Advertisement