ప్రధాని మోదీకే ప్రజల మద్దతు
అచ్చంపేట రూరల్: దేశ ప్రజల మద్దతు ప్రధాని మోదీకే ఉందని.. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని ఎంపీ రాములు అన్నారు. శనివారం అచ్చంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి బీజేపీలో చేరినట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల నిర్వహించిన నాగర్కర్నూల్ పార్లమెంట్ విజయ సంకల్ప బహిరంగసభ దిగ్విజయం కావడం సంతోషకరమన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ విజయం ఖాయమన్నారు. కేంద్ర నిధులతో ఈ ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే కల్వకుర్తి – నంద్యాల జాతీయ రహదారి పనులను శరవేగంగా పూర్తిచేస్తున్నట్లు చెప్పారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ప్రసాద్ను గెలిపించి, ప్రధాని మోదీకి బహుమతిగా ఇవ్వాలని కోరారు. సమావేశంలో బాలాజీ, మంగ్యానాయక్, రేణయ్య, శ్రీనునాయక్, జానకి, పెద్దయ్య, నాగయ్యగౌడ్, దేవేందర్, ఖలీల్ ఉన్నారు.