నర్సాపూర్ : ఎన్నికల కమిషన్ రూపొందించిన సీ విజిల్ యాప్ను ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు సంజయ్కుమార్ సూచించారు. సోమవారం ఆయన నర్సాపూర్ నియోజకవర్గం మెదక్ మార్గం సరిహద్దు రాంపూర్ వద్ద, సంగారెడ్డి మార్గంలో మల్కాపూర్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాంపూర్ వద్ద యువకులు ప్రజలతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా నాయకులు ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుడి పేరు గోప్యంగా ఉంచుతారని, యాప్ ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయొచ్చని సూచించారు. 1950 టోల్ ఫ్రీ నంబరు ద్వారా సైతం ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. చెక్ పోస్టుల వద్ద 24 గంటల పాటు సీసీ కెమెరాలు పని చేసే విధంగా చూడాలని ఆదేశించారు. ప్రతీ వాహనాన్ని కుణ్ణంగా తనికీ చేయాలన్నారు.