Sakshi News home page

బంఫర్‌ ఆఫర్లతో ఆకట్టుకునేలా..

Published Mon, Apr 15 2024 12:45 AM

-

హైదరాబాద్‌కు చెందిన పలు కళాశాలల యాజమాన్యాలు జిల్లాలో 50 మంది వరకు పీఆర్‌ఓలను నియమించుకున్నారు. వారు ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి బ్రోచర్లు ఇవ్వడం, తమ కళాశాలల్లో అందించే బోధన, వసతులు, ఏసీ క్యాంపస్‌లు తదితర విషయాలను వివరిస్తూ, తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు నెలల ముందు నుంచే ఈతతంగం మొదలైంది. వీరు అన్ని పాఠశాలల్లో విద్యార్థులు వివరాలు, ఫోన్‌ నంబర్లు, చిరునామాను సేకరించారు. విద్యార్థుల వివరాలు ఇచ్చినందుకుగాను ఆయా పాఠశాలల యాజమాన్యాలకు విందులు, నజరానాలు సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం విద్యార్థుల వివరాలు ఎవరికీ ఇవ్వకూడదు. కానీ కాసులకు కక్కుర్తిపడి కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల వివరాలను ప్రైవేటు కళాశాలలకు తెలియజేస్తున్నాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement